'మూడు జిల్లాలకు తాగునీటి సంక్షోభం' | Minister narayana speaks over drinking water problems in AP | Sakshi
Sakshi News home page

'మూడు జిల్లాలకు తాగునీటి సంక్షోభం'

Jan 31 2016 11:14 AM | Updated on Aug 18 2018 5:57 PM

'మూడు జిల్లాలకు తాగునీటి సంక్షోభం' - Sakshi

'మూడు జిల్లాలకు తాగునీటి సంక్షోభం'

ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాలకు వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ సంవత్సరం తీవ్ర నీటి సమస్య పొంచి ఉందని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అన్నారు.

ఒంగోలు: ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాలకు వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ సంవత్సరం తీవ్ర నీటి సమస్య పొంచి ఉందని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అన్నారు. అలాగే, కృష్ణా జిల్లాకు కూడా కొంతమేర సమస్య ఉందన్నారు.

ఆదివారం ఒంగోలులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలకు తీవ్ర తాగునీటి సమస్య ఉందని చెప్పారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని నారాయణ అన్నారు. ఒంగోలు పట్టణానికి ఏడుగుళ్ల చెరువు నుంచి పైపులైన్ వేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడతామన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక నిధులు విడుదల చేసేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement