అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లె వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది.
అనంతపురం: అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లె వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. అదుపు తప్పి ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో 17 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
తాడిపత్రి నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.