ముగ్గురు ప్రాణాలు తీసిన ఫొటో సరదా

Three Engineering Students Died In Shamshabad By Felling Into Quary - Sakshi

శంషాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం కొత్వాల్‌గూడలో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ క్వారీలో ఈత కొట్టేందుకు వచ్చిన ముగ్గురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు ప్రమాదవశాత్తూ కాలుజారి గుంతలో పడి మృతిచెందారు. ఫొటోలు తీసుకునే క్రమంలో వీరు ఈత కొడుతూ గుంతలోకి జారి పడ్డారు. మృతులు హైదరాబాద్‌ నగరంలోని బోరబండకు చెందిన భార్గవ్‌, చంద్ర, సూర్యగా గుర్తించారు. వీరిలో ఇద్దరు అన్నదమ్ములున్నారు. ఈ విషాదానాకి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీసేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top