కర్నూలు జిల్లాలో 'పోరుబాట' | YSR Congress Party poorubata In Kurnool District | Sakshi
Sakshi News home page

కర్నూలు జిల్లాలో 'పోరుబాట'

Nov 5 2014 2:19 PM | Updated on Jul 25 2018 4:07 PM

ఎన్నికల సమయంలో హామీలు గుప్పించి ... అధికారాన్ని చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనను....

కర్నూలు : ఎన్నికల సమయంలో హామీలు గుప్పించి ... అధికారాన్ని చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనను ఎండగట్టేందుకు ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కర్నూలు జిల్లాలో పోరుబాట నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ఈ ధర్నా కార్యక్రమాలలో డ్వాక్రా మహిళలు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాటి వివరాలు....

 

డోన్: డోన్లో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుకా, ఎమ్మెల్యే మణిగాంధీ, దోర్నిపాడు విజయా డెయిరి ఛైర్మన్ భూమా నారాయణరెడ్డి పాల్గొన్నారు.
ఆదోని: స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో రైతులు, మహిళలు, పార్టీ కార్యకర్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కర్నూలు: నగరంలో ఎస్వీ మోహన్రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement