హైదరాబాద్లో కలకలం
సాక్షి, హైదరాబాద్ : నగరంలో అర్థరాత్రి కలకలం రేగింది. ఎల్బీ నగర్ ఆర్టీసీ కాలనీలో జ్యూస్ పాయింట్ వద్ద సిలిండర్ పేలడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. మంటలు దగ్గరలోని మిర్చి సెంటర్కు కూడా అలుముకోవడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
పేలుడి ధాటికి జ్యూస్ పాయింట్ పక్కనే ఉన్న కారు కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.