విద్యుత్‌ షాక్‌తో వ్యవసాయ కూలీ మృతి | Farm laborer killed by electric shock | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో వ్యవసాయ కూలీ మృతి

Sep 27 2016 12:26 AM | Updated on Jun 4 2019 5:16 PM

మండల పరిధిలోని బట్రేపల్లి పంచాయతీలోని మూలపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ టి.రమణయ్య(45) విద్యుదాఘాతంతో మృతి చెందాడు.


మూలపల్లి (తలుపుల) : మండల పరిధిలోని బట్రేపల్లి పంచాయతీలోని మూలపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ టి.రమణయ్య(45) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మృతుడి బంధువులు తెలిపిన మేరకు.. రమణయ్య నూతనంగా ఆర్డీటీ ద్వారా ఏర్పాటు చేసుకుంటున్న గృహాల వద్ద ఉన్న పంచాయతీ బోరు నుంచి నీరు పట్టుకుంటున్నాడన్నారు. అయితే అప్పటికే అక్కడున్న ఓ పైప్‌కు విద్యుత్‌ సరఫరా అవుతోంది. ఇది గమనించని రమణయ్య పైప్‌ను తాకగానే విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. స్థానికులు  వైద్యచికిత్సల నిమిత్తం కదిరికి తరలించగా అప్పటికే మృతి చెందాడన్నారు. మృతుడికి భార్య గంగోజమ్మ, కుమారుడు సూరి ఉన్నారు. ఎస్‌ఐ చంద్రశేఖర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement