మేడారం మహా జాతరకు గిరిజన సంక్షేమ శాఖ నిధులు విడుదల చేసింది. ఈనెల 11న సాక్షిలో ప్రచురితమైన ‘జాతర పనులకు పాతర... గిరిజన శాఖ నిర్లక్ష్యం’ కథనానికి స్పందించిన ప్రభుత్వం.. ఎట్టకేలకు నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
వరంగల్, న్యూస్లైన్ : మేడారం మహా జాతరకు గిరిజన సంక్షేమ శాఖ నిధులు విడుదల చేసింది. ఈనెల 11న సాక్షిలో ప్రచురితమైన ‘జాతర పనులకు పాతర... గిరిజన శాఖ నిర్లక్ష్యం’ కథనానికి స్పందించిన ప్రభుత్వం.. ఎట్టకేలకు నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఐటీడీఏ 10 కోట్ల పనులకు ప్రతిపాదనలు పంపించగా వాటిని గిరిజన శాఖ 5.80 కోట్లకు తగ్గించింది. వాటిలో కూడా కేవలం 1.42 కోట్లను ఇచ్చి చేతులు దులుపుకుంది. గిరిజన సంసృ్కతిని ప్రతిబింబించే మహా జాతరపై గిరిజన సంక్షేమ శాఖ నిర్లక్ష్యాన్ని సాక్షి వెలుగులోకి తీసుకు వచ్చింది. దీంతో రోడ్ల పనులకు 4.77 కోట్లు, ఇతర పనులకు 22 లక్షలను విడుదల చేస్తూ గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎ.విద్యాసాగర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.