
జ్యోతి నన్ను క్షమించు..
కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎస్ఐ జగన్మోహన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు రాసిన సుసైడ్ నోటును శనివారం పెద్దపల్లి డీఎస్పీ మల్లారెడ్డి శనివారం మీడియాకు విడుదల చేశారు.
♦ నాలుగు రోజుల క్రితమే జమ్మికుంటకు ఎస్ఐ జగన్మోహన్ బదిలీ
♦ అన్యాయంగా బదిలీ చేశారంటూ మనస్తాపం!
♦ సర్వీసు రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య
కరీంనగర్: కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎస్ఐ జగన్మోహన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు రాసిన సుసైడ్ నోటును శనివారం పెద్దపల్లి డీఎస్పీ మల్లారెడ్డి శనివారం మీడియాకు విడుదల చేశారు. పెద్దపల్లి ఎస్ఐ జగన్మోహన్ శుక్రవారం రాత్రి తన సర్వీసు రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఎస్ఐ జగన్మోహన్ రాసిన సుసైడ్ నోటులో విషయాలు ఇలా ఉన్నాయి..
►చివరి కోరికగా నా తమ్ముడిని ఏసీపీ కేసు నుంచి తప్పించండి
► మీరు సీఎం అయ్యాక పోలీసులకు ఎన్నో సదుపాయాలు కల్పించారు
► ఎస్ఐలపై ఎస్హెచ్వోలపై పనిభారం ఎక్కువగా ఉంది. గమనించగలరు
► సీఐ మహేష్, శ్రీనివాసరావు, ప్రశాంత్, డీఎస్పీ మీరంతా మంచివాళ్లు
► ఎక్కడా మీ గురించి తప్పుగా మాట్లాడలేదు
► వెంకటేశ్వరరెడ్డి, ఉమ మేడమ్లు తల్లిదండ్రులుగా చూసుకున్నారు
► సిటీ కేబుల్ గొడవతో తనకేమి సంబంధం లేదు
► డిసెంబర్ 31 ఉద్దేశపూర్వకంగా ఫ్లెక్సీలు తొలగించలేదు
► ఎమ్మెల్యే గారు తొలగించమని చెప్పలేదు
► ఎస్ఐ రాజకుమార్ బాధపడకు.. ఎస్పీని నమ్మించగలవు
► నా టైంలో ఒక ఎస్ఐ సుసైడ్ చేసుకున్నాడని మీరు ఫీలవుతారు
► కానీ బాధపడకు.. పెద్దపల్లిలో ఉన్న అప్పులు ఆనంద్ చెల్లిస్తాడు
► ఎమ్మెల్యే గారు బాధపడకండి.. నా చావుకు ఎవరు కారణం కాదు
► జ్యోతి నన్ను క్షమించు.. నీకు ఏమీ చేయలేదు
► తమ్ముడు కిరణ్ ఇంట్లో.. నా ఇంట్లో ఫోటో పెట్టకు
► పెళ్లి చేసుకో.. మూడు నెలల్లో సంవత్సరికం పెట్టి పెళ్లి చేసుకో..
► నాకు ఏమైనా డబ్బులు వస్తే ఇంటిలోను కట్టు
► దయచేసి నా శరీరాన్ని పోస్టుమార్టం చేయవద్దు
► నా కస్టడీలో ఒక మనిషి చనిపోయినప్పుడే.. చనిపోవాలనుకున్నా..