60 మంది డిశ్చార్జ్‌ | 60 Covid-19 victims discharged after recovery in AP | Sakshi
Sakshi News home page

60 మంది డిశ్చార్జ్‌

May 16 2020 3:48 AM | Updated on May 16 2020 4:32 AM

60 Covid-19 victims discharged after recovery in AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న 60 మందిని డిశ్చార్జ్‌ చేసినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య 1,252కు చేరింది. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 వరకు మొత్తం 9,038 మందికి పరీక్షలు నిర్వహించారు. 

► రాష్ట్రంలో కొత్తగా 57 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 2,157కు చేరింది. శుక్రవారం నమోదైన కేసుల్లో 28 కేసులు తమిళనాడు కోయంబేడుతో సంబంధం ఉన్నవే. 
► రాష్ట్రానికి వచ్చిన వలస కూలీల్లో కొత్తగా 45 మందికి కరోనా ఉన్నట్టు తేలింది. ఇప్పటి వరకు వలస కూలీల్లో కరోనా పాజిటివ్‌ కేసులు మొత్తం 150కి చేరాయి. 
► వలస కూలీల పాజిటివ్‌ కేసులనూ కలుపుకొంటే రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 2,307 శుక్రవారం ఒక్క మరణం కూడా నమోదు కాకపోవడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 48 వద్ద స్థిరంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 857 ఉన్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement