మార్చి 1 నుంచి అన్ని
ఫైళ్లు ఆన్లైన్లోనే
31 తర్వాత కాగితాలు, బీరువాలు కనిపించరాదు
ఈ-ఆఫీసు నిర్వహణపై కలెక్టర్
సీహెచ్ విజయమోహన్
కర్నూలు(అగ్రికల్చర్): మార్చి 1 నుంచి అన్ని రకాల ఫైళ్లు ఆన్లైన్ ద్వారానే రావాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధికారులను ఆదేశించారు. ఇకపై మాన్యువల్ ఫైల్స్ను చూడబోనని స్పష్టం చేశారు. ఈ-ఆఫీసుల నిర్వహణలో తొలుత తన కార్యాలయమే అన్ని శాఖలకు ఆదర్శంగా ఉండాలని, ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్లోని అన్ని సెక్షన్ల సూపరింటెండెంట్లు, సిబ్బందితో గురువారం ఈ-ఆఫీసుల అమలుపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ విధి విధానాలను వివరించారు. ‘ఈ రోజు నుంచి ఈ- ఆఫీసు అమలుపై పూర్తిగా దృష్టి పెట్టండి. మార్చి 1 నుండి పూర్తిస్థాయిలో అమలులోకి రావాలి. అర్జంట్ ఫైళ్లు కూడా ఆన్లైన్ ద్వారానే రావాలి, ఆలస్యమైతే సంబంధిత సెక్షన్ సూపరింటెండెంట్, సిబ్బందిదే బాధ్యత. జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్ మొదలు డీఆర్ఓ వరకు ఆన్లైన్ ద్వారానే ఫైళ్లు నిర్వహించాలి. డిజిటల్ సిగ్నేచర్ కీ లను వినియోగించాలి. అన్ని ఫైళ్లు, రికార్డులను బైండింగ్ చేయించి డీఓఎం ప్రకారం రికార్డు గదికి పంపాలి. మార్చి 31 తర్వాత ఏసెక్షన్లోనూ సిస్టమ్స్ తప్ప కాగితాలు, బీరువాలు కనిపించరాదు. ఇందుకోసం అన్ని ఫైళ్లు, రికార్డులను స్కాన్ చేసి కంప్యూటర్లో నిక్షిప్తం చేసుకోండి’ అని కలెక్టర్ ఆదేశించారు.
సమయానికి వచ్చి వెళ్లండి..
ప్రతి ఒక్కరు కచ్చితమైన సమయానికి విధులకు హాజరై అంతే కచ్చితమైన సమయానికి ఇంటికి కూడా వెళ్లవచ్చని కలెక్టర్ తెలిపారు. ఇందుకోసం బయోమెట్రిక్ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. అయితే ప్రతి ఒక్కరు ఇళ్లలో సిస్టమ్స్ పెట్టుకొని ఇంటర్నెట్ సౌకర్యం తీసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో ఇంటి నుంచే పైళ్లు పంపేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కంప్యూటర్ల కోసం లోన్లు కూడా ఇప్పిస్తామని తెలిపారు. సమావేశంలో డీఆర్ఓ గంగాధర్గౌడ్, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వెంకట నారాయణ, సెక్షన్ సూపరింటెండెంట్లు రామాంజనమ్మ, అన్వర్ ఉసేన్, ప్రియదర్శిని, భాగ్యలక్ష్మి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఇకపై అంతా ఆన్లైన్లోనే
Published Fri, Feb 26 2016 3:11 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రాములమ్మ ఆలోచనలు ఏంటి? కాంగ్రెస్లో కొనసాగుతారా.. లేక?
దిగ్గజ బ్యాంకర్ 'నారాయణన్ వాఘుల్' కన్నుమూత
వేగంగా దర్యాప్తు జరిపి, నిందితులను అరెస్టు చేస్తాం: ఐజీ వినీత్ బ్రిజ్లాల్
‘‘స్వాతి మలివాల్కు సీఎం అపాయింట్మెంట్ లేదు’’
పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా జితేష్ శర్మ..
Summer special థండయ్ కుల్ఫీ రెసిపీ
రోహిత్తో నీతా అంబానీ సీరియస్ డిస్కషన్.. వీడియో వైరల్
Music Shop Murthy: ఆకట్టుకుంటున్న రాహుల్ సిప్లిగంజ్ ‘అంగ్రేజీ బీట్’ సాంగ్
Serial Actor Chandu: నేను పిచ్చివాడినైపోతా.. నటుడు చందు చివరి మాటలు వైరల్
200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
తప్పక చదవండి
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
- స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
Advertisement