ఆ ఆరుగురు జాలర్లు సురక్షితం | six ap fishermen found | Sakshi
Sakshi News home page

ఆ ఆరుగురు జాలర్లు సురక్షితం

Jul 3 2015 1:46 PM | Updated on Sep 3 2017 4:49 AM

బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లి 20 రోజుల క్రితం గల్లంతైన ఆరుగురు మత్య్సకారులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందింది.

మచిలీపట్టణం(కృష్ణా జిల్లా): బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లి 20 రోజుల క్రితం గల్లంతైన ఆరుగురు మత్య్సకారులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందింది.

కృష్ణా జిల్లా జిలకలబిండికి చెందిన నాగూర్, నాగరాజులు నెల్లూరు జిల్లాకు చెందిన మరో నలుగురు జాలర్లను ఒరిస్సా రాష్ట్రంలోని పారదీప్‌కు 40నాటికన్‌మైళ్ల దూరంలో శుక్రవారం గుర్తించినట్లు నౌకాదళం ప్రకటించింది. దీంతో వారి ఆచూకీకోసం తల్లడిల్లుతోన్న కుటుంబసభ్యులు కాస్త ఊరటచెందారు. ఈరోజు సాయంత్రానికి వారిని ఒరిస్సాకు చేర్చి అక్కడినుంచి మలిచిపట్టణంకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement