లారీ ఢీకొని వ్యక్తి మృతి | man died in lorry accident at vijayanagarm | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని వ్యక్తి మృతి

Published Wed, Aug 5 2015 9:48 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

లారీ రివర్స్ తీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ అక్కడ ఉన్న కార్మికుడిని ఢీకొట్టింది.

వేపాడ(విజయనగరం): లారీ రివర్స్ తీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ అక్కడ ఉన్న కార్మికుడిని ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా వేపాడ మండలం సోంపురం గ్రామంలోని క్రషర్ వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగింది. గ్రామానికి చెందిన జొన్నపల్లి శ్రీను(35) క్రషర్‌లో కూలీగా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో రాత్రి రివర్స్ తీస్తున్న లారీ ఢీకొంది. దీంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement