మూడో రోజు కొనసాగుతున్న వైఎస్ జగన్ దీక్ష | YS Jagan Mohan Reddy Hunger strike continue on third day | Sakshi
Sakshi News home page

మూడో రోజు కొనసాగుతున్న వైఎస్ జగన్ దీక్ష

Oct 9 2015 8:28 AM | Updated on Mar 23 2019 9:10 PM

ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష మూడో రోజు కొనసాగుతోంది.

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష మూడో రోజు కొనసాగుతోంది. రాష్ట్రం నలువైపుల నుంచి ఆయన చేపట్టిన దీక్షకు మద్దతు వెల్లువెత్తుతోంది. సెల్ఫీ వీడియోల ద్వారా జగన్‌కు మద్దతు ప్రకటిస్తున్న వారిలో ప్రవాసులే ఎక్కువమంది ఉన్నారు.

ప్రత్యేకహోదా దక్కితే రాష్ట్రానికి కలిగే ప్రయోజనాల గురించి, అవకాశాలు విస్తృతమయ్యే విధానం గురించి నెటిజన్లు పోస్టుల ద్వారా వివరిస్తున్నారు. కాగా, గురువారం నాడు గుంటూరు వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి బీపీ చెక్ చేశారు. బుధవారం నాడు వైఎస్ జగన్ ప్రత్యేక హోదా సాధన కోసం గుంటూరులోని నల్లపాడులో నిరవధిక దీక్ష చేపట్టిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement