శ్రీకాకుళం సిటీ : శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం జాతీయ రహదారిపై ఈ నెల 10న గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన కేసును పోలీసులు చేధించారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ తన బంగ్లాలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సింగుపురం వద్ద ఈ నెల 10న గుర్తు తెలియని వాహనం ఢీకొని అదే గ్రామం చిన్నవీధికి చెందిన పిన్నింటి సూరయ్య(70) మృతి చెందినట్టు చెప్పారు.
దీనికి కారణమైన సోంపేటకు చెందిన చర్చి ఫాస్టర్ బి.సూర్యాకాంత్ పాణిగ్రహిని సీసీ కెమెరా, కాల్ డేటా సాయంతో ఎట్టకేలకు గుర్తించి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ కేసును నీరుగార్చేందుకు సహకరించిన ఓ సీఐపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించామని, కేసు దర్యాప్తును సరిగా చేయనందుకు శ్రీకాకుళం రూరల్ ఎస్ఐ మధుసూదనరావును వీఆర్కు పంపినట్టు చెప్పారు. అనుకోని ప్రమాదాలు జరిగిన సమయంలో 108 లేదా 100కు సమాచారాన్ని అందజేయూలని ఎస్పీ కోరారు.
చర్చి ఫాస్టర్ ఏమన్నారంటే...
శ్రీకాకుళం కిమ్స్ సమీపంలో ఉన్న ఓ ఫంక్షన్కు ఈ నెల 10వ తేదీన ఎనిమిది మందితో కలిసి టాటా సుమో వాహనంపై సోంపేట నుంచి వచ్చామని, సింగుపురం జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని అనుకోకుండా ఢీకొట్టామని అంగీకరించారు. అక్కడ నుంచి భయంతో వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయూమని చర్చి ఫాస్టర్ బి. సూర్యాకాంత్ పాణిగ్రహి విలేకరులకు వెల్లడించారు.
పోలీసుల ఆరా...
ఎస్పీగా బ్రహ్మారెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లాలో హిట్ అండ్ రన్ కేసులపై దృష్టి సారించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. డీఎస్పీ కె.భార్గవరావునాయుడు మాట్లాడుతూ ఓ తెల్లటి సుమో వాహనం సింగుపురం వద్ద ఓ వ్యక్తిని ఢీకొని పరారైనట్లు స్థానికులు తెలిపారని చెప్పారు. ఆ వాహనం కిమ్స్ వద్ద ఉన్నట్లు సమాచారం రాగా ఆ వాహనాన్ని, డ్రైవర్ను అదుపులోనికి తీసుకున్నామని తెలిపారు. అయితే టోల్గేట్ వద్ద సీసీ కెమెరాల పుటేజిని పరిశీలించగా ఆ వాహనాన్ని నడిపిన వ్యక్తి తెల్లటి వస్త్రాలు ధరించినట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. ఫాస్టర్ సూర్యాకాంత్ వాహనాన్ని డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్కు కారణం కాగా సంబంధం లేని డ్రైవర్ను ఈ కేసులో ఇరికించారన్నాని చెప్పారు. ఫాస్టర్ కాల్డేటాను పరిశీలించగా ప్రమాదం జరిగిన రోజున రాత్రి ఓ సీఐతో మూడు గంటల పాటు మాట్లాడినట్లు గుర్తించామని దీని ఆధారంగానే కేసును చేధించామని తెలిపారు.
డీఎస్పీ, సీఐలకు అభినందనలు
ఈ కేసును పకడ్బందీగా చేధించినందుకుగాను శ్రీకాకుళం డీఎస్పీ కె.భార్గవరావునాయుడు, సీఐ అప్పలనాయుడుకు ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి అభినందించారు.
సీసీ కెమెరా.. కాల్డేటా సాయంతో...
Published Sat, Jun 18 2016 11:35 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement