రాయలసీమ ప్రాంతానికి సీఎం చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నారని బీజేపీ జిల్లా నాయకులు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు.
నందికొట్కూరు: రాయలసీమ ప్రాంతానికి సీఎం చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నారని బీజేపీ జిల్లా నాయకులు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. మంగళవారం కర్నూలు జిల్లా నందికొట్కూరులో మల్యాల ఎత్తిపోతల పథకం, హంద్రీనీవా పథకాలను ఆయన ఆధ్వర్యంలోని బృందం పరిశీలించింది. రాయలసీమపై సీఎంకు అమిత ప్రేమ ఉంటే అనంతపురం జిల్లాకు నీరిస్తూ కర్నూలు జిల్లాకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని కాటసాని ప్రశ్నించారు. ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ, ఎస్ఆర్ఎంపీ ప్రాజెక్టుల నుంచి రెండు రోజుల్లోగా నీరు విడుదల చేయాలని, లేకుంటే రైతులతో కలసి తామే గేట్లను ఎత్తివేస్తామని హెచ్చరించారు.