
ఆటోడ్రైవర్ అరెస్ట్.. జైలుశిక్ష
సాక్షి,సిటీబ్యూరో:మహిళలను వెంటపడి వేధించడం ఒక్కటే కాదు.. కనీసం చూపులతో ఇబ్బంది పెట్టినా సరే ఊచలు లెక్కించాల్సిదే. ఇలాంటి ఘటన నగరంలో చోటుచేసుకుంది. ఆటోలో ఎక్కిన ఓ ప్రయాణికురాలిని ‘చూపుల’తో ఇబ్బంది పెట్టినందుకు ఓ ఆటో డ్రైవర్ను షీ–టీమ్ అరెస్టు చేసింది. ఇతడిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జైలు శిక్ష విధించినట్లు అదనపు సీపీ షికా గోయల్ మంగళవారం తెలిపారు. ఆసిఫ్నగర్కు చెందిన ఓ మహిళ మెహిదీపట్నంలో పనిచేస్తోంది. గత నెల 25న ఈమె తన కార్యాలయం నుంచి ఆటోలో ఇంటికి బయలుదేరింది. డ్రైవర్ మహ్మద్ మొహినుద్దీన్ ఆటోలో ఉన్న అద్దాన్ని తిప్పుతూ మహిళను చూడసాగాడు.
బాధితురాలు షీ–టీమ్స్కు ఫిర్యాదు చేయగా.. గోల్కొండ ప్రాంతానికి చెందిన మొహినుద్దీన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచాయి. న్యాయమూర్తి నిందితుడిని దోషిగా తేలుస్తూ 14 రోజుల జైలు శిక్ష విధించారు. మరోపక్క పరిచయస్తురాలైన మహిళను బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యక్తిని షీ–టీమ్స్ పట్టుకున్నాయి. మీర్చౌక్ ప్రాంతానికి చెందిన హాదీ అలీ తనకు పరిచయస్తురాలైన ఓ వివాహితకు అర్ధరాత్రి వేళల్లో ఫోన్లు చేస్తున్నాడు. తన మాట వినకుంటే గతంలో సంగ్రహించిన ఫొటోలను భర్తతో పాటు బంధువులకూ పంపిస్తానంటూ బెదిరిస్తున్నాడు. దీంతో బాధితురాలు షీ–టీమ్స్ను ఆశ్రయించింది.రంగంలోకి దిగినబృందాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి. తప్పు అంగీకరించిన అతనుక్షమించమని బాధితురాలిని ప్రాధేయపడ్డాడు. దీంతో మరోసారి తప్పు చేయనంటూ లేఖ రాయించడంతో పాటు కౌన్సెలింగ్ చేసి వదిలిపెట్టారు.