నేడు రాజ్‌నాథ్ రాక

నేడు రాజ్‌నాథ్ రాక - Sakshi


కీసర, న్యూస్‌లైన్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ గురువారం జిల్లాకు రానున్నారు. కీసర మండ లం తిమ్మాయిపల్లి సమీపంలో గల ఓ ఫామ్‌హౌస్‌లో నిర్వహించే సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఆర్‌ఎస్‌ఎస్, పార్టీ వర్గాలు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాయి. ఇందులో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, విశ్వహిం దూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా కూడా పాల్గొననున్నట్టు సమాచారం. వీరంతా బుధవారం సాయంత్రమే హైదరాబాద్ చేరుకున్నారు. ఉదయం 9 గంట ల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించే సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశాలున్నాయి. ఈ నెల 12 వరకు సమావేశాలను కొనసాగిస్తారని తెలిసింది. రాజ్‌నాథ్ రాక సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం డాగ్‌స్వ్కాడ్‌తో ఫామ్‌హౌస్ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top