వైఎస్సార్‌సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ | 6 injured in ysrcp, tdp leaders attack each other | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

Apr 3 2015 1:42 PM | Updated on Aug 10 2018 8:13 PM

విశాఖ జిల్లా అనకాపల్లిలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

విశాఖపట్టణం : విశాఖ జిల్లా అనకాపల్లిలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. వివరాలు... పాతతలారివాని పాలెంలో మరిడిమాంబ వేడుక జరుగుతోంది. పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫెక్సీల విషయంలో శుక్రవారం తెల్లవారుజామున వివాదం చెలరేగింది. దీంతో ఇరువర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఆరుగురికి గాయలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థతి విషయంగా ఉంది. గాయాలైన వారిని స్తానికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(అనకాపల్లి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement