శేషాచలం ఎన్కౌంటర్పై విచారణ ప్రారంభం | arguments on sheshachalam encounter started in hi court | Sakshi
Sakshi News home page

శేషాచలం ఎన్కౌంటర్పై విచారణ ప్రారంభం

Published Wed, Apr 15 2015 11:13 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

చిత్తూరు జిల్లా శేషాచలంలో ఎర్రచందనం కూలీలపై జరిగిన ఎన్ కౌంటర్ కేసు విచారణ బుధవారం హైకోర్టులో ప్రారంభమైంది.

హైదరాబాద్: చిత్తూరు జిల్లా శేషాచలంలో ఎర్రచందనం కూలీలపై జరిగిన ఎన్ కౌంటర్ కేసు విచారణ బుధవారం హైకోర్టులో ప్రారంభమైంది. ప్రభుత్వం తరఫున ఒకరు, బాధితుల తరఫున మరొకరు వాద ప్రతివాదనలు చేస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. గత సోమవారం విచారణ సందర్భంగా ఈ కేసును హైకోర్టు బుధవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. 

తన భర్తను బూటకపు ఎన్కౌంటర్లో కాల్చి చంపారని ఆరోపిస్తూ చెన్నైకు చెందిన మణియమ్మన్  స్పీడ్ పోస్ట్  ద్వారా చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా హైకోర్టు దీనిపై సీరియస్ గా స్పందించిందిన విషయం తెలిసిందే. దర్యాప్తు వివరాలను గోప్యంగా ఉంచాలని, కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు ఎక్కడా ఎవరూ ప్రస్తావించకూడదని గతంలో హైకోర్టు ఆదేశించింది. తన భర్తను శశికుమార్ ను ఎన్కౌంటర్లో కాల్చి చంపారని ఆరోపిస్తూ చెన్నైకు చెందిన మణియమ్మన్  స్పీడ్ పోస్ట్  ద్వారా చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఈనెల 11న  ఫిర్యాదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement