
ఓవర్టేక్ చేయబోయి..
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బెరైడ్డిపల్లె మండలం కైగల్ సమీపంలోని పలమనేరు-కుప్పం రహదారిలో - బొలెరో వాహనం
- లారీని ఢీకొన్న బొలేరో
- నలుగురి దుర్మరణం..మరో నలుగురికి గాయాలు
- మృతుల్లో వి.కోట తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది
పలమనేరు/ సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బెరైడ్డిపల్లె మండలం కైగల్ సమీపంలోని పలమనేరు-కుప్పం రహదారిలో - బొలెరో వాహనం లారీని ఢీకొనడంతో వి.కోట తహసీల్దార్తో పాటు అదే కార్యాలయంలో పనిచేస్తున్న మరో ముగ్గురు ఉద్యోగులు మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బెరైడ్డిపల్లె పోలీసుల కథనం మేరకు.. మదనపల్లెలో నిర్వహిస్తున్న రెవెన్యూ అసోసియేషన్ ఎన్నికల్లో పాల్గొనేందుకు వి.కోట తహసీల్దార్ మురళీధర్ (40), జూనియర్ అసిస్టెంట్ హరికృష్ణ(50), అటెండర్ కృష్ణవేణి(26), ఎంఆర్ఐ జాన్ సుందరం(45), సీనియర్ అసిస్టెంట్ బాలాజీరావు, క్లర్క్ స్వామినాథం పిళ్లై, బాలాజీరావు స్నేహితుడు లోకేష్, డ్రైవర్ ఆనంద్ ఆదివారం బొలెరో వాహనంలో బయలుదేరారు. కైగల్ సమీపంలో ముందు వెళుతున్న ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో బొలెరో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న సిమెంట్ మిక్చర్ లారీని ఢీకొంది. దీంతో తహసీల్దార్ మురళీధర్, జూనియర్ అసిస్టెంట్ హరికృష్ణ, అటెండర్ కృష్ణవేణి దుర్మరణం చెందారు. మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కుప్పం మెడికల్ కాలేజీలో పొందుతూ ఎంఆర్ఐ జాన్ సుందరం మృతి చెందారు. సంఘటనా స్థలాన్ని పలమనేరు డీఎస్పీ శంకర్ పరిశీలించారు.
ఉప ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి
రోడ్డు ప్రమాదంలో తహసీల్దారు సహా నలుగురు రెవెన్యూ ఉద్యోగులు మృతి చెందడం పట్ల ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపిందని రెవెన్యూ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.