44 కేంద్రాల పరిధిలో 95 శాతం హాజరు నమోదు
సత్ఫలితాలిచ్చిన అధికారులు,పోలీస్ శాఖ, విద్యాసంస్థల కృషి
విద్యాలయాల బస్సులు,పోలీస్ వాహనాలు, ఆర్టీసీ అద్దె బస్సుల్లో విద్యార్థుల తరలింపు
విజయవంతంగా ముగియడంతో ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం
గుంటూరు ఎడ్యుకేషన్ : ఆర్టీసీ సమ్మె టెన్షన్ పెట్టినా...జిల్లా అధికారయంత్రాంగం, పోలీస్ శాఖ, విద్యాసంస్థల యాజమాన్యాల కృషి ఫలితంగా ఎంసెట్ ప్రశాంతంగా ముగిసింది. గుంటూరు నగరంతో పాటు నరసరావుపేట, చిలకలూరిపేట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 44 కేంద్రాల పరిధిలో 95 శాతం హాజరు నమోదైంది. శుక్రవారం నిర్వహించిన ఇంజినీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష...ఎంసెట్-2015కు హాజరయ్యేందుకు విద్యార్థులు ఆందోళన పడ్డారు.
ఓ వైపు నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమన్న అధికారుల ప్రకటన, మరోవైపు ఆర్టీసీ సమ్మె కారణంగా సకాలంలో చేరుకుంటామో లేదో అని విద్యార్థులు ఆందోళన చెందినా అధికారులు, విద్యాసంస్థల యాజమాన్యాలు చేసిన ఏర్పాట్లతో సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.ఉదయం 38 కేంద్రాల్లో జరిగిన ఇంజినీరింగ్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసిన 19,878 మంది విద్యార్థుల్లో 19,020 మంది హాజరయ్యారు. 95.68 శాతం హాజరు నమోదైంది.
మధ్యాహ్నం జరిగిన మెడిసిన్, అగ్రికల్చర్ పరీక్షలకు దరఖాస్తు చేసిన 7,739 మంది విద్యార్థుల్లో 7,326 మంది హాజరుకాగా, 94.66 శాతం హాజరు నమోదైంది.ఆర్టీసీ సమ్మె కారణంగా, జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థులు గురువారం అర్ధరాత్రికి నగరానికి చేరుకుని బస్టాండ్ ప్రాంగణంలోనే నిదురించారు. జిల్లా అధికార యంత్రాం గం చేసిన ఏర్పాట్లతో ఆర్టీసీ బస్సులు, పోలీసు వాహనాలు, విద్యాసంస్థల బస్సుల్లో విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేర్చారు. పోలీసులు, ఆర్టీసీ అధికారులు స్వయంగా విద్యార్థులను ఆర్టీసీ అద్దెబస్సుల్లోకి ఎక్కించి పంపారు.
హెల్ప్లైన్ కేంద్రాల ద్వారా సేవలు ...
ఎంసెట్ విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంలో సహాయపడేందుకు పోలీసుశాఖ నగరం లోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ కేంద్రాలు ప్రశంసనీయ రీతిలో సేవలు అందించాయి. పోలీసు సిబ్బందితో పాటు ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులకు సూచనలు ఇవ్వడంతో పాటు దగ్గరుండి బస్సులు ఎక్కించారు.
పరీక్షలు ముగియడంతో స్వస్థలాలకు పయనం ...
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చి గుంటూరులోని ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో చదువుకున్న విద్యార్థులు ఎంసెట్ ముగియడంతో హాస్టళ్లను ఖాళీ చేసి స్వస్థలాలకు పయనమయ్యారు. సమ్మె కొనసాగుతున్నప్పటికీ అధికారులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ అద్దె బస్సులు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కిక్కిరిసిపోయాయి.
ఆర్టీసీ బస్సులతో పాటు రైళ్ల ద్వారా విద్యార్థులు తమ స్వస్థలాలకు పయనమయ్యారు. ఎంసెట్ ప్రశాంతంగా జరగడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. జిల్లా అధికార యంత్రాంగం, పోలీసుశాఖ, విద్యాసంస్థల యాజమాన్యాల సహకారంతో ఎంసెట్ విజయవంతంగా ముగి సిందని ఎంసెట్ ప్రాంతీయ సమన్వయకర్త ఆచార్య పి.సిద్ధయ్య తెలిపారు.
టెన్షన్ పెట్టినా...సెట్ చేశారు
Published Sat, May 9 2015 3:11 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
దేవర సాంగ్ ప్రోమో.. ఆ రోజు ఇక గూస్బంప్సే!
Sangeetha Sringeri: పునీత్ రాజ్కుమార్ సమాధి వద్ద నటి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
ఇదే చివరిది: అతిచిన్న, పాపులర్ వ్లాగర్ ఎమోషనల్ వీడియో వైరల్
కేజ్రీవాల్ నివాసానికి స్వాతి మలీవాల్.. సీన్ రీ కన్స్ట్రక్షన్?
కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
సీరియల్లో హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపిన నటి.. ఫైన్ కట్టాల్సిందే!
మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం.. ఈడీ చరిత్రలో తొలిసారిగా
సంతోషంలో కావ్యా మారన్.. కేన్ విలియమ్సన్ను పలకరించి మరీ! (ఫొటోలు)
‘విద్య వాసుల అహం’ మూవీ రివ్యూ
తప్పక చదవండి
- కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
- కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
- పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- విద్యుత్ షాక్తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
- T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- APL వేలంలో నితీశ్ కుమార్ రెడ్డికి అత్యధిక ధర.. సరికొత్త రికార్డు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
Advertisement