కర్నూలు, అనంతపురం జిల్లాలను అకాల వర్షాలు ముంచేత్తాయి.
కర్నూలు: కర్నూలు, అనంతపురం జిల్లాలను అకాల వర్షాలు ముంచేత్తాయి. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కర్నూలు పట్టణంలోని బుధవారపేటలో గోడకూలి ఓ బాలుడు మృతి చెందగా మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఉరవకొండ, పత్తికొండ, కోవెలకుంట్ల, బనగానపల్లె, ఆలూరు, ఆస్పరి, ఆళహరి మండలాల్లో భారీగా వర్షం కురుస్తుంది. కర్నూలు బురుజుల, చిన్నహుల్తీ వద్ద వాగులు పొంగిపోర్లుతున్నాయి. దీంతో ఆదోని-పత్తికొండ, పత్తికొండ-గుంతకల్లు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అనంతలో దోనేకల్లు వద్ద జాతీయ రహదారిపై నీరు చేరడంతో కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రెండు జిల్లాల్లో భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకురాయి. జిల్లా కలెక్టర్లు, అధికారులు ఎప్పటికప్పుడూ పరిస్థితులను సమీక్షిస్తున్నారు.