గవర్నర్తో సమావేశమైన వైఎస్ జగన్ | YS Jagan Mohan Reddy meets Governor ESL Narasimhan | Sakshi
Sakshi News home page

గవర్నర్తో సమావేశమైన వైఎస్ జగన్

May 4 2015 11:59 AM | Updated on Jul 25 2018 4:09 PM

గవర్నర్తో సమావేశమైన వైఎస్ జగన్ - Sakshi

గవర్నర్తో సమావేశమైన వైఎస్ జగన్

వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు, పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం గవర్నర్ తో సమావేశం అయ్యారు.

హైదరాబాద్: వైఎస్సార్ సీపీ నేతలపై వరుసగా జరుగుతున్నదాడుల ఘటనలకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు వైఎస్సార్ సీపీ ఫిర్యాదు చేసింది.  వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు, పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం గవర్నర్ తో  సమావేశం అయ్యారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం వైఎస్సార్ సీపీ నేతలపై జరుగుతున్న దాడులను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు.
 
గత కొన్ని రోజుల క్రితం అనంతపురం జిల్లా రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేత భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి దారుణ హత్యకు గురైన ఘటన సంచలనం సృష్టించింది. వైఎస్సార్ సీపీ నేతలే లక్ష్యంగా జరుగుతున్న దాడులపై సమీక్ష నిర్వహించాలని గవర్నర్కు వైఎస్సార్ సీపీ విన్నవించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement