'హోదాపై వ్యంగ్యంగా మాట్లాడటం సిగ్గుచేటు' | CPI leader ramakrishna criticises chandra babu on special status issue | Sakshi
Sakshi News home page

'హోదాపై వ్యంగ్యంగా మాట్లాడటం సిగ్గుచేటు'

Oct 11 2015 1:37 PM | Updated on Mar 23 2019 9:10 PM

ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు ఉంటుందని రాష్ట్ర సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు.

చిత్తూరు: ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు ఉంటుందని రాష్ట్ర సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా చిత్తూరులో సీసీఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన పట్టణంలోని మీడియాతో మాట్లాడారు.

ప్రత్యేక హోదా అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు వ్యంగ్యంగా మాట్లాడటం నిజంగా సిగ్గుచేటన్నారు. ప్రత్యే హోదా వల్లే ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్ అభివృద్ధి సాధించాయని పేర్కొన్నారు. చంద్రబాబుకు కేవలం ప్రచారం పిచ్చిపట్టిందని రామకృష్ణ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement