-
టీడీపీ బండారు శ్రావణికి ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం: శింగనమల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి బండారు శ్రావణి శ్రీకి ఎదురుదెబ్బ తగిలింది. ఓ మహిళ ఆత్మహత్య కేసులో ఆమె తండ్రి బండారు రవికుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురంలో మూడు రోజుల క్రితం రాజమ్మ(45) ఆత్మహత్య చేసుకుంది. బండారు రవికుమార్ వేధింపులే కారణమంటూ రాజమ్మ సెల్ఫ్ విడియో తీసింది. భూ వివాదంలో బండారు రవికుమార్ వేధిస్తున్నారంటూ అందులో ఆరోపించింది బాధితురాలు. ఈ వీడియో బయటకు రావడంతో.. కేసు నమోదు చేసి టీడీపీ నేత రవికుమార్ను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. -
చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం
సాక్షి, చిత్తూరు: జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్యాంకర్ను ఆంబులెన్స్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తవణంపల్లె మండలం తెల్లగుండ్ల పల్లి వద్ద ఘటన చోటు చేసుకుంది. వేలూరు నుంచి వస్తున్న కిమ్స్ హాస్పిటల్ అంబులెన్స్.. చిత్తూరు-తిరుపతి హైవే మీద ఆగి ఉన్న ట్యాంకర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ సహా నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో ఆంబులెన్స్లో ఏడుగురు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడ్డ వాళ్లను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, అన్నమయ్య: ఘోర ప్రమాదంతో జిల్లాలో రోడ్డు నెత్తురోడింది. తిరుమల నుంచి ఇంటికి వెళ్తున్న భక్తుల వాహనం.. లారీతో ఢీ కొట్టింది. ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. కొందరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. శనివారం తెల్లవారు ఝామున పీలేరు సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. మృతులు.. బాధితులను కర్ణాటక వాసులుగా పోలీసులు నిర్ధారించారు. కర్ణాటక బెల్గాం జిల్లా అత్తిని మండలం బడచిగ్రామానికి చెందిన 14 మంది.. తిరుమల దర్శనం కోసం ఓ తుఫాన్ వాహనంలో వచ్చారు. దర్శనం అనంతరం తిరిగి వెళ్తుండగా.. తెల్లవారు మూడు గంటల సమయంలో మఠంపల్లి క్రాస్(కె.వి పల్లి మండలం) వద్ద వాళ్ల వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని తొలుత పీలేరు ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం.. తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. -
Live: చంద్రబాబు కేసు అప్డేట్స్.. Click & Refresh
Khaidi No 7691.. LIVE UPDATES 7:15 PM, సెప్టెంబర్ 15, 2023 రేపు జనసేన విస్తృతస్థాయి సమావేశం ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుతో ఏం మాట్లాడారు? ►జైలు బ్రీఫింగ్ను జనసేన కార్యవర్గానికి వివరించనున్న పవన్ కళ్యాణ్ ►చంద్రబాబు సూచనలు, పొత్తు అంశాలపై సుదీర్ఘ ప్రజంటేషన్కు రెడీ ►పొత్తు వల్ల ఎక్కడెక్కడ రాజీ పడాలో వివరించనున్న పవన్ కళ్యాణ్ ►మీరనుకున్నట్టు అందరికీ టికెట్లు ఇవ్వలేనని చెప్పనున్న పవన్ ►పొత్తులో టిడిపి ఎన్ని టికెట్లు ఇస్తే.. అక్కడ మాత్రమే జనసేన పోటీ ►ఏ ఏ స్థానాలన్నది ఉమ్మడి కార్యాచరణలో నిర్ణయించుకోనున్న పార్టీలు ►30 స్థానాలకు జనసేన పరిమితం అని రాజకీయవర్గాల్లో ప్రచారం ►ఇప్పటివరకు ఆశలు పెట్టుకుని నియోజకవర్గాల్లో తిరిగిన కొందరు ►తాజా పొత్తు నిర్ణయంతో ఖర్చు పెట్టుకున్న వారికి తీవ్ర నిరాశ ►రేపు మధ్యాహ్నం మంగళగిరిలో జనసేన విస్తృతస్థాయి సమావేశం ►టీడీపీతో కలిసి వెళ్లాల్సిందే, రాజీ పడదామని చెప్పనున్న పవన్ 7:10 PM, సెప్టెంబర్ 15, 2023 జైల్లో చంద్రబాబు.. ఏ ఏ సౌకర్యాలు ఉన్నాయంటే.? ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు అన్ని సౌకర్యాలు ► స్పెషల్ మెడికల్ టీం ను నియమించిన ప్రభుత్వం ►అత్యవసర ఔషధాలు ఓ పాజిటివ్ బ్లడ్, అంబులెన్స్ రెడీ ►అన్ని వేళల్లో సన్నద్ధంగా పదిమంది వైద్య నిపుణుల బృందం ►చంద్రబాబు ఆరోగ్య భద్రతకు సంబంధించి సకల ఏర్పాట్లు ►టీవీ, న్యూస్ పేపర్లు, ఇంటి భోజనం, వేడి నీళ్లు ఏర్పాటు 6:55 PM, సెప్టెంబర్ 15, 2023 సెలవుపై రాజకీయమా? ► రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవుపై జైళ్లశాఖ ప్రకటన ► రాహుల్ భార్య కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఉన్నారు ► రాహుల్ భార్య నిన్న ఉదయం ఆస్పత్రిలో చేరారు ►ఆస్పత్రిలో ఉన్న భార్యను చూసుకునేందుకు రాహుల్ సెలవు పెట్టారు ►4 రోజుల సెలవు అభ్యర్థనను జైళ్ల శాఖ అంగీకరించింది ►దీనిపైనా కొన్ని మీడియాలు రాజకీయం చేయడం అర్థరహితం 6:40 PM, సెప్టెంబర్ 15, 2023 కింకర్తవ్యం ? : లోకేష్ @ ఢిల్లీ ►మరో రెండు రోజులూ ఢిల్లీలోనే ఉండనున్న నారా లోకేష్ ►ఇవ్వాళ అంతగా సక్సెస్ కాని అపాయింట్మెంట్లు ►చంద్రబాబు అరెస్ట్పై జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టేందుకు విశ్వ ప్రయత్నాలు ►పలువురు పార్టీల నేతలను కలవాలని ప్రయత్నాలు ►అపాయింట్మెంట్ల విషయంలో కలిసిరాని పరిచయాలు ►మొత్తం టిడిపి నేతలను, మద్ధతుదారులను ఉపయోగిస్తున్న లోకేష్ ►రేపు సుప్రీంకోర్టు న్యాయవాదులతో సమావేశమయ్యే ఛాన్స్ 5:24PM, సెప్టెంబర్ 15, 2023 వారంలో మూడో ములాఖత్ కుదరదు: జైళ్ల ఉప శాఖాధికారి, కోస్తా ఆంధ్ర ప్రాంతం, రాజమండ్రి ►నారా భువనేశ్వరి ములాఖత్ పై జైళ్ల శాఖ స్పష్టత ►వారంలో మూడో ములాఖత్ నిబంధనలు రీత్యా సాధ్యం కాదు ►అందుకే ఈరోజు నారా భువనేశ్వరి ములాఖత్ దరఖాస్తు తిరస్కరించాం ►ఈ వారం లో రిమాండ్ ఖైదీ నెంబర్ 7691 కి రెండు ములాఖత్ లు పూర్తయ్యాయి ►ఈ నెల 12 న నారా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి లకు ములాఖత్ ఇచ్చాం ►ఈ నెల 14 న పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ లు ములాఖత్ అయ్యారు ►అత్యవసర పరిస్థితులు ఉంటేనే వారంలో మూడో ములాఖత్కు అవకాశం ►ప్రస్తుతం రిమాండ్ ఖైదీ చంద్రబాబుకి అలాంటి అత్యవసర కారణాలు లేవు ►అందుకే నారా భూబనేశ్వరి ములాఖత్ దరఖాస్తు ని తిరస్కరించాం 4:50 PM, సెప్టెంబర్ 15, 2023 కింకర్తవ్యం ? : లోకేష్ @ ఢిల్లీ ►ఉదయం నుంచి బీజేపీ నేతల అపాయింట్మెంట్ల కోసం ప్రయత్నం ►బీజేపీ నుంచి రాని స్పందన, బీజేపీలో ఉన్న టిడిపి నేతలతో లాబీయింగ్ ►చంద్రబాబు కేసులపై పలువురు సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చలు ►రఘురామ కృష్ణరాజుతో సుదీర్ఘ మంతనాలు ►రేపు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనున్న లోకేష్ 4:30 PM, సెప్టెంబర్ 15, 2023 టీడీపీ, జనసేన పొత్తు ప్రకటనపై సజ్జల కౌంటర్ ►రాజకీయాల్లో చంద్రబాబుకు పవన్ కల్యాణ్ డూప్ ►ఇంతకాలం విడివిడిగా ఉన్నట్లు నటించారు ►బీజేపీని తీసుకొచ్చే బాధ్యత పవన్కు బాబు అప్పగించారమో ►ఏపీలో అధికార పార్టీకి ఈసారి పాజిటివ్ ఓటు ఉంది ►ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం 4:15 PM, సెప్టెంబర్ 15, 2023 నారాయణ పిటిషన్ 25కు వాయిదా ►నారాయణ క్వాష్, ముందస్తు బెయిల్ పిటిషన్ల పై విచారణ 25కి వాయిదా ►అసైన్డ్ భూముల స్కాంలో సీఐడీ నమోదు చేసిన 2 కేసులు క్వాష్ చేయాలని పిటిషన్ ►ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసిన మాజీ మంత్రి నారాయణ ► నారాయణతో పాటు ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన అంజనీకుమార్ ►విచారణను ఈ నెల 25కి వాయిదా వేసిన కోర్టు 3:15 PM, సెప్టెంబర్ 15, 2023 తాడేపల్లిగూడెం: ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ►జైలుకు వెళ్లి సాష్టాంగ నమస్కారంతో పవన్ కళ్యాణ్ ప్యాకేజీ మాట్లాడుకున్నాడు ►పవన్ కళ్యాణ్ ఇంతకాలం పెళ్లి ఒకరితో సంసారం ఒకరితో అన్నట్లుగా ఉన్నాడు ►పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉండి సేవ చేయాలనుకున్న జనసైనికులు చంద్రబాబుకి సేవ చేయండని చెప్పగానే సగం మంది నీకు నీ పార్టీకి దండం అని జారిపోయారు ►జనసేనతో టీడీపీ కలవడం వల్ల చాలామంది తెలుగుదేశం పార్టీ నుండి బయటకు పోయేందుకు రెడీగా ఉన్నారు 1:15 PM, సెప్టెంబర్ 15, 2023 వివేకానంద, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, CID, సుదర్శన్ రెడ్డి, డైరక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ►చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లకు విచారణ అర్హత లేదు ►రెండు బెయిల్ పిటిషన్లలో ఒకే సెక్షన్ల ద్వారా అప్లై చేశారు ►ఈ రెండు పిటిషన్లలో బెయిల్ కోసం నిర్ణీత కారణం చెప్పలేదు ►హైకోర్టులో సీఐడీ కస్టడీ పిటిషన్పై స్టే ఉండగా మళ్లీ ఇక్కడ బెయిల్ వేయటం విరుద్ధం ►నిందితుడి కుటుంబ సభ్యులకు ఏమైనా జరిగితేనే మధ్యంతర బెయిల్ అడుగుతారు ►మధ్యంతర బెయిల్ కూడా 24 లేదా 48గంటలు ఇస్తారు ►హైకోర్టులో వేసిన పిటిషన్ నే ఇక్కడ వేశారు ►నిందితుడు ఇప్పటికే రిమాండ్ లో ఉన్నారు ►ఇప్పుడు చెప్తున్న సెక్యూరిటీ రీజన్స్ రిమాండ్ టైంలోనే చెప్పారు ►కౌంటర్ దాఖలు చేయటానికి మంగళవారం వరకూ సమయం ఇచ్చారు ►కోర్టు ఏం చెప్తుందో 19వ తేదీ వరకూ వేచి చూడాలి 12:10PM, సెప్టెంబర్ 15, 2023 చంద్రబాబు పిటిషన్లపై విచారణ వాయిదా ►చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా ►ఈ పిటిషన్ విచారణ సైతం 19వ తేదీకే వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన కోర్టు ►హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉండటాన్ని ప్రస్తావించిన న్యాయమూర్తి ►కస్డడీ పిటిషన్ ఏసీబీ కోర్టులో పెండింగ్ లో ఉందన్న న్యాయమూర్తి ►బెయిల్ పిటిషన్ నూ ఈనెల 19నే విచారిస్తామన్న న్యాయమూర్తి ►మధ్యంతర బెయిల్, బెయిల్ పిటిషన్లు రెండూ వాయిదా 12:00PM, సెప్టెంబర్ 15, 2023 మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా ► స్కిల్ స్కాం కేసులో ఏ1 చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా ►విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు 11:30 AM, సెప్టెంబర్ 15, 2023 బెయిల్ పిటిషన్ @ ACB కోర్టు, విజయవాడ ► చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ ► బెయిల్ పై వాదనలు వినాలన్న చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ ► కౌంటర్ దాఖలుకు సమయం కోరిన సీఐడీ తరపు న్యాయవాది 11:00 AM, సెప్టెంబర్ 15, 2023 బెయిల్ పిటిషన్ @ ACB కోర్టు, విజయవాడ ► చంద్రబాబుకు ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్ ► బెయిల్ పిటిషన్పై కాసేపట్లో విచారణ ► స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి ఈ బెయిల్ పిటిషన్ ► ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసిన న్యాయవాది సుబ్బారావు ► బాబు బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని CIDకి కోర్టు సూచన 10:30 AM, సెప్టెంబర్ 15, 2023 డామిట్.. కథ అడ్డం తిరిగిందా.? ► రాజమండ్రి సెంట్రల్ జైలు లోపల మాట్లాడింది వేరు, బయట జరిగింది వేరు ► ఇంకొన్నాళ్లు దొంగాట ఆడుకుందామని పవన్కు బాబు సూచించినట్టు సమాచారం ► ఇప్పుడే పొత్తు ప్రకటిస్తే బీజేపీకి కోపం వస్తుందని చెప్పిన చంద్రబాబు ► లోపల ఓకే చెప్పి బయట ప్లేటు ఫిరాయించిన పవన్ కళ్యాణ్ ► జైలు బయట ప్రెస్ మీట్లో ఫ్లోలో అసలు విషయం చెప్పేసిన పవన్ ► ఒక వైపు లోకేష్, మరో వైపు బాలయ్యను పెట్టుకుని పవన్ పొత్తు ప్రకటన ► పవన్ నోట పొత్తు వినగానే షాక్కు గురయిన బాలయ్య, లోకేష్ ► పవన్ మాట్లాడిన తర్వాత ఏం చేయాలో పాలుపోక బాలయ్య, లోకేష్ మౌనం ► ఇప్పటికిప్పుడు గట్టిగా గెలిచే స్థానాలు 20 కూడా లేకపోవడంతో కంగారు ► డ్యామేజీ కంట్రోల్ కోసం హడావిడి ప్రయత్నాలు మొదలెట్టిన లోకేష్, బాలయ్య ► సాయంత్రం తర్వాత ఢిల్లీ ప్లాన్ తెర మీదికి ► లోకేష్ ఢిల్లీ టూరు లక్ష్యం ఒకటే : ఎలాగైనా బీజేపీ నేతల అపాయింట్మెంట్ 09:30AM, సెప్టెంబర్ 15, 2023 విశ్వసనీయతకు యూటర్న్కు మధ్య యుద్ధం ► జైలు ముందు పొత్తు ప్రకటన చేసిన పవన్, లోకేష్ ► పవన్, లోకేష్ తీరు తప్పుబట్టిన విజయసాయిరెడ్డి ► ఈ యుద్ధం వైఎస్సార్సిపి x టిడిపి, జనసేన.... ► సింగిల్గా వచ్చే సింహాం x నక్కల గుంపు ► ప్రజా సంక్షేమం x అధికార దాహం ► విశ్వసనీయత x యూటర్న్ రాజకీయాలు ► స్థిరమైన పాలన x అస్థిరమైన నాయకత్వం ► నీతి నిజాయతీ x అవకాశవాదం ► సమైక్యత x కుల రాజకీయం The 2024 AP elections is going to be between TDP vs. YSRCP respectively which can be compared as a pack of wolves versus a lion, greed for power vs. public welfare, U-turn politics vs. credibility, instability vs. stability, opportunism vs. honesty, caste politics vs. unity,… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 15, 2023 09:15AM, సెప్టెంబర్ 15, 2023 ఢిల్లీలో నారా లోకేష్ బిజీ బిజీ ► ఢిల్లీ పర్యటనలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ► చంద్రబాబు అరెస్ట్ గురించి జాతీయ మీడియాలో వార్తలు వచ్చేలా లాబీయింగ్ ► పలువురు సుప్రీంకోర్టు న్యాయవాదుల అపాయింట్మెంట్లు అడిగిన టీడీపీ టీం ► కక్ష రాజకీయంగా కలరింగ్ ఇచ్చేందుకు ఢిల్లీలో లోకేష్ మంతనాలు ► పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహణ ► లోక్సభలో బాబు అరెస్ట్పై చర్చ కోసం పట్టుబట్టాలని ఎంపీలకు హితబోధ 09:29AM, సెప్టెంబర్ 15, 2023 పొత్తు ప్రకటన చెప్పేశా.. ఇక ఏం చేద్దాం! ► రాజమండ్రి సెంట్రల్ జైలు బయట శుక్రవారం టీడీపీ పొత్తు ప్రకటన చేసిన పవన్ ► పవన్ ప్రకటనపై పార్టీలో ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు శనివారం(రేపు) జనసేన విస్తృత స్థాయి సమావేశం ► నెక్ట్స్ ఏంటన్న దానిపైనా భేటీలో చర్చించే అవకాశాలు ► మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ అధ్యక్షతన భేటీ ► పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుల దగ్గరి నుంచి సంయుక్త కార్యదర్శుల దాకా అంతా హజరయ్యే ఛాన్స్ ► ఇప్పటివరకు టికెట్ ఆశ చూపెట్టి ఇప్పుడు పొత్తు అంటే ఎలా అని జనసేన కార్యవర్గం అసంతృప్తి 09:21AM, సెప్టెంబర్ 15, 2023 చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై వాదనలు ఆలస్యం? ►ఏసీబీ కోర్టులో బాబు తరపున రెండు పిటిషన్లు దాఖలు ►స్కిల్ స్కాం కేసులో బెయిల్, మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిసషన్లు ►బెయిల్పై ఇప్పటికే సీఐడీకి కోర్టు నోటీసులు ►పూర్తి వివరాలు ఉంచేందుకు సమయం కోరనున్న సీఐడీ ►పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసిన తర్వాతే.. ఇరువైపులా వాదనలు మొదలయ్యే అవకాశం 08:00AM, సెప్టెంబర్ 15, 2023 జైలులో చంద్రబాబు @6వరోజు ► రాజమండ్రి సెంట్రల్ జైలు సమీపంలోనే చంద్రబాబు భార్య భువనేశ్వరి బస ► ఈ వారం ముగిసిన చంద్రబాబు ములాఖత్లు 06:44am, సెప్టెంబర్ 15, 2023 చంద్రబాబు పిటిషన్లపై సీఐడీ కౌంటర్ ►చంద్రబాబు పిటిషన్లపై నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ కౌంటర్ ►బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లు వేసిన చంద్రబాబు లాయర్లు ► ఏసీబీ కోర్టులో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయనున్న సీఐడీ తరపు న్యాయవాదులు 5:15am, సెప్టెంబర్ 15, 2023 చంద్రబాబు అరెస్టుపై ఢిల్లీకి లోకేష్ ►చంద్రబాబు అరెస్టుకు విస్తృత ప్రచారం చేయాలని ఢిల్లీకి లోకేష్ ►నిన్న రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరిక లోకేష్ ►లోకేష్ కోసం జాతీయ పార్టీల నేతల అపాయింట్మెంట్ ప్రయత్నం చేస్తున్న టీడీపీ లీడర్ లు ► నిన్న చంద్రబాబుతో పవన్ ములాఖత్ తర్వాతనే ఈ నిర్ణయం 5:05am, సెప్టెంబర్ 15, 2023 మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ ► రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో తనపై పెట్టిన 2 కేసులు కొట్టివేయాలని పిటిషన్ ►విచారణ ను ఈ నెల 25 కు వాయిదా వేసిన న్యాయస్థానం ►మధ్యంతర ఉత్తర్వులు పొడిగించిన న్యాయస్థానం 5:00am, సెప్టెంబర్ 15, 2023 చంద్రబాబుకు బెయిల్ కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ ►విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ వేసిన న్యాయవాది సుబ్బారావు ►పిటిషన్ ను విచారణకు స్వీకరించిన విజయవాడ ఏసీబీ కోర్టు ►పిటిషన్ పై నేడు విచారణ చేపట్టనున్న ఏసీబీ కోర్టు. -
స్కామ్ కారకులనే నాడు అప్రమత్తం చేశారు
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కాంను చాలా స్కిల్ ఫుల్గా జరిపించి.. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి లూటీ చేశారని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి తెలిపారు. గురువారం స్కిల్డెవలప్మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి సీఐడీ నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన కూడా పాల్గొని మాట్లాడారు. సీమెన్స్ ఏజీ అనే జర్మన్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమతో.. స్కిల్ డెవలప్మెంట్ కోసం రూ. 3,300 కోట్లు ఫ్రీగా ఇస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రాజెక్టులో 90 శాతం సీమెన్స్ కంపెనీ ఇస్తుందని.. ప్రభుత్వం కేవలం 10 శాతం ఇస్తే సరిపోతుందన్నారు. రూల్స్ ప్రకారం అది వీలుకాదని అధికారులు అప్పటి టీడీపీ ప్రభుత్వానికి అధికారులు చెప్పారు. అయితే పైలట్ ప్రాజెక్ట్ అమలు చేయాలన్న అధికారుల వాదనను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు. పైగా ఏపీ ఖజానా నుంచి రూ.371 కోట్లు డిజైన్టెక్కు చెల్లించారు. చాలా నైపుణ్యంగా జరిగిన స్కామ్ ఇది. ప్రభుత్వ సంపదను చాలా సులభంగా దోచేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఏర్పాటైన.. స్కిల్డెవలప్మెంట్ కార్పొరేషన్ అవకతవకల గురించి పుణే నుంచి జీఎస్టీ అధికారులు అప్పటి ఏపీ ప్రభుత్వానికి లేఖ ద్వారా అప్రమత్తం చేశారు. 2018, మే 14వ తేదీన ఏపీ ఏసీబీ డీజీకి లేఖ రాశారు. అంటే.. పుణే నుంచి ఈ స్కామ్ బయటపడింది. చూస్కోండి బాబూ.. రూ. 371 కోట్లు హాంఫట్ అయ్యాయని లేఖ ద్వారా అలర్ట్ చేశారు. అప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఈ స్కాంకు కర్తనో.. ఆ ప్రభుత్వానికే ఆ లేఖ అందింది. అంటే.. కారకులనే పుణే జీఎస్టీ విభాగం అప్రమత్తం చేసిందన్నమాట. అందుకే వ్యవహారం ముందుకు సాగలేదు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది అని ఏఏజీ సుధాకర్రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో మీడియా ప్రశ్నలు అడగబోతుండగా.. తానేం దర్యాప్తు అధికారిని కానని.. కేవలం ప్రభుత్వ ప్రతినిధిగా వాదనలు మాత్రమే వినిపిస్తున్నానని.. అందుకే తనకు చేరిన పత్రాలు, వివరాల ఆధారంగా మీడియాకు సమాచారం ఇస్తున్నానని ఆయన తెలిపారు. -
బైక్ లిఫ్ట్ అడగడమే ఆమెకు శాపమైంది.. ఫొటోలు తీసి..
సాక్షి, ఏలూరు: మహిళలు, యువతులపై వేధింపులు తగ్గించేందుకు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా కొందరు మృగాలు మాత్రం మారడం లేదు. చట్టాలు తమకు వర్తించవు అనే రకంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కొందరు ఆకతాయిల వేధింపుల కారణంగా ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. దీంతో, ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ విషాదకర ఘటన ఏలూరులో చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనపై ఎస్ఐ చావా సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. భీమడోలు మండలం లక్ష్మీపురానికి చెందిన సుంకర లక్ష్మణరావుకు దెందులూరుకు చెందిన పావని (35)కి 2007లో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. పిల్లల చదువుల నిమిత్తం గుండుగొలనులోని గంగానమ్మ గుడి సమీపంలోని ఓ అద్దె ఇంట్లో గత రెండేళ్లుగా నివాసం ఉంటున్నారు. అయితే గత నెల 15న పావని ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్తూ అటుగా వస్తున్న ఓ మోటార్ స్లైక్లిస్ట్ను లిఫ్ట్ అడిగి వెళుతోంది. అయితే, ఆ సమయంలో లక్ష్మీపురానికి చెందిన పాత నేరస్తుడు బోను శివకృష్ణ ఆమె బండి ఎక్కి వెళుతున్న దృశ్యాన్ని తన సెల్ఫోన్లో వీడియో తీసి తన సహచరులైన బోను పవన్, సుంకర యశ్వంత్, శనపతి రాజబాబులతో కలిసి ద్వారకాతిరుమల వరకు వారిని వెంబడించారు. అక్కడ వారిని అడ్డగించి తమ కోరిక తీర్చాలని లేదంటే వీడియో వైరల్ చేసి అల్లరి పాలు చేస్తామని బెదిరించారు. అయినా ఆమె వారికి లొంగలేదు. కాగా, ఈనెల 10న బోను శివకృష్ణ సదరు మహిళ బైక్ ఎక్కి వెళ్లిన వీడియోను గ్రామంలో అందరికి షేర్ చేశాడు. వ్యభిచారిణిగా చిత్రీకరిస్తూ ప్రచారం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సదరు వివాహిత అదేరోజు ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. మృతదేహానికి వీఆర్వోలు వి.వెంకటేశ్వరరావు, కందులపాటి శంకర్ పంచనామా నిర్వహించారు. పావని మృతికి కారణమైన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి వీడియోలను తీసిన సెల్ఫోన్లను కూడా సీజ్ చేశామని చెప్పారు. నిందితులను భీమడోలు కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు తెలిపారు. చేపల పట్టుబడికి వెళుతూ జీవనం పొందుతున్న భర్త, పిల్లలు పావని ఆత్మహత్యతో తల్లడిల్లిపోయారు. ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదంలో యువ జంట దుర్మరణం -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే వీఆర్ఓ హత్య
రాయచోటిటౌన్ : తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య ప్రియుడితో పాటు మరొక వ్యక్తి సాయం తీసుకుని భర్తను అంతమొందించింది. ఆ తర్వాత తన భర్త బాత్రూంలో పడి చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. ఎట్టకేలకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులు ముగ్గురిని అరెస్టు చేశారు. బుధవారం రాయచోటి డీఎస్పీ మహబూబ్ బాషా విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సంబేపల్లె మండలం శెట్టిపల్లెకు చెందిన అంజి అలియాస్ ఆంజనేయులు నాయుడు రాయచోటి పట్టణంలో నివాసం ఉంటూ వీరబల్లె మండల కేంద్రంలో వీఆర్ఓగా విధులు నిర్వర్తించేవాడు. ఆయనకు భార్య నందిని, ఇద్దరు మగపిల్లలు సంతానం ఉన్నారు. అయితే నందినికి గొర్లమొదివీడుకు చెందిన మహదేవపల్లె చిన్నప్పరెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తన భర్తకు తెలియడంతో ఆమెను వారించేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు చోటు చేసుకొనేవి. తన భర్త తనను వేధిస్తున్నాడని ఎలాగైనా అంతమొందించాలని చిన్నప్పరెడ్డికి చెప్పింది. వెంటనే పథకం రచించారు. ఈనెల 9వ తేదీ శనివారం రాత్రి ఇంటికి రాగానే భోజనం వడ్డించింది. మజ్జిగలో నిద్రమాత్రలు కలపడంతో అతను భోజనం చేసిన కాసేపటికి మత్తులోకి జారుకున్నాడు. ఇదే అదునుగా భావించిన నందిని అప్పటికే సిద్ధంగా ఉన్న చిన్నప్పరెడ్డి, అతని స్నేహితుడు గొర్లమొదివీడు గ్రామానికి చెందిన మహదేవపల్లె సురేంద్రారెడ్డితో పాటు తాను కూడా బెడ్రూంలోకి వెళ్లి ముఖంపై దిండు ఉంచి గట్టిగా అదిమి పట్టుకున్నారు. అయితే అంజి నిద్రమత్తు నుంచి లేచి తేరుకొని గట్టిగా కేకలు వేశాడు. ఆ సమయలో వారిమధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇక చేసేది లేక ముగ్గురు కలిసి బలవంతంగా అతని ముఖంపై దిండు వేసి గట్టిగా అదిమి పట్టుకున్నారు. కొద్దిసేపటి తరువాత ఊపిరి ఆగిపోయింది. మృతి చెందాడని నిర్ధారించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే హత్య కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో చిన్నప్పరెడ్డి తన చేతులకు గ్లౌజులు ధరించాడు. అలాగే పట్టణంలో సీసీ కెమెరాల కంటబడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో మృతుడి భార్య నందిని తన భర్త బాత్ రూంలో పడి చనిపోయాడని చెప్పి పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టడంతో నిజాలు వెలుగు చూశాయి. హత్యకు పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచారు. ఈ కేసును అత్యంత చాకచక్యంగా ఛేదించిన అర్బన్ సీఐ సుధాకర్రెడ్డి, అర్బన్ ఎస్ఐ నరసింహారెడ్డిలకు రివార్డు కోసం జిల్లా ఎస్పీకి సిఫార్సు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ తులశీరాం పాల్గొన్నారు. -
‘స్కిల్’ కుంభకోణం కుట్రదారు చంద్రబాబే
సాక్షి, అమరావతి: ‘టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం ప్రధాన కుట్రదారుడు చంద్రబాబు నాయుడే. సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా మోసపూరితంగా వ్యవహరించారు. కేబినెట్ ఆమోదం లేకుండా ఏపీఎస్ఎస్డీసీ ఏర్పాటు నుంచి నిబంధనలకు విరుద్ధంగా నిధుల విడుదల వరకు ఆయనే సర్వం తానై వ్యవహరించారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన ఫైళ్లలో ఏ–1 చంద్రబాబు 13 చోట్ల సంతకాలు చేశారు. ఏ–2 అప్పటి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంతకాలు అయిదు చోట్ల ఉన్నాయి’ అని సీఐడీ అదనపు డీజీ సంజయ్ వెల్లడించారు. వెలగపూడిలోని సచివాలయంలో సీఐడీ ఎస్పీ ఫక్కీరప్పతో కలసి బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ గురించిగానీ ఒప్పందం గురించిగానీ తమకు తెలియదని సీమెన్స్ కంపెనీయే ఈ మెయిల్ ద్వారా న్యాయస్థానంలో 164 సీఆర్పీసీ వాంగ్మూలం ద్వారా స్పష్టం చేసిందని తెలిపారు. ఈ కుంభకోణం ద్వారా అక్రమంగా మళ్లించిన రూ.371 కోట్లలో షెల్ కంపెనీల ద్వారా రూ.241 కోట్లు చంద్రబాబుకే చేరాయన్నారు. సీఐడీతోపాటు సమాంతరంగా దర్యాప్తు జరిపిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ ప్రాజెక్ట్ పేరిట షెల్ కంపెనీల ద్వారా నిధులు కొల్లగొట్టారని నిర్ధారించిందని చెప్పారు. విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం ఈ కేసును పది గంటలపాటు సుదీర్ఘంగా విచారించి.. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని పూర్తి ఆధారాలు ఉన్నాయని సంతృప్తి చెందాకే ఆయనకు రిమాండ్ విధించిందన్నారు. సీఐడి అదనపు డీజీ సంజయ్ ఇంకా ఏం చెప్పారంటే.. కుంభకోణం సూత్రధారి చంద్రబాబే ♦ కేబినెట్ ఆమోదం లేకుండానే రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)ను చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్ పేరిట ప్రజాధనం కేటాయింపు అంతా గంటా సుబ్బారావు అనే ప్రైవేటు వ్యక్తి చేతిలో పెట్టారు. అందుకోసం ఆయనకు ఏకంగా నాలుగు పోస్టులు కట్టబెట్టారు. ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–ఈసీవోగా మొదట నియమించి, అనంతరం ఉన్నత విద్యా శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి, స్కిల్ డెవలప్మెంట్–ఇన్నోవేషన్ శాఖ కార్యదర్శి పోస్టుతోపాటు ఏకంగా సీఎం ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా కూడా నియమించారు. ♦ డిప్యూటీ సీఈవోగా అపర్ణను నియమించారు. ఆమె భర్త సీమెన్స్ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారు. ఇది పరస్పర ప్రయోజనాల కిందకు వస్తుంది. ఇక టీడీపీకే చెందిన జె.వెంకటేశ్వర్లు అనే చార్టెడ్ అకౌంటెంట్కు ఏపీఎస్ఎస్డీసీలో పోస్టు కట్టబెట్టారు. ఉన్నత విద్యా శాఖను బైపాస్ చేశారు. ఎలాంటి ప్రాతిపదిక లేకుండా బడ్జెట్ను ఆమోదించారు. పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలన్న ప్రతిపాదనను బేఖాతరు చేస్తూ ఏకపక్షంగా ఆరు చోట్ల సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లు ఏర్పాటు చేస్తామన్నారు. సీమెన్స్ కంపెనీ పేరుతో మోసం ♦ టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్, అందుకోసం ఒప్పందం గురించి సీమెన్స్ కంపెనీకి తెలియనే తెలీదు. చంద్రబాబు కేవలం నిధులు కొల్లగొట్టడానికే ఆ కంపెనీ పేరును వాడుకుని మోసానికి పాల్పడ్డారు. జర్మనీలోని సీమెన్స్ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు ఆ జీవో గురించి, ఆ ఒప్పందం గురించి తమకు ఏమాత్రం తెలియదని వెల్లడించింది. ♦ ఏపీఎస్ఎస్డీసీ చెబుతున్న రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్తో తమకు సంబంధం లేదని, ఆ ఒప్పందం గురించి తమకు ఏమాత్రం తెలియదని స్పష్టం చేసింది. తాము 90 శాతం నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్గా ఇస్తామని ఎవరికీ చెప్పలేదని.. అసలు ఆ వ్యవహారంతో సీమెన్స్ కంపెనీకి సంబంధం లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు సీమెన్స్ కంపెనీ ఈ మెయిల్ ద్వారా వివరించడంతోపాటు న్యాయస్థానంలో 164సీఆర్పీసీ కింద వాంగ్మూలం కూడా ఇచ్చింది. ♦ సీమెన్స్ కంపెనీ అంతర్గతంగా కూడా దర్యాప్తు నిర్వహించి వాస్తవాలను ఏపీఎస్ఎస్డీసీ, సీఐడీలకు అందించింది. భారత్లో సీమెన్స్ కంపెనీ ప్రతినిధిగా ఉన్న సుమన్ బోస్ మరికొందరు నిందితులతో కలసి జర్మనీలోని ప్రధాన కార్యాలయానికి తెలియకుండా ఈ కుట్రలో భాగస్వాములయ్యారని నిర్ధారించింది. ఈ మేరMý ు సుమన్బోస్, ఇతరులు డిలీట్ చేసిన ఈ మెయిల్స్, వాట్సాప్ మెసేజ్లు, మెసేజ్లు, ఇతర డాటాను రిట్రైవ్ చేసి సీఐడీకి అందించింది. ♦ డిజైన్ టెక్ కొరితే తాము రూ.58.80 కోట్ల విలువైన సాఫ్ట్వేర్ను మాత్రమే ఆ కంపెనీకి విక్రయించామని తెలిపింది. ఎవరైనా తమ వద్ద నుంచి సాఫ్ట్వేర్ కొనుగోలు చేసుకోవచ్చని, అంత మాత్రాన తాము ఆ ఒప్పందంలో భాగస్వాములమైనట్టు కాదని వెల్లడించింది. రూ.3,300 కోట్లు ప్రాజెక్ట్గా నకిలీ ఒప్పందం ♦ సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయం ఇచ్చిన వాంగ్మూలంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేవలం రూ.58 కోట్ల ప్రాజెక్ట్ను రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్గా చూపిస్తూ చంద్రబాబు భారీగా ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు పన్నాగం పన్నారు. అందుకోసమే జీవోకు విరుద్ధంగా నకిలీ ఒప్పందాన్ని తీసుకువచ్చారు. డిజైన్ టెక్ అనే కంపెనీని భాగస్వామిని చేశారు. ♦ సీమెన్స్ కంపెనీ నుంచి 90 శాతం నిధులు రావని తెలుసు. ఎందుకంటే వారికి అసలు ఒప్పందం గురించే తెలియదు. అందుకే ప్రభుత్వ వాటా 10 శాతం నిధులను నిబంధనలకు విరుద్ధంగా డిజైన్టెక్ కంపెనీకి చెల్లించి.. పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి మళ్లించి.. అక్కడి నుంచి వివిధ షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు రూ.241 కోట్లు దక్కించుకున్నారు. చంద్రబాబు ఒత్తిడితోనే రూ.371 కోట్లు విడుదల ♦ జీవోలో పేర్కొన్నట్టు రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్లో గ్రాంట్ ఇన్ ఎయిడ్గా 90 శాతం వాటాలో ఒక్క రూపాయి కూడా రాలేదు. కానీ ప్రభుత్వ వాటా 10 శాతం జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను డిజైన్ టెక్ కంపెనీకి ఏకపక్షంగా విడుదల చేశారు. దీనిపై అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని నోట్ ఫైళ్లలో స్పష్టంగా పేర్కొన్నారు. ♦ కానీ నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు విడుదల చేయాలని అప్పటి సీఎం హోదాలో చంద్రబాబు ఆదేశించారు. అదే విషయాన్ని అధికారులు నోట్ ఫైళ్లలో స్పష్టంగా పేర్కొంటూ.. సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే నిధులు విడుదల చేస్తున్నట్టు స్పష్టం చేశారు. అనంతరమే నిధులు విడుదల చేశారు. షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు రూ.241 కోట్లు ♦ డిజైన్ టెక్ కంపెనీకి విడుదల చేసిన రూ.371 కోట్లలో ఆ కంపెనీ సీమెన్స్ కంపెనీ నుంచి రూ.58.80 కోట్ల సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసి అందించింది. మిగిలిన రూ.311 కోట్లను డిజైన్ టెక్ కంపెనీ వివిధ షెల్ కంపెనీలకు మళ్లించింది. ♦ వాటిలో షెల్ కంపెనీలకు కమీషన్లు పోగా, మిగిలిన రూ.241 కోట్లు చంద్రబాబుకు చేర్చారు. అంటే ఈ కుంభకోణం ద్వారా చంద్రబాబు రూ.241 కోట్లు అక్రమంగా కొల్లగొట్టారన్నది ఆధారాలతోసహా నిర్ధారణ అయ్యింది. గుజరాత్ మోడల్ కాదు.. ♦ యువతకు నైపుణ్యాభివృద్ధి కోసం గుజరాత్లో అమలు చేస్తున్న ప్రాజెక్ట్నే ఏపీలో అమలు చేశామని టీడీపీ చెబుతుండటం సరికాదు. అధికారుల బృందం గుజరాత్లో పర్యటించి అక్కడి ప్రాజెక్ట్ను పరిశీలించింది. కానీ అందుకు విరుద్ధంగా ఏపీలో ప్రాజెక్ట్ను రూపొందించింది. ♦ 90 శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్నది జీవోలో చూపించారు గానీ ఒప్పందంలో లేదు. ఇక పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేసి ఫలితాలను చూసి నిర్ణయం తీసుకుందామన్న అధికారుల ప్రతిపాదనను పట్టించుకోలేదు. కేవలం రూ.371 కోట్లు కొల్లగొట్టడానికే ఈ ప్రాజెక్ట్ను తెరపైకి తెచ్చారు. నోట్ ఫైళ్లు మాయం ♦ ఈ కుంభకోణం బయట పడకూడదనే ఉద్దేశంతో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్కు సంబంధించిన నోట్ ఫైళ్లను ఉద్దేశ పూర్వకంగా గల్లంతు చేశారు. ఏపీఎస్ఎస్డీసీ ఏర్పాటు జీవోకు సంబంధించిన నోట్ ఫైళ్లు, నిధుల విడుదలకు సంబంధించిన ఆదేశాల నోట్ ఫైళ్లను మాయం చేశారు. కానీ సీఐడీ వాటిని రిట్రైవ్ చేసింది. ♦ ఏపీఎస్ఎస్డీసీ ఏర్పాటు గురించి జీవో 4, సీమెన్స్తో ఒప్పందం గురించి జీవో 5 జారీ చేశారు. కానీ ఆ రెండు జీవోలకు సంబంధించిన నోట్ ఫైళ్లను మాయం చేశారు. కానీ జీవో 8 ద్వారా అంతకు ముందు ఇచ్చిన జీవోలు 4, 5 లోని అంశాలను సీఐడీ గుర్తించి వెలికి తీయడంతో ఈ కుంభకోణం వెనుక ఉన్న కుట్ర బయటపడింది. చంద్రబాబు ముఠా ద్వారా అక్రమ నిధుల తరలింపు ♦ షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించిన నిధులు చంద్రబాబు తన ముఠా మనుషుల ద్వారా పొందారు. చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తా ఇందులో కీలక పాత్ర పోషించారు. ♦ డిజైన్టెక్కు చెల్లించిన రూ.371 కోట్లలో రూ.241 కోట్లు వివిధ షెల్ కంపెనీల ద్వారా యోగేశ్ గుప్తాకు చేరాయి. ఆయన ఆ రూ.241 కోట్లు డ్రా చేసి నగదును మనోజ్ పార్థసానికి ముంబయిలో అందించారు. మనోజ్ పార్థసాని ఆ రూ.241 కోట్ల నగదును హైదరాబాద్ తీసుకువచ్చి చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్కు అందించారు. ఆయన ఆ నగదును చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ♦ నిధుల తరలింపులో పాత్రధారులుగా వ్యవహరించిన పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తాలే చంద్రబాబు ఇతర కుంభకోణాల్లోనూ నిధుల తరలింపులో కీలకంగా వ్యవహరించారు. అమరావతిలో తాత్కాలిక రాజధాని భవనాల నిర్మాణం, రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల కాంట్రాక్టులు కట్టబెట్టిన కుంభకోణంలో నిధులను షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు చేర్చారు. ♦ ఆ విషయం ఆదాయ పన్ను శాఖ దర్యాప్తులో వెల్లడైంది. దాంతో ఆదాయ పన్ను శాఖ మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తా, పెండ్యాల శ్రీనివాస్లకు నోటీసులు జారీ చేసి వారి వాంగ్మూలాలను నమోదు చేసింది. తాము అక్రమ నిధులను చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్కే అందించామని మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తా వాంగ్మూలంలో స్పష్టం చేశారు. షెల్ కంపెనీల ద్వారా మళ్లించిన నిధులను వారిద్దరి నుంచి చంద్రబాబు తరఫున తాను స్వీకరించానని పెండ్యాల శ్రీనివాస్ కూడా అంగీకరిస్తూ వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం. ఈడీ దర్యాప్తులోనూ ‘స్కిల్’ కుంభకోణం బట్టబయలు ♦ ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ పేరిట షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించిన అంశంపై కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా దర్యాప్తు చేపట్టింది. ఈ ప్రాజెక్ట్లో భారీగా అవినీతి జరిగిందని నిర్ధారించి ఇప్పటి వరకు డిజైన్టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్, సీమెన్స్ కంపెనీ భారత ప్రతినిధిగా గతంలో వ్యవహరించిన సుమన్బోస్లతోపాటు నలుగురిని అరెస్ట్ చేసింది. ♦ డిజైన్ టెక్ కంపెనీకి చెందిన రూ.31.32 కోట్ల బ్యాంకు ఖాతాలను జప్తు చేసింది. ఈ మేరకు ఈడీ పత్రికా ప్రకటన జారీ చేయడంతోపాటు ట్వీట్ కూడా చేసింది. డిజైన్ టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్ను ఈడీ ఈ ఏడాది మార్చి 10న అరెస్ట్ చేస్తే, మే 12 వరకు జైలులో ఉండి బెయిల్పై విడుదలయ్యారు. ♦ ఈ కుంభకోణంలో చంద్రబాబు భాగస్వామి అయిన ఆయన ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్లో అసలు అక్రమాలే జరగలేదని వీడియోలు విడుదల చేయడం విడ్డూరం. అక్రమాలు చేయకపోతే ఈడీ ఆయనపై కేసు పెట్టి ఎందుకు అరెస్ట్ చేసి జైలుకు పంపిందో సమాధానం చెప్పాలి. సీఐడీ కూడా చంద్రబాబుతోపాటు ఇప్పటికే వికాస్ వినాయక్ ఖన్వేల్కర్తోపాటు మొత్తం 9 మందిని అరెస్ట్ చేసింది. ♦ సీఐడీ నమోదు చేసిన కేసుపై విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం పది గంటలపాటు సుదీర్ఘంగా విచారించింది. ఇరుపక్షాల వాదనలను పూర్తిగా ఆలకించింది. అనంతరం ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనడానికి పూర్తి ఆధారాలు ఉన్నాయని సంతృప్తి చెందడంతోనే ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. -
చంద్రబాబు పిటిషన్లో కౌంటర్ వేయండి
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్లో హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం వరకు విచారణ చేపట్టవద్దని విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయ మూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ వాదన వినకుండా ఈ కేసులో ప్రస్తుత దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడం సాధ్యం కాదని న్యాయ మూర్తి స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టయిన చంద్రబాబు నాయుడు జ్యుడీషి యల్ రిమాండ్లో భాగంగా ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ మంగళవారం ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ కేసు ఆధారంగా విజయవాడ ఏసీబీ కోర్టు తనకు రిమాండ్ విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సైతం కొట్టేయాలని తన పిటిషన్లో కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై బుధవారం న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి విచారణ జరిపారు. మీరు ఈ వ్యాజ్యంపై విచారించేందుకు అభ్యంతరం లేదు విచారణ ప్రారంభం కాగానే వాదనలు వినిపించేందుకు చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా సిద్ధమవుతుండగా, న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. వాదనలు వినిపించే ముందు తాను ఓ విషయం చెప్పదలచుకున్నానని తెలిపారు. తాను పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)గా ఉన్న సమయంలో కొన్ని కేసుల్లో పిటిషనర్ చంద్రబాబుకు వ్యతిరేకంగా హాజరయ్యానని, దీనిపై మీకు అభ్యంతరం ఉంటే విచారణ నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. దీనిపై లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు స్పందిస్తూ, తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ గట్టిగా చెప్పారు. ఈ వ్యాజ్యాన్ని మీరే వినాలని కోరారు. దీంతో న్యాయమూర్తి విచారణను కొనసాగించారు. లూథ్రా వాదనలు మొదలు పెడుతుండగా, సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి జోక్యం చేసుకుంటూ, ఈ వ్యాజ్యంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని, ఇందుకు తమకు కొంత గడువు కావాలని కోర్టుకు స్పష్టం చేశారు. కౌంటర్ దాఖలుకు ఆదేశాలిస్తానని చంద్రబాబు న్యాయవాదులను ఉద్దేశించి న్యాయమూర్తి చెప్పగా, తాము వాదనలు వినిపిస్తామని వారు తెలిపారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరించారు. చంద్రబాబు రిమాండ్ చెల్లదు.. సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు అరెస్ట్ అక్రమమన్నారు. అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్)లోని సెక్షన్ 17ఏ ప్రకారం పబ్లిక్ సర్వెంట్ను విచారించాలన్నా, కేసు నమోదు చేయాలన్నా అందుకు గవర్నర్ నుంచి అనుమతి తప్పనిసరి అని తెలిపారు. ఈ కేసులో అలాంటి అనుమతి ఏదీ తీసుకోలేదన్నారు. ఇది చట్ట విరుద్ధమని తెలిపారు. గవర్నర్ అనుమతి తప్పనిసరి అని సుప్రీంకోర్టు కూడా చెప్పిందన్నారు. సెక్షన్ 17ఏను ఏసీబీ ప్రత్యేక కోర్టు సరైన కోణంలో అర్థం చేసుకోలేదన్నారు. 2018 జూలై తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2018 తర్వాత నమోదైన కేసులకు గవర్నర్ అనుమతి తప్పనిసరి అని తెలిపారు. గవర్నర్ అనుమతి తీసుకోకుండా నమోదు చేసిన కేసు, అరెస్ట్, రిమాండ్ ఇవన్నీ కూడా చెల్లవన్నారు. అదువల్ల చంద్రబాబు రిమాండ్ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని కోరారు. నిబంధనల ప్రకారమే కస్టడీ పిటిషన్ వేశాం ఈ సమయంలో అదనపు ఏజీ సుధాకర్రెడ్డి జోక్యం చేసుకుంటూ, లూథ్రా పూర్తి స్థాయిలో వాదనలు వినిపిస్తున్నారని, తాము కౌంటర్ దాఖలు చేసిన తర్వాత వాదనలు వినిపించుకోవచ్చన్నారు. సెక్షన్ 17ఏ విషయంలో చట్టం చాలా స్పష్టంగా ఉందని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవా లని లూథ్రా కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. అవతలి పక్షానికి సైతం అవకాశం ఇద్దామని తెలిపారు. కౌంటర్ల దాఖలకు ఎంత సమయం కావాలని ప్రశ్నిస్తూ.. తొలుత శుక్రవారం కల్లా కౌంటర్ దాఖ లు చేయాలని అదనపు ఏజీకి చెప్పారు. అంత తక్కువ సమయం సరిపోదని అదనపు ఏజీ తెలిపారు. నిబంధనల ప్రకారం రిమాండ్ విధించిన మొదటి 14 రోజుల లోపు పోలీసు కస్టడీ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుందని, అందుకు అనుగుణంగానే ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు. అయితే విచారణను సోమవారానికి వాయిదా వేస్తానని, అప్పటి లోపు కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. సోమవారం వినాయక చవితి సెలవు అని సుధాకర్రెడ్డి చెప్పడంతో అలా అయితే మంగళవారం విచారణ చేపడతానని న్యాయమూర్తి స్పష్టం చేశారు. -
సోషల్ మీడియాలో క్రీడాకారిణికి వేధింపులు
● కేసు నమోదు చేసిన పోలీసులు నెల్లూరు(క్రైమ్): సోషల్ మీడియా వేదికగా క్రీడాకారిణి, ఆమె కుటుంబసభ్యులను వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై నెల్లూరు వేదాయపాళెం పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. నెల్లూరు నగరానికి చెందిన జాతీయ స్థాయి క్రీడాకారిణికి గతంలో చైన్నెకి చెందిన ఎలీషా అనే వ్యక్తి సూర్యారెడ్డి పేరుతో పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని నమ్మించాడు. అయితే అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో ఆమె ఆరా తీసింది. అతడి అసలు పేరు ఎలీషా అని, ఇదివరకే వివాహమై పిల్లలున్నట్లు తెలిసింది. దీంతో ఆమె అతడిని దూరంగా పెడుతూ వచ్చింది. అయితే అతను మాత్రం నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేయడం ప్రారంభించాడు. క్రీడాకారిణితో స్నేహంగా ఉన్న సమయంలో తీసుకున్న ఫొటోలను ఆమె ఇంటి చుట్టుపక్కల అతికించడంతోపాటు ఫోన్ల్లో ఇబ్బందికరంగా మెసేజ్లు పెడుతూ వేధించసాగాడు. అంతేకాకుండా చంపేందుకు యత్నించగా గతేడాది మే నెలలో వేదాయపాళెం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. వారు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో ఉంది. జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన ఎలీషా ప్రవర్తనలో మార్పులేదు. ఈనెల 2వ తేదీన క్రీడాకారిణి ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే కాకుండా ఆమె తల్లి, అక్క ఫొటోలను సేకరించి వాటిని సైతం అప్లోడ్ చేశాడు. వివిధ వ్యక్తుల ద్వారా క్రీడాకారిణి తల్లికి అసభ్యకరమైన మెసేజ్లు పంపుతున్నాడు. దీంతో బాధితురాలు ఎలీషాపై చర్యలు తీసుకోవాలని వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నగల వ్యాపారిని కొట్టి, కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేసి.. కేజీ పైగా బంగారం
పశ్చిమ గోదావరి: బంగారు నగల వ్యాపారి కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేసి.. వారిని విచక్షణారహితంగా కొట్టి కేజీ పైగా బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన ఘటన మంగళవారం రాత్రి తణుకులో చోటుచేసుకుంది. బంగారంతో పాటు లక్ష రూపాయల నగదు కూడా దుండగులు దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. తణుకు నరేంద్ర సెంటర్ వద్ద బంగారు నగల దుకాణాల వీధిలో రేణుక జ్యూయలరీ పేరుతో నామ్దేవ్ వ్యాపారం చేస్తున్నారు. షాపు మేడపైన రెండో అంతస్తులో నామ్దేవ్ కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. మంగళవారం సెలవు కావడంతో షాపులన్నీ మూసి ఉన్నాయి. ఇదే అదునుగా ఐదుగురు దుండగులు సుమారు 7.30 గంటల ప్రాంతంలో ముసుగులు ధరించి నేరుగా నామ్దేవ్ ఇంట్లోకి చొరబడ్డారు. ఆ సమయంలో ముగ్గురు పిల్లలు శ్రేయ, చైత్ర, చేతన ట్యూషన్కు వెళ్లగా ఇంట్లో నామ్దేవ్, అతని భార్య సవిత, కుమారుడు చేతన్ ఉన్నారు. దుండగులు ఇంట్లోకి చొరబడి కత్తులతో బెదిరించి తమతో పాటు తెచ్చుకున్న టేపుతో వారి కాళ్లు, చేతులు కట్టేశారు. ప్రతిఘటించిన నామ్దేవ్ను విచక్షణారహితంగా కొట్టడంతో ఆయన తీవ్ర గాయాలపాలయ్యారు. బెడ్రూమ్లో ఉన్న లాకర్ తాళాలు తీసుకుని లాకర్ తెరిచి కిలోకి పైగా తాకట్టు బంగారం, రూ.లక్ష నగదును దోచుకెళ్లారు. ఇదంతా కేవలం 15 నిమిషాల వ్యవధిలో పూర్తిచేసినట్టు బాధితులు చెబుతున్నారు. దుండగులు కారులో పరారయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దుండగులు వెళ్లిపోయిన కొద్దిసేపటికి తేరుకున్న నామ్దేవ్ తప్పించుకుని ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇవ్వగా, వారు పోలీసులకు సమాచారం అందించారు. తాడేపల్లిగూడెం డీఎస్పీ రాజ్కుమార్, సీఐ ఆంజనేయులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు పట్టణంలోని ప్రధాన కూడలి నరేంద్ర సెంటర్లో భారీ దోపిడీ జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. దోపిడీలో ఐదుగురు పాల్గొనగా నిందితుల ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా టోల్గేట్లను పోలీసులు అప్రమత్తం చేశారు. దుండగుల్లో ఒక వ్యక్తి గతంలో నామ్దేవ్ వద్ద పనిచేసిన సూరజ్కుమార్గా భావిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. -
మా పేరుతో.. పచ్చి మోసం
సాక్షి, అమరావతి: రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) పేరుతో చంద్రబాబు సర్కారు సీమెన్స్, డిజైన్టెక్ కంపెనీలతో కుదుర్చుకున్నట్టు చెబుతున్న ఒప్పందంలో కుతంత్రం బట్టబయలైంది. తమ పేరుతో కుదుర్చుకున్నట్లు చెబుతున్న ఒప్పందం గురించి తమకు ఏమాత్రం సంబంధం లేదని, అసలు ఆ ఒప్పందం గురించే తమకు తెలియదని సీమెన్స్ కంపెనీ వెల్లడించింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద తాము 90 శాతం నిధులను సమకూరుస్తామని చెప్పలేదని స్పష్టం చేసింది. మోసపూరితంగా తమ కంపెనీ పేరును వాడుకుంటూ దీన్ని రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్గా చూపారని తెలిపింది. ఈమేరకు జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయం ఏపీఎస్ఎస్డీసీకి పంపిన ఈ–మెయిల్తో వాస్తవాలు నిర్ధారణ అయ్యాయి. ఈ నేపథ్యంలో సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఎలాంటి అవినీతి జరగలేదని బుకాయించేందుకు ఓ పత్రికా ప్రకటన జారీ చేసిన టీడీపీ అడ్డంగా దొరికిపోయింది. గత ప్రభుత్వం విడుదల చేసిన రూ.370 కోట్లలో రూ.70 కోట్లతో సాఫ్ట్వేర్ కొనుగోలు చేశారని అందులో పేర్కొంది. మరి మిగిలిన రూ.300 కోట్లు ఏమయ్యాయో వెల్లడించకపోవడం ద్వారా ఆ నిధులు కొల్లగొట్టినట్లు పరోక్షంగా అంగీకరించింది. ప్రభుత్వ వాటాగా 10 శాతం నిధులను విడుదల చేశామని పేర్కొన్న టీడీపీ మరి 90 శాతం కింద సీమెన్స్, డిజైన్టెక్ కంపెనీలు నిధులు ఎందుకు సమకూర్చలేదనే విషయాన్ని మాత్రం దాటవేయడం గమనార్హం. షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు సర్కారు నిధులు కొల్లగొట్టిన విషయాన్ని సీఐడీతోపాటు ఈడీ కూడా నిర్ధారించిన విషయాన్ని కప్పిపుచ్చేందుకు, దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు టీడీపీ చేసిన యత్నాలు ఫలించలేదు. 90 శాతం నిధులా..? వంద శాతం మోసమే మాజీ సీఎం చంద్రబాబు కుట్రపూరితంగా సీమెన్స్ కంపెనీ ముసుగులో ఒప్పందం పేరిట భారీ అవినీతికి పాల్పడినట్లు ఆ కంపెనీ పంపిన ఈ – మెయిల్తో స్పష్టమైంది. ఏపీఎస్ఎస్డీసీకి పంపిన ఈ – మెయిల్లో సీమెన్స్ ఇంకా ఏం చెప్పిందంటే.. ఆ ఒప్పందంలో మేం భాగస్వాములం కాదు ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టు ఒప్పందం గురించి మాకు ఎలాంటి సమాచారం లేదు. అందుకు మేం బాధ్యత వహించం. ఆ ప్రాజెక్టు వ్యయంలో 90 శాతం నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్గా సమకూరుస్తామని మేం ఎక్కడా చెప్పలేదు. మా కంపెనీ పేరుతో సుమన్ బోస్తోపాటు జీవీఎస్ భాస్కర్, భావనా గుప్తా, ప్రతాప్ బొంతా, రాహుల్ సెహ్గల్, ఆశీష్ శర్మ, సతీశ్ కురుప్ తదితరులు ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంతో మాకు ఎలాంటి సంబంధం లేదు. 90 శాతం నిధులను సమకూరుస్తామని వారు ఏపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి సీమెన్స్ కంపెనీ బాధ్యత వహించదు. డిజైన్ టెక్ కంపెనీతో కలసి సుమన్ బోస్ దురుద్దేశపూరితంగా వ్యవహరించారు. మోసపూరితంగా రూ.3,300 కోట్ల ప్రాజెక్టుగా పేర్కొన్నారు. సీమెన్స్ కంపెనీ 90 శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు సమకూరుస్తుందని సుమన్ బోస్, డిజైన్ టెక్ కంపెనీ, ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం పూర్తిగా మోసపూరితం. ఆ ఒప్పందంలో మేం భాగస్వాములం కాము. మాకు సంబంధం లేదు.’ గంటా సుబ్బారావు దరఖాస్తే చేయలేదు ఏపీఎస్ఎస్డీసీ ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోసం మా కంపెనీకి ఎలాంటి దరఖాస్తూ చేయలేదు. సీమెన్స్ కంపెనీ అనుబంధ సంస్థ అయిన ఎస్ఐఎస్డబ్లూ భారత్లో మా సాఫ్ట్ట్వేర్ విక్రయాలను పర్యవేక్షిస్తుంది. కానీ ఆ కంపెనీ భారత్లో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఎలాంటి కార్యక్రమాలను చేపట్టడం లేదు. కాబట్టి మేం 90 శాతం నిధులు సమకూరుస్తామనే ఒప్పందం పూర్తిగా బోగస్. సుమన్ బోస్ చాటింగ్, ఈ మెయిల్స్ ఇవిగో.. మా కంపెనీ ముసుగులో సుమన్ బోస్, ఇతరులు డిజైన్ టెక్తో జరిపిన ఈమెయిల్స్, వాట్సాప్ చాటింగ్, బ్రౌజింగ్ హిస్టరీని డిలీట్ చేశారు. వాటిని మేం రిట్రీవ్ చేసి నాలుగు డ్రైవ్లలో మీకు అందిస్తున్నాం. మా కంపెనీ ముసుగులో చేసిన మోసం కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తాం. అయితే మాత్రం అరెస్టులా..? స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఎలాంటి అవినీతి జరగలేదని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన ప్రతిపక్ష టీడీపీ అడ్డంగా దొరికిపోయింది. “ఔను నిధులు కొల్లగొట్టాం.. అయితే మాత్రం కేసు పెడతారా..? అరెస్ట్లు చేస్తారా..? అలాగైతే అది వేధించడమే...!’ అనే తరహాలో వితండవాదం చేస్తుండటం విస్మయం కలిగిస్తోంది. అంశాలవారీగా టీడీపీ వాదనలో డొల్లతనం ఇదీ... రూ.300 కోట్లు లూటీని ఒప్పుకున్న టీడీపీ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రూ.3,300 కోట్లతో సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నామని, అందులో 90 శాతం నిధులను సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు ఇవ్వాలని, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా సమకూర్చాలన్నది ఒప్పందమని టీడీపీ పేర్కొంది. గత ప్రభుత్వం తన వాటాగా జీఎస్టీతో కలిపి రూ.370 కోట్లు విడుదల చేసినట్లు కూడా అంగీకరించింది. అందులో సీమెన్స్ కంపెనీ నుంచి డిజైన్ టెక్ కొనుగోలు చేసిన సాఫ్ట్వేర్ కోసం రూ.70 కోట్లు చెల్లించినట్లు తెలిపింది. ( వాస్తవానికి డిజైన్ టెక్ రూ.56 కోట్లే చెల్లించింది. ఆ విషయాన్ని సీమెన్స్ కంపెనీ ఈ మెయిల్లో వెల్లడించింది. టీడీపీ వాదనను పరిగణలోకి తీసుకుని రూ.70 కోట్లు చెల్లించారని భావించినా మిగిలిన రూ.300 కోట్లు ఏం చేశారన్న దానిపై మాత్రం సమాధానం చెప్పకుండా దాటవేయడం గమనార్హం. అంటే ఆ రూ.300 కోట్లను కొల్లగొట్టినట్లు ఆ పార్టీనే పరోక్షంగా ఒప్పుకుంది. 90 శాతం నిధులతో సాఫ్ట్వేర్ ఎక్కడ? సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 90 శాతం నిధులు సమకూరుస్తాయన్నది ఒప్పందం అని టీడీపీ పేర్కొంది. మరి ఆ మొత్తాన్ని సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలు వెచ్చించాయా? లేదా? అన్న విషయాన్ని మాత్రం టీడీపీ వెల్లడించ లేదు. 90 శాతం రాయితీతో సాఫ్ట్వేర్ను సీమెన్స్ సంస్థ రూ.70 కోట్లకు సమకూర్చిందని చెబుతోంది. మరి అలాంటప్పుడు ప్రాజెక్టు వ్యయాన్ని రూ.3,300 కోట్లుగా ఎందుకు చూపినట్లు..? అందులో ప్రభుత్వ వాటా కింద 10 శాతాన్ని జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లు ఎందుకు చెల్లించినట్లు? నిధులు కొల్లగొట్టేందుకే రూ.70 కోట్ల ప్రాజెక్ట్ను ఏకంగా రూ.3,300 కోట్లుగా కాగితాలపై చూపించి అడ్డగోలుగా ప్రజాధనాన్ని కాజేసినట్లు టీడీపీ ప్రకటనే చెబుతోంది. బాబు ఆదేశాలతో నిబంధనలకు విరుద్ధంగా నిధులు స్కిల్ స్కామ్లో నిధుల విడుదలకు అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రులది బాధ్యత కాదని టీడీపీ చెప్పడం విడ్డూరంగా ఉంది. అప్పటి ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా నాటి సీఎం చంద్రబాబు ఆదేశించడంతోనే నిధులను విడుదల చేస్తున్నట్లు నోట్ ఫైళ్లలో స్పష్టంగా ఉంది. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఆర్థిక శాఖ కార్యదర్శి సునీతతోపాటు పలువురు అధికారులు, ఇతరులను విచారించిన అనంతరం సీఐడీ వాస్తవాలను నిగ్గు తేల్చింది. సీఐడీతోపాటు ఈడీ కూడా నిర్ధారించింది.. అసలు నిధులను ఎక్కడ మళ్లించారని టీడీపీ ప్రశ్నిస్తోంది. షెల్ కంపెనీల ద్వారా నిధులను మళ్లించారని సీఐడీతోపాటు కేంద్ర దర్యాప్త సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆధారాలతో సహా నిర్ధారించాయి. షెల్ కంపెనీలు ఏసీఐ, నాలెడ్జ్ పోడియమ్, ఈటా, పాట్రిక్స్, ఐటీ స్మిత్, భారతీయ గ్లోబల్, ఇన్వెబ్, పోలారీస్, కాడెన్స్ పార్టనర్స్ ద్వారా నిధులను తరలించినట్లు నిగ్గు తేల్చాయి. ఈ కేసులో సీఐడీ ఇప్పటివరకు చంద్రబాబుతోసహా 9 మందిని అరెస్ట్ చేసింది. వారిలో నలుగురిని ఈడీ అరెస్ట్ చేయడంతోపాటు ఆ షెల్ కంపెనీల బ్యాంకు ఖాతాలను అటాచ్ చేసింది. ఈ ప్రాజెక్టులో రూ.355 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైనట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) సైతం నిర్ధారించింది. విదేశాలకు పరారయ్యారు కదా... ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసులు ఇవ్వగానే చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్తోపాటు నిధులు తరలింపులో పాత్రధారిగా వ్యవహరించిన మనోజ్ పార్థసాని రాత్రికి రాత్రే విదేశాలకు పరారయ్యారు. దీనిపై స్పందించకుండా వారికి ఇప్పుడు నోటీసులు జారీ చేయడం ఏమిటని టీడీపీ ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ లభించిన ఆధారాలను బట్టి విచారణ అధికారులు నోటీసులు జారీ చేస్తారు. ఈ కేసులో సీఐడీ కూడా అదే చేసింది. చంద్రబాబు ఆదేశాలతోనే వారు విదేశాలకు పరారైనట్లు స్పష్టంగా తెలిసిపోతోంది. చంద్రబాబు ఏ స్థాయిలో సాక్షులను ప్రభావితం చేయగలరో, దర్యాప్తును పక్కదారి పట్టించగలరో ఈ ఉదంతమే రుజువు చేస్తోంది. ఈ క్రమంలో సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసింది. దర్యాప్తు సాగేకొద్దీ సూత్రధారులు తెరపైకి.. స్కిల్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ పేరిట ఏర్పాటైన కొత్త శాఖలో అన్ని వ్యవహారాలు అధికారులే చూశారని, అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు కేవలం పర్యవేక్షించారని టీడీపీ పేర్కొంది. ఈ కేసులో అచ్చెన్నాయుడును ఇరికించేందుకు సీఐడీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. కానీ కేసు దర్యాప్తు సాగుతున్న కొద్దీ లభిస్తున్న ఆధారాలతో ఈ కుంభకోణం అసలు సూత్రధారులు ఎవరన్నది బయటపడుతోంది. ఆ ఆధారాలతోనే చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఈ కుంభకోణంలో కీలక భూమిక పోషించారని వెల్లడైంది. నోట్ ఫైళ్లు మాయమైనా అధికారులు అందుబాటులో ఉన్నారని, వారిని విచారించాలని టీడీపీ వాదిస్తోంది. అంటే నోట్ ఫైళ్లను మాయం చేశామని ఆ పార్టీ అంగీకరించినట్లే కదా! అందుబాటులో ఉన్న అధికారులను విచారించి, ఇతర అంశాలను నిగ్గు తేల్చి పూర్తి ఆధారాలతోనే సీఐడీ కేసు దర్యాప్తును ఓ కొలిక్కి తెచ్చింది. అన్నిటికి సూత్రధారి, లబ్ధిదారు చంద్రబాబే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంతోపాటు ఇన్నర్ రింగ్ రోడ్డు, రాజధాని మాస్టర్ ప్లాన్ కుంభకోణాల్లో చంద్రబాబు పాత్రను వెలుగులోకి తేవటాన్ని చూసి టీడీపీ బెంబేలెత్తుతోంది. ఇప్పటికే ఈ మూడు కేసుల్లో సీఐడీ కీలక ఆధారాలను సేకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇన్నర్రింగ్ రోడ్ అలైన్మెంట్ను మూడు సార్లు మార్చిన వైనం, ఆ అలైన్మెంట్ను ఆనుకుని వందలాది ఎకరాలను ఎలా సేకరించారు?.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను బెదిరించి బినామీల ద్వారా అసైన్డ్ భూములు ఎలా కొల్లగొట్టారు? లింగమనేని రమేశ్తో క్విడ్ ప్రోకోకు ఎలా పాల్పడ్డారు.. తదితరాలన్నీ బట్టబయలయ్యాయి. ఆ కేసుల్లో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణ, ఏ–6గా లోకేశ్పై ఇప్పటికే ఎఫ్ఐఆర్ను నమోదు చేసింది. తమ అవినీతి బాగోతం సాక్షాధారాలతో రుజువు కావడంతో ఎల్లో మీడియా సహకారంతో టీడీపీ కుయుక్తులు పన్నుతోంది. అవినీతి నెట్వర్క్ గుట్టు రట్టు స్కిల్ డెవలప్మెంట్ ముసుగులో చంద్రబాబు ఖజానా నుంచి విడుదల చేసిన రూ.371 కోట్లు ఎక్కడకు వెళ్లాయన్నది ఈ కేసులో కీలకంగా మారింది. ఆ నిధులన్నీ షెల్ కంపెనీల ద్వారా చివరకు చంద్రబాబుకే చేరినట్లు సీఐడీ దర్యాప్తులో ఆధారాలతోసహా వెల్లడైంది. షెల్ కంపెనీల కమీషన్లు పోనూ రూ.241 కోట్లను అవినీతి నెట్వర్క్ ద్వారా చంద్రబాబు నివాసానికి చేరినట్లు గుర్తించారు. మరోవైపు అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలు, టిడ్కో ఇళ్ల ప్రాజెక్ట్ల కాంట్రాక్టు కేటాయింపులలోనూ చంద్రబాబు భారీగా అవినీతికి పాల్పడ్డారు. షెల్ కంపెనీల ద్వారా బాబుకు డబ్బులు చేరాయిలా.. ► టీడీపీ ప్రభుత్వం పుణెకు చెందిన డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించింది. ► డిజైన్ టెక్ నుంచి పుణెలోని పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి రూ.238.29 కోట్లు, ఢిల్లీలోని ఏసీఐ కంపెనీకి రూ.2.71 కోట్లు అంటే మొత్తం రూ.241 కోట్లు తరలించారు. ► పీవీఎస్పీ కంపెనీ నుంచి మళ్లీ ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్లో ఉన్న వివిధ షెల్ కంపెనీలతోపాటు దుబాయ్, సింగపూర్లోని కంపెనీలకు నిధుల తరలింపు ఇలా సాగింది... ఏసీఐ: రూ.56 కోట్లు, నాలెడ్జ్ పోడియమ్: రూ.45.28 కోట్లు, ఈటా: రూ.14.1 కోట్లు, పాట్రిక్స్: రూ.3.13 కోట్లు, ఐటీ స్మిత్: రూ.3.13 కోట్లు, భారతీయ గ్లోబల్: రూ.3.13 కోట్లు, ఇన్వెబ్: రూ.1.56 కోట్లు, పోలారీస్: రూ.2.2 కోట్లు, కాడెన్స్ పార్టనర్స్: రూ.12 కోట్లు ► మొత్తం రూ.140.53 కోట్లను ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి యోగేశ్ గుప్తా డ్రా చేసి మనోజ్ వాసుదేవ్ పార్థసానికి అందించాడు. మనోజ్ పార్ధసాని ఆ నగదు మొత్తాన్ని చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్కు హైదరాబాద్లో ముట్టజెప్పాడు. అంటే ఆ రూ.140.53 కోట్లను చివరకు చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ► ఇక మిగిలిన రూ.100.47 కోట్లను పీవీఎస్పీ కంపెనీ దుబాయి, సింగపూర్లోని కంపెనీలకు మళ్లించింది. ఆ నిధులను మళ్లీ హవాలా మార్గంలో హైదరాబాద్కు తరలించారు. అక్కడ మనోజ్ పార్థసాని ద్వారా చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్కు అందించారు. అనంతరం చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ► అవినీతి నెట్వర్క్ ద్వారా ఇలా రూ.241 కోట్లు గుట్టు చప్పుడు కాకుండా చంద్రబాబు బంగ్లాకు చేరిపోయాయి. -
ఇల్లు కాదు జైలే..
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తనను జైలులో కాకుండా హౌస్ రిమాండ్ (ఇంటి వద్ద)లో ఉంచాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ను విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం కొట్టి వేసింది. హౌస్ రిమాండ్కు సంబంధించి ఏ చట్టంలో కూడా ఎలాంటి నిర్దిష్ట ప్రస్తావన లేదని స్పష్టం చేసింది. అందువల్ల హౌస్ రిమాండ్ విషయంపై విచారణ జరిపే పరిధి ఈ కోర్టుకు (ఏసీబీ కోర్టు) లేదని పేర్కొంది. అంతేకాక హౌస్ రిమాండ్లో ఎందుకు ఉంచాలనేందుకు చంద్రబాబు సరైన కారణాలను తమ ముందుంచలేదని తెలిపింది. హౌస్ రిమాండ్ విషయంలో న్యాయస్థానాన్ని పిటిషనర్ ఒప్పించలేకపోయారని, భద్రత విషయంలో ఇంటి వద్ద కంటే జైలు వద్దే ఎక్కువ భద్రత ఉంటుందన్న అభిప్రాయాన్ని ఏసీబీ కోర్టు వ్యక్తం చేసింది. ప్రత్యేక భద్రతా దళం (ఎస్పీజీ) భద్రత ఉన్న వ్యక్తికి అదే స్థాయిలో ఇంటి వద్ద భద్రత కల్పించడం సాధ్యం కాకపోవచ్చునంది. చంద్రబాబు భద్రత కోసం జైలులో పూర్తిస్థాయి చర్యలు తీసుకున్నామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. మాకేవీ కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు తనను జైలులో కాకుండా హౌస్ రిమాండ్లో ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మాజీ సీఎం చంద్రబాబు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం రోజు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా, సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న ఏసీబీ కోర్టు తన తీర్పును వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం న్యాయస్థానం తన నిర్ణయాన్ని వెలువరించింది. హౌస్ రిమాండ్ పిటిషన్ను కొట్టేస్తున్నట్లు తీర్పు వెలువరించింది. కొట్టివేయటానికి కారణాలు ఏమిటో కూడా కోర్టు వివరించింది. ఈ సమయంలో చంద్రబాబు తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ తమకేమీ కారణాలు వివరించాల్సిన అవసరం లేదని పేర్కొనగా, కారణాలను వెల్లడించాల్సిన బాధ్యత తమపై ఉందని కోర్టు స్పష్టం చేసింది. హౌస్ రిమాండ్ పిటిషన్ తిరస్కరణకు కారణాలను వివరించింది. జ్యుడీషియల్, పోలీసు రిమాండ్ మాత్రమే ఉన్నాయి.. మాజీ సీఎం చంద్రబాబు కోరుతున్న హౌస్ రిమాండ్ అసాధారణ అభ్యర్థన అని సోమవారం వాదనల సందర్భంగా అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి కోర్టుకు నివేదించారు. ఈ ప్రస్తావన ఏ చట్టంలో కూడా లేదని, అందువల్ల హౌస్ రిమాండ్ మంజూరు చేయడానికి వీల్లేదని వాదించారు. చంద్రబాబుకు ప్రస్తుతం ఉన్న భద్రత కంటే జైలులో ఇంకా ఎక్కువ భద్రత ఉందని వివరించారు. జైలులో చంద్రబాబు భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. జైలులో చంద్రబాబు భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని తెలిపారు. చట్టంలో కేవలం జ్యుడీషియల్ రిమాండ్, పోలీసు రిమాండ్ మాత్రమే ఉన్నాయని కోర్టుకు నివేదించారు. ఏసీబీ కోర్టు తీర్పు సందర్భంగా ఈ వాదనలను పరిగణలోకి తీసుకుంది. బెయిల్ పిటిషన్ అంటూ హల్చల్... మాజీ సీఎం చంద్రబాబు తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నానంటూ ఏసీబీ కోర్టులో మంగళవారం ఓ న్యాయవాది హడావుడి సృష్టించారు. చంద్రబాబు తరఫున ఓ టీడీపీ కార్యకర్త పేరుతో తాను బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు ఆ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ పిటిషన్పై విచారణ జరపాలని కోరారు. అయితే చంద్రబాబు వకాలత్ ఇవ్వకుండా ఆయన తరఫున ఎలా బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారని కోర్టులో ఉన్న న్యాయవాదులు చర్చించుకున్నారు. ఆ న్యాయవాది తీరును గమనించిన న్యాయస్థానం ఈ విషయాన్ని చంద్రబాబు తరఫున గత మూడు రోజులుగా వాదనలు వినిపిస్తున్న న్యాయవాదుల దృష్టికి తెచ్చింది. చంద్రబాబు ఎలాంటి బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదని వారు కోర్టుకు తెలియచేయడంతో ఆ విషయాన్ని అక్కడితో వదిలేసింది. సుదీర్ఘ వాదనలు.. సందేహాల నివృత్తి తరువాతే తీర్పు మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన హౌస్ రిమాండ్ పిటిషన్పై ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలను ఏసీబీ కోర్టు ఎంతో ఓపికగా విన్నది. దాదాపు మూడు గంటలకు పైగా చంద్రబాబు పిటిషన్పైనే విచారణ జరిపింది. ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించేందుకు ఎంత సమయం తీసుకున్నా వారిని ఏ దశలోనూ కోర్టు నిలువరించలేదు. అటు చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది వినిపించిన ప్రతీ వాదననూ సావధానంగా ఆలకించింది. ఆయన కోర్టు దృష్టికి తెచ్చిన ప్రతీ తీర్పునూ నిశితంగా పరిశీలించింది. వాటి విషయంలో తనకున్న సందేహాలను సైతం ఏసీబీ కోర్టు నివృత్తి చేసుకుంది. అలాగే సీఐడీ తరఫు న్యాయవాది చేసిన వాదనలను సైతం అదే రీతిలో ఆలకించింది. సీఐడీ న్యాయవాదిని కూడా ప్రశ్నించి తన సందేహాలను ఏసీబీ కోర్టు నివృత్తి చేసుకుంది. చివరకు సీఐడీ న్యాయవాది వాదనలతో ఏకీభవిస్తూ తీర్పును వెలువరించింది. చంద్రబాబుకు హౌస్ రిమాండ్ ఎందుకు ఇవ్వడం లేదో కోర్టు హాలులోనే చాలా స్పష్టంగా వివరించింది. తమకేమీ కారణాలను చెప్పాల్సిన అవసరం లేదని చంద్రబాబు తరఫు న్యాయవాది గట్టిగా వ్యాఖ్యానించినా కూడా, తన బాధ్యత మేరకు కారణాలను వెల్లడిస్తున్నట్లు స్పష్టం చేసింది. గత మూడు రోజులుగా చంద్రబాబు తరఫు న్యాయవాదులు వరుసగా పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నా, తీవ్రమైన పని భారం ఉన్నప్పటికీ అన్ని పిటిషన్లను ఏసీబీ కోర్టు చాలా ఓపికగా విచారించింది. ఎక్కడా కూడా ఎలాంటి తొందరపాటుకు ఆస్కారం లేకుండా విచారణ జరుపుతూ వస్తోంది. న్యాయవాదులతో, ఇతరులతో (చంద్రబాబుకు చెందిన వ్యక్తులు) కోర్టు హాలు కిక్కిరిపోయినప్పటికీ ఏ దశలోనూ ఒత్తిడికి లోనుకాకుండా ఏసీబీ కోర్టు తన బాధ్యతలను నిర్వర్తించింది. -
వ్యవసాయ బావిలో దూకి కుమార్తెతో కలిసి దంపతుల ఆత్మహత్య
కొత్తవలస(విజయనగరం జిల్లా): ఆ కుటుంబానికి ఏం కష్టమొచ్చిందో తెలియదు. ఆరోగ్యం, ఆర్థికంగా బాగానే ఉన్నా... ఊరు కాని ఊరు వచ్చి కుమార్తెతో కలిసి దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామ సమీపంలో మంగళవారం చోటుచేసుకోంది. పోలీసులు, స్థానికులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖలోని ఓ షిప్పింగ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న మహ్మద్ మొహిసుద్దీన్ (46) మర్రిపాలెం సమీపంలో ఎఫ్సీఐ కాలనీలో ఉంటున్నాడు. అతడికి భార్య సంషినిషా (38), కూతురు ఫాతిమా జహీదా (17), కుమారుడు మహ్మద్ ఆలీ ఉన్నారు. అతడు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామ సమీపంలో గతంలో కొంత భూమి కొనుగోలు చేశాడు. ఆ భూమిని చూసేందుకు దంపతులిద్దరూ, కుమార్తె క్యాబ్ బుక్ చేసుకొని ఇంటి నుంచి సోమవారం వచ్చారు. సాయంత్రం వరకు ఆ ప్రాంతంలో తిరిగారు. ఇంతలో ఏమైందో గానీ ముగ్గురూ గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలోదూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బావిగట్టుపై మృతుడికి చెందిన సెల్ఫోన్, తమ బంధువులకు సంబంధించిన ఫోన్ నంబర్లు రాసిన కాగితం, ఇతర వస్తువులు ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. బావిలోకి చూడగా మృతదేహాలు తేలియాడడం గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో సీఐ ఎస్.చంద్రశేఖర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ దొరికిన ఆధారాలతో ఫోన్ చేసి మృతుడు మొహిసుద్దీన్ కొడుకు మహ్మద్ ఆలీకి సమాచారం అందించారు. మృతుల కటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని మృతులను గుర్తించారు. ఆలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఎస్.కోట సీహెచ్సీకి తరలించినట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు. మృతురాలు జిహీదా విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. కొడుకు ఆలీ ఎంబీఏ చదువుతున్నాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ ఘటనా స్థలాన్ని విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు సందర్శించారు. క్లూస్ టీమ్తో క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నట్టు ఆయన తెలిపారు. మృతుల సెల్ఫోన్లను ఓపెన్ చేసి కాల్డేటాను సేకరిస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. కాల్ డేటా సేకరిస్తే ఆత్మహత్యకు గల కారణాలు తెలిసే అవకాశం ఉంటుందన్నారు. ఎయిర్పోర్టు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు గోపాలపట్నం: కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామ సమీపంలో కుమార్తెతో కలిసి దంపతులిద్దరూ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనతో మర్రిపాలెం ఎఫ్సీఐ కాలనీలో విషాదం నెలకొంది. సోమవారం ఉదయం వెళ్లిన తల్లిదండ్రులు చెల్లి ఎంతకీ రాకపోవడంతో కుమారుడు మహ్మద్ ఆలీ ఎయిర్పోర్టు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇంతలో ముగ్గురు మృతి చెందిన వార్త తెలియడంతో కుమారుడు, బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. ఉదయం వరకు సరదాగా ఉన్న వాళ్లు ఎందుకు ఇంత పనిచేశారంటూ గుండెలవిసేలా రోదించారు. అప్పులే కారణమా...? గతంలో షిప్పింగ్ కంపెనీలో పనిచేసిన మొహిసుద్దీన్ కొన్నాళ్లగా సొంతంగా కాంట్రాక్ట్ పనులు చేపడుతున్నాడు. దీంతో కొంతమేరకు అప్పుల పాలైనట్లు సమాచారం. ఆత్మహ్యతకు ఇది కారణం కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
‘హౌస్ రిమాండ్లో ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత?’
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టయిన ప్రధాన ముద్దాయి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టులో ఊరట దక్కలేదు. ఆయన తరపున దాఖలైన హౌజ్ రిమాండ్ కస్టడీ పిటిషన్ను ఏసీబీ కోర్టు మంగళవారం సాయంత్రం కొట్టేసింది. ఏపీ సీఐడీ వాదనతో ఏకీభవించిన కోర్టు.. జైల్లోనే ఆయనకు భద్రత ఉంటుందని స్పష్టంగా పేర్కొంటూ హౌజ్ రిమాండ్ పిటిషన్ను తిరస్కరిస్తున్నట్లు తీర్పునిచ్చింది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పు సందర్భంగా.. ఇంట్లో వుండే భద్రత కంటే.. జైల్లో వుండే భద్రత ఎక్కువ. ఒకసారి కోర్టు రిమాండ్ విధించింది అంటే.. అది వ్యవస్థ బాధ్యత. హౌస్ రిమాండ్ కావాలని అడుగుతున్నారు. కానీ, అక్కడ ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత?. జైల్లో భద్రత కల్పిస్తున్న వాటిపై అన్ని అంశాలు స్పష్టంగా సీఐడీ చెప్పింది. జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తులకు ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఇవ్వాలనే అంశాన్ని కోర్టులో చూపకపోవడంతో డిస్మిస్ చేస్తున్నాం. హౌస్ కస్టడీలో ఉంచేందుకు చట్టపరమైన నియమ నిబంధనలను ఏసీబీ కోర్టు ఎదుట చూపలేదు. ఈ కారణాలతో హౌస్ అరెస్టుకు సంబంధించిన పిటిషన్ కొట్టివేస్తున్నాం. స్కిల్ స్కాంలో ఏ1 చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టు విధించిన 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ను.. హౌజ్ రిమాండ్గా పరిగణించాలని, ఈ మేరకు ఇంట్లోనే ఉండేందుకు ‘హౌజ్ అరెస్ట్’ ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విజ్ఞప్తిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌంటర్ దాఖలు చేసింది ఏపీ సీఐడీ. చంద్రబాబుకు ప్రాణహాని ఉందంటూ ప్రధానంగా పేర్కొన్న చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూద్రా.. చంద్రబాబుకు ఉన్న ఎన్ఎస్జీ భద్రత, వీవీఐపీ, 73 ఏళ్ల వయస్సు, ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని హౌస్ అరెస్ట్కు అనుమతి ఇవ్వాలంటూ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో 2018 భీమా కోరేగావ్ హింస కేసులో నిందితుడు.. మానవ హక్కుల సంఘం కార్యకర్త గౌతమ్ నవలఖాకు సుప్రీం కోర్టు ‘హౌజ్ అరెస్ట్’ వీలు కల్పించిన కేసును ప్రస్తావించారు కూడా. అయితే సీఐడీ.. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుకు ముప్పు లేదని.. ఆయన పూర్తి భద్రతలో ఉన్నారని.. జైలులో ప్రత్యేక గది, ఇంటి భోజనం, మందులు, వ్యక్తిగత సహాయకుడిని కల్పించామని, చంద్రబాబు బయట ఉంటే సాక్షులని ప్రభావితం చేసే అవకాశముందని.. గృహ నిర్బంధం పిటిషన్కి విచారణ అర్హత లేదని.. పిటిషన్ తిరస్కరించాలని సీఐడీ తరఫున గట్టి వాదనలు వినిపించారు సుధాకర్ రెడ్డి. ఇరు వర్గాల వాదనలు విన్న విజయవాడ ఏసీబీ న్యాయమూర్తి.. సీఐడీ వాదనలతోనే ఏకీభవించారు. చంద్రబాబు హౌజ్ కస్టడీ పిటిసన్ను కొట్టివేస్తున్నట్లు తీర్పు ఇచ్చారు. ప్రైవేట్ హౌజ్లో అంత భద్రత ఎక్కడ?: ఏఏజీ ‘‘సీఆర్పీసీలో రెండు కస్టడీలు మాత్రమే ఉన్నాయి. అవి జ్యూడీషియల్, పోలీస్ కస్టడీలు. హౌజ్ అరెస్ట్ అనేది లేనే లేదు. చట్టం ముందు అందరూ సమానమే. చంద్రబాబుకి పూర్తి భద్రత ఉంది. రాజమండ్రి జైలులో హైసెక్యూరిటీ ఉంది. ప్రైవేట్ హౌజ్లో అంత భద్రత ఎక్కడ ఉంటుంది. పైగా చంద్రబాబు కోసం ఇంటి నుంచే ఆహారం పంపించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. చంద్రబాబు విన్నపాలను పరిగణనలోకి తీసుకున్నాం. బాబు అనుమతి లేనిదే వారి బ్లాక్కూ ఎవరూ వెళ్లరు. బాబు ఆరోగ్య పర్యవేక్షణకు వైద్యులు అందుబాబులో ఉంటారు.’’ ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేదనడం తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది. ఎఫ్ఐఆర్లో పేరు లేకపోతే తప్పు చేయలేదని కాదు. చంద్రబాబు పాత్ర దర్యాప్తులో బయటపడింది. దర్యాప్తులో వెల్లడైన వివరాల మేరకే చంద్రబాబు పేరు. :::తీర్పు అనంతరం ఏజీజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి -
రామోజీ, శైలజాలకు బిగ్ షాక్..
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై రామోజీరావు, శైలజా కిరణ్లతో పాటు ఆ సంస్థకు చెందిన పలువురు కీలక వ్యక్తులు, ఉద్యోగులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ కేసులో తాము దాఖలు చేసిన చార్జిషీట్లను గుంటూరు, విశాఖపట్నంలోని డిపాజిటర్ల పరిరక్షణ చట్టం ప్రత్యేక కోర్టులు ‘రిటర్న్’ చేస్తూ గత నెల 28న జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సీఐడీ దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ అప్పీళ్లలో ప్రతివాదులుగా ఉన్న మార్గదర్శి చైర్మన్ చెరుకూరు రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్, ఆడిటర్ కుదరవల్లి శ్రవణ్లతో పాటు వైస్ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు, బ్రాంచ్ మేనేజర్లు ఇలా మొత్తం 15 మందికి నోటీసులు జారీచేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని వీరందరినీ ఆదేశించింది. విచారణ 18కి వాయిదా.. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రామోజీరావు, శైలజా కిరణ్లతో పాటు మొత్తం 15 మందిపై ఐపీసీ, డిపాజిటర్ల పరిరక్షణ చట్టం, చిట్ఫండ్ చట్టాల కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. ప్రత్యేక కోర్టుల్లో చార్జిషీట్లు.. దర్యాప్తు చేసి డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేసింది. వీటిని పరిశీలించిన ప్రత్యేక కోర్టులు వాటిని రిటర్న్ చేశాయి. గుంటూరులో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఉత్తర్వులు జారీచేయగా, విశాఖపట్నంలో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఉత్తర్వులిచ్చారు. ఈ రెండు కోర్టులు కూడా ఆగస్టు 28వ తేదీనే ఉత్తర్వులు వెలువరించడం విశేషం. రెండు కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు దాదాపుగా ఒకే రకంగా ఉండటం మరో విశేషం. ఈ రెండు కోర్టులిచ్చిన ‘రిటర్న్’ ఉత్తర్వులను సవాలు చేస్తూ సీఐడీ హైకోర్టులో గత వారం క్రిమినల్ అప్పీళ్లు దాఖలు చేసింది. ఈ అప్పీళ్లపై సోమవారం జస్టిస్ శ్రీనివాసరెడ్డి విచారణ జరిపారు. ఇది కూడా చదవండి: చంద్రబాబు కేసు అప్డేట్స్.. ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటిషన్ -
ఆర్థిక నేరగాళ్లకు ‘స్నేహ’హస్తం!
సాక్షి, రాజమహేంద్రవరం: ‘స్నేహ బ్యారక్’.. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. రాజమండ్రి సెంట్రల్ జైల్లోని ఈ బ్యారక్కు అంత క్రేజ్ ఎందుకంటే.. ఆర్థిక నేరాల్లో రిమాండ్కు వచ్చే ఖైదీలకు ఆ బ్యారక్ను కేటాయిస్తుంటారు. ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో జ్యుడీషియల్ రిమాండ్ అనుభవిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సైతం అదే బ్యారక్ కేటాయించడంతో ఆ బ్లాక్ పేరు మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చింది. జైలుకు 150 ఏళ్ల చరిత్ర రాజమండ్రి సెంట్రల్ జైలుకు 150 ఏళ్లకుపైగా చరిత్ర ఉంది. అత్యంత భద్రతతో కూడిన జైల్గా దీనికి పేరు. జైల్లో చిన్నవి, పెద్దవి కలిపి 11 బ్లాక్లు ఉన్నాయి. ఒక్కో బ్లాక్కు కనిష్టంగా 6 రూములు ఉంటాయి. ఇలా మొత్తం 52 గదులు ఉన్నాయి. 1602లో డచ్ దేశస్థులు కోట నిర్మిస్తే.. దానిని 1864లో బ్రిటిష్ పాలకులు జైలుగా మార్చారు. 1870లో పూర్తి స్థాయి కేంద్ర కారాగారంగా తీర్చిదిద్దారు. 190 ఎకరాల్లో విస్తరించిన జైల్లో సుమారు 152.76 ఎకరాలు ఖాళీ స్థలం కాగా, 37.24 ఎకరాల్లో భవనాలు ఉన్నాయి. అప్పట్లో నిర్మించిన భవనాలు నేటికీ చెక్కుచెదరలేదు. ఇటీవల కొన్నింటిని ఆధునీకరించారు. చంద్రబాబుకు ప్రత్యేక వసతులు అధునాతన వసతులతో నిర్మించిన స్నేహ బ్లాక్లో 13 గదులు ఉంటాయి. చంద్రబాబు రిమాండ్కు వచ్చిన సందర్భంగా అప్పటికే ఉన్న ఖైదీలను ఖాళీ చేయించి బ్యారక్ మొత్తం ఆయనకే కేటాయించారు. ఇతర బ్యారక్ల నుంచి ఖైదీలు ఎవరూ అటు వైపు వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. వీఐపీలకు ఉండే సౌకర్యాలన్నీ కల్పించారు. అందులో ఒక గదిని అత్యంత సౌకర్యవంతంగా తయారు చేసి బాబుకు కేటాయించారు. గదిలో ఫ్యాన్, సేదతీరేందుకు సౌకర్యమైన బెడ్, న్యూస్ పేపర్, ఏసీ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అయితే గదిలో ప్రత్యేకంగా టీవీ ఉండదు. కామన్ ఏరియాలో ఉంటుంది. బయటకు వెళ్లి ఇతర ఖైదీలతో కలసి టీవీ చూసే వెసులుబాటు చంద్రబాబుకు లేదు. 24 గంటల పాటు వైద్యులను అందుబాటులో ఉంచారు. ఇక చంద్రబాబుకు మందులు, భోజనం లాంటి సేవలు అందించేందుకు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని కేటాయించారు. నలుగురు వ్యక్తిగత భద్రత సిబ్బందిని పహారా పెట్టారు. వీరితో పాటు 24 గంటలూ జైలు సిబ్బంది బ్యారక్ చుట్టూ కాపలా ఉంటారు. చంద్రబాబుకు ముందు ఈ బ్లాక్ను ఎర్రచందనం అక్రమ రావాణా కేసులో రిమాండ్కు వచ్చిన వారికి కేటాయించారు. ఇది కూడా చదవండి: చంద్రబాబుకు జైలు భోజనమే పెట్టాలి -
స్నేహితుడి భార్యను కాపాడబోయి..
అనంతపురం సిటీ: రైలు కిందపడబోతున్న స్నేహితుడి భార్యను కాపాడబోయి ఓ మిత్రుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు.. ఉత్తరప్రదేశ్లోని ఆవాజ్పూర్కు చెందిన రక్షపాల్ (34), తన స్నేహితుడు మున్నాకుమార్, అతని భార్య హీరామతితో కలసి రాప్తాడు మండలం హంపాపురం వద్ద ఉన్న సిమెంట్ ఇటుకల ఫ్యాక్టరీలో దిన కూలీగా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉత్తరప్రదేశ్కు మున్నాకుమార్, హీరామతి దంపతులను రైలు ఎక్కించేందుకు తోడుగా రక్షపాల్ అనంతపురంలోని రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. ఆదివారం రాత్రి 11.30 గంటలకు రైలు స్టేషన్కు చేరుకోగానే బోగిని వెతుక్కొని మున్నాకుమార్ ఎక్కేలోపే రైలు ముందుకు కదిలింది. ఆ సమయంలో హీరామతి రైలు ఎక్కే ప్రయత్నంలో కాలు జారి ప్లాట్ఫామ్కు రైలుకు మధ్య ఇరుక్కుపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో రక్షపాల్ కూడా రైలు–ప్లాట్ ఫామ్ మధ్య ఇరుక్కుపోయాడు. బోగిలోని చైన్ను మున్నాకుమార్ లాగడంతో రైలు కొద్ది దూరం వెళ్లి ఆగింది. అప్పటికే హీరామతి కుడి పాదం తెగిపడింది. రక్షపాల్ తలకు బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సర్వజనాస్పత్రికి తరలించారు. చికిత్స అందేలోపు రక్షపాల్ మృతి చెందాడు. హీరామతిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు పెద్దాస్పత్రికి తీసుకెళ్లారు. రక్షపాల్కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై జీఆర్పీ ఎస్ఐ విజయ్కుమార్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
Babu in Jail : చంద్రబాబు రిమాండ్ ఆర్డర్లో కీలకాంశాలు
స్కిల్స్కామ్ కేసులో విజయవాడ ACB ప్రత్యేక కోర్టు.. చంద్రబాబు రిమాండ్ ఆర్డర్ కాపీలో కీలక అంశాలను ప్రస్తావించింది. చంద్రబాబునాయుడిని కోర్టు ముందు హాజరు పరిచినప్పుడు CID అధికారులు కేసుకు సంబంధించి పూర్తి రికార్డులు, 700 పేజీలలో సమర్పించారని నివేదికలో తెలిపింది. నంద్యాలలో సెప్టెంబర్ 9, 2023, శనివారం రోజు 6గంటలకు చంద్రబాబును అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. చంద్రబాబు అవినీతికి ఆధారాలు ఇవే.. 👉: 30.1.2015న స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ను ఉన్నత విద్యా మండలి ద్వారా నడిపించేందుకే సుబ్బారావును ఎక్స్ అఫిషియో సభ్యునిగా నియమించిన చంద్రబాబు అవినీతికి తెరలేపారు. 👉: ఈ కేసులో కీలక పాత్ర పోషించిన సీమెన్స్ డైరెక్టర్ జీవీఎస్ భాస్కర్ సతీమణి అపర్ణను స్కిల్ డెవలప్మెంట్ కార్పేరేషన్లో డిప్యూటి సీఈఓగా నియమించారు. ఈమెను మూడునెలల ముందే ప్రజంటేషన్లో భాగస్వామ్యం చేయడంతో పాటు ప్రాజెక్టు వివరాలన్నీ అపర్ణకు షేర్ చేశారు. 👉: రూల్సుకు విరుద్ధంగా… సీమెన్స్ నుంచి 90శాతం నిధులు రాకుండానే నేరుగా ప్రభుత్వం వాటా అయిన 10శాతం నిదులు మొత్తం 371కోట్లు రిలీజ్ చేయాల్సిందిగా కార్యదర్శి పివి రమేష్, చీఫ్ సెక్రటరీని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సాక్ష్యధారాలు మాయం చేసిన చంద్రబాబు… 👉: డిజైన్టెక్ వ్యవహారం బయటకు రావడంతో చంద్రబాబు అండ్ కో సాక్ష్యాధారాలను మాయం చేసింది. ఏకంగా 30.06.2016న విడుదలైన జీవో నెంబర్-4కు సంబంధించిన ఒరిజినల్ నోట్ ఫైల్ను సుబ్బారావు OSD NVK ప్రసాద్(ఏ-5) ద్వారా మాయం చేశారు. 👉: ఈ కేసులో నిధులు కొల్లగొట్టేందుకు… 20.10.2014న స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చార్టెడ్ అకౌంటంట్గా లక్ష్మినారాయణ(A-4) బంధువు వెంకటేశ్వర్లును జీవో నెంబర్- 48 ద్వారా నియమించారు చంద్రబాబు విచారణను అడ్డుకునే ప్రమాదం ఉంది… 👉: చంద్రబాబు తన పరపతితో విచారణను అడ్డుకునే ప్రమాదం ఉంది. సాక్షులను బెదిరించి దర్యాఫ్తును ప్రబావితం చేసే ప్రమాదం ఉంది. 👉: చంద్రబాబు రిమాండ్ తరలించి దర్యాఫ్తు సజావుగా జరిగిలే చూడాల్సిన అవసరం ఉందని సీఐడీ కోరింది. 👉: ఈ కేసులో అధికారులతో పాటు ఇతర సాక్ష్యులతో మరింత సమాచారం సేకరించాల్సి ఉంది. 👉: చంద్రబాబునాయుడు తన అధికారం అడ్డుపెట్టుకుని 279కోట్ల నిధులు మాయం చేసిన కేసులో ప్రధాన నిందితుడు. చంద్రబాబు వాదనలపై… 👉: కేవలం రాజకీయ కారణాలతోనే తనను అరెస్టు చేసినట్లు చంద్రబాబు ఆరోపిస్తున్నారు. కక్ష్యసాధింపులో భాగంగానే అరెస్టు చేశారని వాదించారు. కాని దర్యాప్తు అధికారులు సమర్పించిన ఆధారాలనూ చూస్తే పూర్తి సాంకేతిక ఆధారాలు సెక్షన్ 167కింద రిమాండ్ చేశారని అర్ధమవుతోంది. 👉: రాజకీయ కక్ష్య కారణమన్నది పూర్తిగా అసంబద్ధం. 👉: ఇది అవినీతి నిరోదక శాఖ కాబట్టి సీఐడికి విచారణ పరిధిలేదన్న చంద్రబాబు వాదన సరైంది కాదు. గతంలో హైకోర్టు చాలా కేసుల్లో సీఐడికి అధికారాలున్నాయని డిక్లరేషన్ ఇచ్చింది. 👉: అవినీతి నిరోదక కేసులను పీసీ యాక్ట్ కింద సీఐడీ నేరుగా విచారణ చేయవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. 👉: ప్రజాప్రతినిధుల చట్టాన్ని ఉల్లంఘించి తనకు సంక్రమించిన అధికారాలను దుర్వినియోగం చేసి 279కోట్లను అక్రమంగా అవినీతి చేసి ప్రభుత్వానికి నష్టం కలిగించారు. 👉: చంద్రబాబు నిందితులు సుబ్బారావు, లక్ష్మినారాయణతో కలిసి కుట్రచేసినట్లు పూర్తి ఆధారాలున్నాయి. ఈ ఆధారాలు అవినీతి నిరోధక చట్టం పరిధిలో ఉన్నాయి. ఈ ఆధారలను బట్టి ఈ కేసులో సెక్షన్ ఐపీసీ 120బీ, 109 సెక్షన్లు పెట్టడం సబబే. కుంభకోణం బయటకు ఎలా వచ్చింది? తాము చెల్లించిన పన్నులకు సంబంధించి కొంత మొత్తం తమకు రావాలంటూ ఆదాయంపన్ను శాఖను డిజైన్ టెక్ సిస్టమ్స్ సంప్రదించింది. దీనిపై అనుమానం వచ్చిన ఐటీ అధికారులు మొత్తం కూపీ లాగారు. 2015 నుంచి 2018 మధ్య కాలంలో ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు రూ.241 కోట్లు షెల్ కంపెనీలకు రూట్ అయినట్టు గుర్తించారు. దీనిపై ఆదాయంపన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఆరా తీయడంతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. 👉: చంద్రబాబు రిమాండ్ కాపీ పూర్తి డాక్యుమెంట్ కోసం క్లిక్ చెయ్యండి -
LIVE Updates : చంద్రబాబు హౌజ్ అరెస్టుపై విచారణ రేపటికి వాయిదా
రాజమండ్రి జైల్లో చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691గా ఉన్నారు. నిన్న టిడిపి నేతలు, ఎల్లో మీడియా హడావిడి చూస్తే.. ఈ రోజు కోర్టు ప్రారంభం కాకముందే బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారని అంతా భావించారు, కానీ చంద్రబాబు తరపు లాయర్లు ఎలాంటి బెయిల్ పిటిషన్ కోర్టులో వేయలేదు. చంద్రబాబును జైల్లో వద్దు, గృహ నిర్భంధంలో ఉంచండి అంటూ బాబు తరపు లాయర్లు వేసిన పిటిషన్పై వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున సిద్ధార్థ లుథ్రా వాదనలు వినిపించారు 7.10PM - కేసు విచారణ రేపటికి వాయిదా ► ఏసీబీ కోర్టులో ఇవ్వాళ్టికి ముగిసిన వాదనలు 6.30pm - ఏసీబీ కోర్టులో మళ్లీ విచారణ ప్రారంభం ► చంద్రబాబు హౌజ్ కస్టడీ పిటిషన్ పై మళ్లీ వాదనలు ప్రారంభం ► ఏసిబీ కోర్టులో వాదనలు వినిపిస్తున్న సిఐడీ తరపు న్యాయవాది ► చంద్రబాబుకు జైల్లో పూర్తి భద్రత ఉందని చెప్పిన CID లాయర్ 5.07pm - చంద్రబాబు తరపున వరుస పిటిషన్లపై కోర్టు ఆగ్రహం 5.50pm - వాదనలకు విరామం ప్రకటించిన న్యాయమూర్తి 5.07pm - చంద్రబాబు తరపున వరుస పిటిషన్లపై కోర్టు ఆగ్రహం ► కోర్టులో ఎన్నో అంశాలుంటాయి ► ఒక పిటిషన్ వాదనలు పూర్తి కాకముందే మరో పిటిషనా? ► దేనికయినా ఒక ప్రొసీజర్ ఉంటుంది ► మిగతా కేసులు జాప్యం కావా? ► ఏ పిటిషన్ అయినా మధ్యాహ్నం 12లోపు వేయాలి ► నేరుగా పిటిషన్ వేసి వాదనలు వినాలనడం సరికాదు 5.06pm - బాబుకు మినహాయింపులేమీ వద్దు : పొన్నవోలు ► చంద్రబాబును హౌజ్ అరెస్ట్కు అనుమతిస్తే కేసును ప్రభావితం చేసే ప్రమాదం ► CRPCలో హౌజ్ అరెస్ట్ అనేదే లేదు ► మరో 2 కేసుల్లోనూ చంద్రబాబు నిందితుడిగా ఉన్నారు 5.05pm - చంద్రబాబుకు వెసులుబాటు ఇవ్వాలి : లూథ్రా ► చంద్రబాబుకు జైలులో ప్రమాదం ఉంది ► జైలులో కరుడుగట్టిన నేరగాళ్లు ఉంటారు ► చంద్రబాబుకు జైలులో కల్పించిన భద్రతపై అనుమానం ఉంది 4.50pm - కేసు డాక్యుమెంట్లు కావాలి : లుథ్రా ► స్కిల్ కుంభకోణం కేసుకి సంబంధించి పూర్తి వివరాలు కావాలి ►సిట్ కార్యాలయంలో డాక్యుమెంట్లని పరిశీలించడానికి అనుమతించండి ►సెక్షన్ 207 ప్రకారం అనుమతి ఇవ్వాలి ►పిటిషన్ వేసిన లాయర్ సిద్దార్ద లూథ్రా 4.45pm - చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్పై క్లారిఫికేషన్ కోరిన ఏసీబీ కోర్టు ►సుప్రీంకోర్టులోని కొన్ని కేసులను ఉదహరించిన బాబు తరపు న్యాయవాదులు ►కోట్ చేసిన కేసులకు సంబంధించి వివరాలు అడిగిన న్యాయమూర్తి ►చంద్రబాబు హౌజ్ అరెస్టు పిటిషన్పై ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు ►త్వరలోనే ఆదేశాలు వెలువడే అవకాశం 4.15pmచంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లుథ్రా ►చంద్రబాబు ఇప్పటివరకు ఎన్ఎస్జీ భద్రతలో ఉన్నారు ►చంద్రబాబుకు జైలులో కల్పించిన భద్రతపై అనుమానం ఉంది ►హౌజ్ కస్టడీకి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉంది ►గౌతం నవార్కర్ కేసు పరిశీలించండి ►హైకోర్టుకు వెళ్లి తెచ్చుకున్న భద్రత పెంపు ఆదేశాలు అమల్లో ఉన్నాయి ►చంద్రబాబును హౌస్ కస్టడీకి అనుమతి ఇవ్వాలి 3.30pm : AAG పొన్నవోలు సుధాకర్ రెడ్డి ►రాజమండ్రి సబ్ జైల్ 50 అడుగుల గోడ, అక్కడికి ఎవరు రాలేరు ►రాజమండ్రి జైల్ కంటే మించిన సెక్యూరిటీ ఎక్కడా ఉండదు ►అలాగే డాక్టర్స్ 24 గంటలు అందుబాటులో ఉంటారు ►కాబట్టి చంద్రబాబుకు హౌజ్ అరెస్ట్ అవసరం లేదు ►చంద్రబాబుకు ఇంట్లో కంటే జైల్లోనే భద్రత ఉంటుంది ►చంద్రబాబు ఆరోగ్యం బాగుంది ►చంద్రబాబు భద్రత.. ఆరోగ్యంపై అనుక్షణం ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. 3.20pm : అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ►చంద్రబాబు భద్రతకి ఎటువంటి ఇబ్బంధులు లేవు ►రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు కి గట్టిభద్రత కల్పించాం ►జైలులో చంద్రబాబుకి ప్రత్యేక గదితో పాటు సిసి కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతోంది ►చంద్రబాబు భద్రతపై తీసుకున్న చర్యలపై జైళ్ల శాఖ డిజి ఆదేశాల లేఖని మీ ముందు ఉంచుతున్నా ►జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న నిందితుడి భధ్రతా బాధ్యత ప్రభుత్వానిదే ►చంద్రబాబు కోరిన విధంగా కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకి ఇంటి భోజనం, మందులు అందుతున్నాయి ►చంద్రబాబుకి భద్రత కొనసాగుతోంది ►గృహ నిర్బందం పిటిషన్ డిస్మిస్ చేయాలి ►ఈ పిటిషన్ను కోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ►చంద్రబాబు సాక్ష్యులను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది 3:00pm 3గంటల తర్వాత చంద్రబాబు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ సిద్ధం చేసినట్టు టిడిపి వర్గాల్లో ప్రచారం జరిగింది. ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తారని, 437(1) ప్రకారం మధ్యంతర బెయిల్ పిటిషన్ వేస్తారని, రెండు పిటిషన్లను న్యాయవాదులు ఒకేసారి దాఖలు చేయనున్నట్టు సమాచారం. మరో వైపుచంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ రద్దు అయినట్టు టిడిపి వర్గాల సమాచారం. చంద్రబాబును కుటుంబ సభ్యులు రేపు కలవాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇటు రాజమండ్రిలోనే ఉన్న లోకేష్ బస్సులోనే ముఖ్య నేతలతో సమావేశం జరిపినట్టు సమాచారం. చంద్రబాబు అరెస్టు తర్వాతి పరిణామాలపై చర్చించిన టిడిపి నేతలు.. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో బయటపడ్డ ఆధారాలపై మంతనాలు జరిపారు. కొందరు సీనియర్లు లోకేష్తో కేసు బలంగా ఉందని చెప్పినట్టు సమాచారం. ACB Court Live Updates ►చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ పై కొనసాగుతున్న వాదనలు ►సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్, ఏఏజీ పొన్నవోలు వాదనలు ►చంద్రబాబు హౌజ్ అరెస్టు పిటిషన్ను తిరస్కరించాలన్న సీఐడీ కౌంటర్ పిటిషన్ ►రాజమండ్రి జైలులో పూర్తి భద్రత మధ్య చంద్రబాబు ఉన్నారు ►బాబును హౌజ్ అరెస్టులో ఉంచాల్సిన అవసరం లేదు ►ఆర్థిక నేరాల్లో ఉన్న నిందితుడికి హౌజ్ అరెస్ట్ అనేది అవసరం లేదు ► చంద్రబాబు హౌజ్ అరెస్ట్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసింది ఏపీ సీఐడీ. సీఆర్పీసీలో హౌజ్ అరెస్ట్ అనేదే లేదు. బెయిల్ ఇవ్వలేదు కాబట్టే హౌజ్ రిమాండ్ కోరుతున్నారు. అరెస్ట్ సమయంలో చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు అని సీఐడీ కౌంటర్ కాపీలో పేర్కొంది. ► చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణంలో అరెస్ట్ కోరుతూ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ ( ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్) వేశారు సిట్ తరపు న్యాయవాదులు. ఈ క్రమంలో.. కోర్టుకి 6 వేల పేజీల డాక్యుమెంట్లు సమర్పించినట్లు తెలుస్తోంది. మరో కేసులో చంద్రబాబు అరెస్ట్ కోసం పీటీ వారెంట్? విజయవాడ ఏసీబీ కోర్టులో.. సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్రోడ్ కేసులో కూడా చంద్రబాబు అరెస్ట్ కోసం పీటీ వారెంట్(పీటీ వారెంట్ (ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్) కోరింది. 2022లో నమోదైన కేసులో పీటీ వారెంట్పై బాబును విచారించేందుకు కోర్టు అనుమతి సీఐడీ కోరింది. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ, ఏ6గా నారా లోకేష్ ఉన్నారు. చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఉందని పిటిషన్లో పేర్కొంది సీఐడీ. ► చంద్రబాబు కస్టడీ కోరుతూ ఏపీ సీఐడీ వేసిన పిటిషన్పై మధ్యాహ్నం 2.30కి వాదనలు జరగనున్నాయి. ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు.. చంద్రబాబు తరపున లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. అదే సమయంలో.. భద్రతా కారణాల రీత్యా చంద్రబాబు రిమాండ్ను.. హౌజ్ అరెస్ట్గా పరిగణించాలంటూ దాఖలు చేసిన పిటిషన్పైనా ఏసీబీ న్యాయమూర్తి వాదనలు వినే అవకాశం ఉంది. ► చంద్రబాబు హౌజ్ అరెస్ట్ పిటిషన్పై మధ్యాహ్నాం తర్వాత విచారణ జరగనుంది. ► చంద్రబాబు హౌజ్ అరెస్టుకు అవకాశం ఇవ్వాలని ఆయన తరపున న్యాయవాదులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే ఏఏజీ అందుబాటులో లేరని.. సమయం ఇవ్వాలని సిట్ స్పెషల్ జీపి న్యాయమూర్తిని కోరారు. దీంతో.. హౌజ్ కస్టడీ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని జడ్జి ఆదేశిస్తూ.. విచారణ మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఈ పిటిషన్పై విచారణ అనంతరమే ఆదేశాలేవైనా ఇస్తామని న్యాయమూర్తి చంద్రబాబు లాయర్లకు స్పష్టం చేశారు. ► ఏఏజీ స్పందన స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు నుంచి సీఐడీ ఇంకా వివరాలు సేకరించాల్సి ఉందని సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి చెబుతున్నారు. చంద్రబాబు తరపున ఇంకా బెయిల్ పిటిషన్ దాఖలు కాలేదు. ఏసీబీ కోర్టు తీర్పు కాపీ ఇవాళ అందుతుంది. చంద్రబాబుని ఐదురోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశాం. చంద్రబాబు భద్రతా పరంగా చూసుకుంటే.. రాజమండ్రి సెంట్రల్ జైలు కంటే మంచి చోటు ఉండదు అని ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి.. హౌజ్ అరెస్ట్ పిటిషన్ పరిణామంపై స్పందించారు. ఎఫ్ఐఆర్ లో పేరులేకపోయినా దర్యాప్తు తర్వాత పేర్లు చేర్చొచ్చు. FIR అనేది దర్యాప్తునకు మొట్టమొదటి అడుగు. దర్యాప్తులో ఎవరి ప్రమేయం బయటపడినా , వాళ్ల పేర్లు చేర్చొచ్చు. FIR లో లేదు కాబట్టి ముద్దాయి కాదంటే , న్యాయసూత్రాలకు విరుద్ధం - ఈ కేసు ఏపీ ప్రభుత్వం పెట్టింది కాదు అని ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి తెలిపారు. ► చంద్రబాబును జైల్లో ఉంచడం ప్రమాదకరం - హౌస్ అరెస్ట్ పిటిషన్ పై మా వాదనలు వినిపిస్తాం - గతంలో వెస్ట్ బెంగాల్ మంత్రుల విషయంలో సుప్రీం కోర్టు తీర్పును ప్రస్తావిస్తాం - బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నాం : అడ్వకేట్ కౌన్సిల్ సిద్ధార్ద్ లూద్రా ► విజయవాడ కోర్టులో మరోసారి హౌజ్ అరెస్ట్ పిటిషన్ వేయనున్న లూథ్రా!. ఎన్ఎస్జీ సెక్యూరిటీ వీవీఐపీగా ఉన్న చంద్రబాబు నాయుడను హౌజ్ అరెస్ట్ చేయాలని, భద్రతా కారణాల వల్ల ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కోర్టును కోరే ఛాన్స్ కనిపిస్తోంది. ► ఏసీబీ కోర్టు తీర్పు కాపీ కోసం చంద్రబాబు లాయర్ల ఎదురుచూపులు. తీర్పులోని అంశాల ఆధారంగానే.. బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టులో దాఖలు చేయాలా? హైకోర్టులో వేయాలా? అనే దానిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్. ఏసీబీ కోర్టుకు వచ్చిన చంద్రబాబు తరపు లాయర్లు విజయవాడ కోర్టుకు వచ్చిన సిద్ధార్థ్ లూథ్రా , ఇతర లాయర్లు. సీఐడీ కస్టడీ పిటిషన్ పై చంద్రబాబు తరపున తన వాదనలు వినిపించనున్న లూథ్రా. అలాగే బెయిల్ పిటిషన్ ఎక్కడ వేయాలన్నదానిపైనా లీగల్ టీంతో చర్చలు. సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి.. విజయవాడ ఏసీబీ కోర్టు ముందుకు పిటిషన్లు విచారణకు రానున్నాయి. స్కిల్ స్కాంలో ప్రధాన ముద్దాయి అయిన చంద్రబాబును తమ కస్టడీకి ఇవ్వాలని, తద్వారా మరిన్ని వివరాలు రాబట్టగలిగే అవకాశం కల్పించాలని ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టును కోరనుంది. స్కిల్ స్కామ్ కేసుపై ఇవాళ మొత్తం మూడు పిటిషన్లు విచారణకు రానున్నాయి. ముందుగా విచారణకు రానుంది చంద్రబాబు కస్టడీ పిటిషన్. ఐదురోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరనున్నాయి. అలాగే.. ఏ 1 ముద్దాయి చంద్రబాబుని లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని సిట్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు విచారణలో చంద్రబాబు తమకు సహకరించలేదని కోర్టుకు విన్నవించారు అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. దీనికి కౌంటర్గా చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇక.. కస్టడీ పిటీషన్ పై విచారణ తర్వాత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. మరోవైపు హైకోర్టుని ఆశ్రయించే ఆలోచనలో చంద్రబాబు తరపు న్యాయవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. రిమాండ్ రిపోర్ట్ ని రిజెక్ట్ చేయాలని హై కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. కానీ, జైలుకు తరలించడం తో హౌస్ అరెస్ట్ పిటిషన్ విచారణకు తీసుకోరని సీనియర్ న్యాయవాదులు చెబుతున్నారు. దీంతో ఏసీబీ కోర్టులోనే బెయిల్ పిటిషన్ను దాఖలు చేయొచ్చని తెలుస్తోంది. -
భర్త ఇంటి ముందు రెండో భార్య దీక్ష
చేజర్ల (సోమశిల): భర్త ఇంటి ముందు అతని రెండో భార్య దీక్షకు దిగిన ఘటన అనంతసాగరం మండలం రేవూరులో ఆదివారం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. రేవూరుకు చెందిన పోలయ్య అనంతసాగరం విద్యాశాఖ కార్యాలయంలో సీఆర్పీగా విధులు నిర్వహిస్తున్నారు. పోలయ్యకు ఇది వరకే పెళ్లి అయింది. మనస్పర్థలు కారణంగా భార్యాభర్తలు విడిపోయారు. దీంతో మస్తాన్బీ అనే మహిళ అతనికి దగ్గర కావడంతో 12 ఏళ్ల నుంచి సహ జీవనం చేస్తున్నట్లు తెలిపారు. పోలయ్య మరో పెళ్లి చేసుకుని మస్తాన్బీని వదిలించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుసుకుని ఆమె ఈ విషయమై రెండు నెలల క్రితం జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. శనివారం రాత్రి భర్త పోలయ్య, అతని మూడో భార్య, బంధువుల మస్తాన్బీపై దాడి చేశారు. తీవ్ర గాయాలైన అక్కడే కూర్చుని దీక్ష కొనసాగిస్తోంది. తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతోంది. -
ప్చ్.. బాబు 23 సెంటిమెంట్
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ/రాజమహేంద్రవరం: చంద్రబాబును సీఐడీ అధికారులు ఆదివారం అర్ధరాత్రి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. జైలు అధికారులు ఆయనకు రిమాండ్ ఖైదీ నంబర్ 7691 కేటాయించారు. షెల్ కంపెనీల ముసుగులో నిధులు కొల్లగొట్టడంలో ప్రధాన భూమిక పోషించిన ఆయనపై సిట్ మోపిన అభియోగాలతో విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం ఏకీభవించింది. చంద్రబాబుకు న్యాయస్థానం 14 రోజులపాటు అంటే ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. దాంతో చంద్రబాబును జ్యుడిషియల్ రిమాండ్ కోసం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. న్యాయస్థానంలో అధికారిక లాంఛనాలు పూర్తి చేశాక సిట్ అధికారులు జైళ్ల ఎస్కార్ట్తో ప్రత్యేక కాన్వాయ్లో విజయవాడ నుంచి తరలించారు. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వం కల్పించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో కూడిన కాన్వాయ్తోపాటు ప్రత్యేక బస్లో భద్రతా సిబ్బందితోపాటు ఎన్ఎస్జీ భద్రతా సిబ్బంది కూడా అనుసరించారు. విజయవాడ నుంచి ఆదివారం రాత్రి 10 గంటలకు చంద్రబాబు కాన్వాయ్ బయలుదేరింది. మార్గం మధ్యలో కాన్వాయ్లోని ఓ వాహనం (చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనం కాదు) బ్రేక్ డౌన్ అయ్యింది. దాంతో ఆ వాహనాన్ని పక్కన పెట్టేశారు. విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ సమస్య లేకుండా ముందుగానే పోలీసులు రోడ్డు క్లియరెన్స్ చేశారు. చంద్రబాబును తరలిస్తున్న కాన్వాయ్ అర్ధరాత్రి ఒంటి గంట అనంతరం సురక్షితంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చేరుకుంది. అనంతరం రిమాండ్ ఖైదీ చంద్రబాబును జైలు అధికారులకు అప్పగించారు. జ్యుడిషియల్ రిమాండ్కు సంబంధించిన అధికారిక లాంచనాలు పూర్తి చేసి, ఆయనకు రిమాండ్ ఖైదీ నంబర్ 7691 కేటాయించారు. ఆ తర్వాత జైలులో స్నేహ బ్లాక్లోని ప్రత్యేక గదికి తరలించారు. కోర్టు ఆదేశాలతో ఆయనకు ప్రత్యేకంగా ఆహారం, అవసరమైన మందులు, ఇతర వసతులు కల్పించనున్నారు. రిమాండ్ ఖైదీగా చంద్రబాబును సెంట్రల్ జైలుకు తరలించడంతో ఎన్ఎస్జీ భద్రతా సిబ్బంది తాత్కాలికంగా ఆయన భద్రతా విధుల నుంచి వైదొలిగారు. చంద్రబాబు వెంట తనయుడు నారా లోకేష్, టీడీపీ నాయకులు జైలు వద్దకు చేరుకున్నారు. అధికారుల నుంచి అనుమతులు రాగానే జైలు లోపలికి వెళ్లిన లోకేష్ తిరిగి కొద్ది సేపటికే బయటకు వచ్చేశారు. జైలు అధికారుల సమావేశం చంద్రబాబుకు రిమాండ్ విధించిన నేపథ్యంలో రాజమహేంద్రవరం జైలు అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించారు. బాబుకు గది కేటాయింపు మొదలు వివిధ అంశాలపై చర్చించారు. మాజీ ముఖ్యమంత్రి కావడంతో ఖైదీలకు ఇచ్చే డ్రస్ ఉండదని, మామూలుగా ఆయన ధరించే దుస్తులకు అనుమతిస్తామని చెప్పారు. కాగా, రాజమండ్రిలో భద్రతా ఏర్పాట్లను పోలీసు ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. ఖైదీ నంబర్.. సోషల్ మీడియాలో వైరల్ రిమాండ్ ఖైదీగా చంద్రబాబుకు 7691 నంబరు కేటాయించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 7 + 6 + 9 + 1 = 23 కావడమే అందుకు కారణం. 2019 ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లే వచ్చాయి. చంద్రబాబు అరెస్ట్ అయిన తేదీ 9–9–23. ఆ అంకెలు కలిపితే మొత్తం 23 అవుతోంది. దాంతో ఈ అంశంపై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. -
Babu @ Jail : న్యాయం గెలిచింది!
45 ఏళ్ళ రాజకీయ జీవితంతో కోర్టు బోన్ ఎక్కకుండా... ఎన్నో నేరాలు, ఘోరాలు చేసినా తప్పించుకున్న చంద్రబాబు, ఇప్పుడు మొట్టమొదటి సారిగా కటకటాల పాలవుతున్నాడు! తాను తప్పించుకునేందుకు మొత్తం భూమ్యాకాశాల్నీ ఏకం చేసినా... తప్పించుకోలేని తప్పులు చేసి మొట్టమొదటి సారిగా బోన్ ఎక్కాడు, జైల్లోకి వెళుతున్నాడు! తప్పు చేయనివాడిని నీతిమంతుడు అంటారు గానీ... తప్పులు చేయటమే పనిగా పెట్టుకుని, దొరక్కుండా మేనేజ్ చేసుకుంటూ తప్పించుకు తిరుగుతున్నవాడిని నీతిమంతుడంటారా? చివరికి తన సుప్రీం కోర్టు లాయర్ లూధ్రా, తన 15 మంది లాయర్ల వాదనలే కాకుండా... తానే లాయర్గా మారి వాదించినా చంద్రబాబుకు రిమాండ్ తప్పలేదు! చంద్రబాబు నాయుడు చేసిన వాదనలు చూస్తే... ఎక్కడా, తాను అవినీతి చేయలేదని చెప్పలేదు! బయట ప్రెస్మీట్ పెట్టిన అచ్చెన్నాయుడు కూడా, తమ చంద్రబాబు నీతిమంతుడని ఎక్కడా చెప్పలేదు! చివరికి ఎల్లో మీడియా కూడా! బాబు చేసినవన్నీ టెక్నికల్గా వాదనలే తప్ప... * తనను 24 గంటల్లోపు కోర్టులో ప్రవేశపెట్టలేదని * గవర్నర్కు చెప్పలేదని * 48 గంటలు అయిపోయింది... వదిలేయాలని * రిమాండ్ రిపోర్టులో చంద్రబాబు పేరు మొదట్లో లేదని * నంద్యాల కోర్టులోనే చంద్రబాబును ప్రవేశపెట్టి ఉండాలని * పీసీ యాక్ట్ ప్రకారం వారం ముందు నోటీస్లు ఇవ్వాలని... ఇలాంటి వాదనలు చేశారు తప్ప.... చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఈ కుంభకోణంలో ఆయన పాత్ర లేదని ఎక్కడా వాదించకపోవటం గమనించాల్సిన విషయం! అంటే... నేను అవినీతి పరుడిని కాదు... ఎలాంటి విచారణకైనా సిద్ధం లాంటి పదాలు చంద్రబాబు నోట రావటం లేదు! అంతే కాకుండా, ఎలాంటి జ్యుడీషియల్ స్రూటినీకి అయినా నిలబడతాను అని; అవినీతి జరగనే లేదని చంద్రబాబుగానీ, ఆయన లాయర్లుగానీ వాదించకపోవటం... రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం! స్కిల్ స్కాం అనేదే లేదని చంద్రబాబు, టీడీపీ, ఎల్లో మీడియాల్లో ఏ ఒక్కటీ చెప్పటం లేదు! వారి వాదనంతా... మా బాబుకు సంబంధం ఏమిటి అన్నది మాత్రమే! దీని అర్థం... బాబు, తప్పించుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేశాడన్నది, ఈ సారి తప్పించుకోవటం కుదరలేదన్నది! మా చంద్రబాబును జైల్లో పెడతారా అని ఆవేశపడి అరిచే వాళ్ళలో ఏ ఒక్కరూ... మా చంద్రబాబు ఎలాంటి విచారణకైనా సిద్ధం... ఎలాంటి దర్యాప్తు అయినా ఎదుర్కొంటాడు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుతో సహా, అని అనకపోవటాన్ని గమనించాలి! ఎందుకంటే చంద్రబాబు... వీరప్పన్ మాదిరిగా దొరకని దొంగే తప్ప, దొంగ కాదు అనటానికి ఎలాంటి ఆధారాలూ లేవు! అవినీతి, చట్ట విరుద్ధ కార్యక్రమాలు... అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యవస్థల మేనేజ్మెంట్, ఇందుకు ఒక వర్గం ఎల్లో మీడియా మద్దతు... ఇవన్నీ ఈ రాష్ట్రంలో నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబు రాజకీయాలు తెలిసిన వారందరికీ తెలుసు! * చివరికి ఎన్టీఆర్ను ఆయన సీఎం పదవి లాక్కున్నా... * తెలంగాణలో ఓటుకు కోట్లిస్తూ దొరికినా... ప్రతి సందర్భంలో బాబు దొంగతనాల్ని ఎల్లో మీడియా, టీడీపీతో పాటు... పవన్ కళ్యాణ్, సీపీఐ నారాయణ, రామకృష్ణ లాంటి వారు నిరంతరం సమర్థిస్తూ వచ్చారు! సుజనా, సీఎం రమేశ్ లాంటి వారిని బాబు, తన అవినీతి మేనేజ్మెంట్కే వేరే పార్టీలకు పంపాడు! ఇప్పుడు పురంధేశ్వరి కూడా అదే జాబితాలో చేరిపోయి బాబు కోసం లాబీయింగ్ చేసే బృందంలో చేరిపోయి; చివరికి కేంద్ర ప్రభుత్వ ఐటీ షోకాజ్ నోటీస్లకు కూడా విలువ లేదని చెపుతూ చంద్రబాబుకు ఎంతటి విలువ ఇచ్చారో చూస్తున్నాం! ఇక పవన్ కళ్యాణ్ అయితే చంద్రబాబు కోసం నడి రోడ్డుమీద నడక నుంచి పడక వరకు ఎందుకైనా రెడీ అయిపోయాడు! ప్యాకేజీ స్టార్కు బాబే చట్టం, బాబే రాజ్యాంగం, బాబే పీసీ యాక్ట్, బాబే ఐపీసీ, బాబే సీఆర్పీసీ! ఇదీ పరిస్థితి! ఇక తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా కంబైన్డ్గా సృష్టించి, నారు–నీరు పోస్తున్న రకరకాల బృందాలు, JACలు, విశ్లేషకులు... వీరంతా స్లీపర్ సెల్స్గా చంద్రబాబు నడుపుతున్న ఒక ముఠాకు సపోర్టింగ్ వ్యవస్థ. చదవండి: చంద్రబాబుకు జైలే -
Babu @ Jail : బెయిల్ కాదు చంద్రబాబుకు జైలే
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. స్కిల్ డెవలప్ మెంట్ పేరిట చంద్రబాబు భారీ కుంభకోణానికి పాల్పడ్డారన్న కేసుకు సంబంధించి ఈరోజు(ఆదివారం) ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. సుదీర్ఘంగా ఏడున్నర గంటలపాటు ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు.. సాయంత్రం గం.6.50ని.ల సమయంలో రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ నెల 22వరకూ రిమాండ్ విధించింది కోర్టు. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది. చంద్రబాబు అరెస్ట్ రిమాండ్ రిపోర్ట్ను CID ఉదయమే కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో 2021లో ఎఫ్ఐఆర్ నమోదు అయిందని, విచారించేందుకు చంద్రబాబును 15 రోజుల కస్టడీ ఇవ్వాలని సిఐడీ కోరింది. ఈ కేసుకు సంబంధించి సీఐడీ 34 అభియోగాలను చంద్రబాబుపై నమోదు చేసింది. రిమాండ్ రిపోర్ట్లో అన్ని ఆంశాలను పకడ్భందీగా చేర్చిన సీఐడీ... రూ. 271 కోట్ల స్కిల్ స్కామ్ సూత్రధారి బాబేనంటూ సీఐడీ అన్ని ఆధారాలతో బలంగా వాదించింది. ఈ కుంభకోణంలో వివిధ పాత్రల్లో బాబు పాత్ర ఉందని సీఐడీ తరుపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. ఏఏజీ పొన్నవోలు వాదనతో ఏకీభవించిన కోర్టు.. చంద్రబాబుకు 14 రోజులు పాటు రిమాండ్ విధించింది. స్కిల్ స్కాం రాజకీయ ప్రేరేపితమని, చంద్రబాబును కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, హక్కులను భంగం కలిగేలా సీఐడీ వ్యవహరించిందని, ఈ కేసులో చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని బాబు తరపు లాయర్ సిద్ధార్థ లుథ్రా వాదనలు వినిపించినా వాటితో కోర్టు ఏకీభవించలేదు. (చదవండి: న్యాయం గెలిచింది! ) కోర్టు వద్దు హై అలర్ట్ విజయవాడలోని ఏసిబి కోర్టు దగ్గర ముందు జాగ్రత్తగా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. బందోబస్తు నేపథ్యంలో ఏసీబీ కోర్టుకు వచ్చిన సిపి క్రాంతిరాణా అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రిమాండ్ విధిస్తే బెయిల్ పిటిషన్ తీసుకోండి ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫు లాయర్ లూథ్రా మరో విజ్ఞప్తి చేశారు. ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధిస్తే బెయిల్ అప్లికేషన్ ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. దీనిపై న్యాయస్థానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నంద్యాలలో కోర్టు ఉండగా చంద్రబాబును విజయవాడ ఎందుకు తీసుకువచ్చారని కొత్త వాదన లేవనెత్తారు. ఆ ఒక్కటి తప్ప..! చంద్రబాబు కానీ, ఆయన లాయర్లు కానీ వినిపించిన మొత్తం వాదనలు పరిశీలిస్తే.. ఎక్కడా నేరం జరగలేదని కానీ, లేదా చంద్రబాబు నిర్దోషి అని గానీ చెప్పలేదు. కేవలం సాంకేతిక కారణాలను చూపిస్తూ రిమాండ్ వద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. CID సమర్పించిన ఏ సాక్ష్యంతోనూ లాయర్లు విభేదించలేదు. మరో మారు సిద్ధార్థ లుథ్రా వాదనలు ► స్కిల్ స్కాం రాజకీయ ప్రేరేపితం ►చంద్రబాబును కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు ►హక్కులను భంగం కలిగేలా CID వ్యవహరించింది ►శుక్రవారం ఉదయం 10 నుంచి CID పోలీసుల ఫోన్ సంభాషణలను కోర్టుకు సమర్పించాలి 409 సెక్షన్ పై ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనలు లుథ్రా లేవనెత్తిన ప్రశ్నలకు సీఐడీ తరపున AAG వాదనలు వినిపించారు. ► చంద్రబాబుపై సీఐడీ 34 అభియోగాలు నమోదు చేసింది ► రిమాండ్ రిపోర్ట్ లో అన్ని అంశాలు చేర్చాం ► స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంతోపాటు వివిధ అక్రమాల్లో బాబు పాత్ర ఉంది బాబు తప్పు చేయలేదని ఎందుకు చెప్పలేకపోతున్నారు? : ఏఏజీ ►చంద్రబాబు తప్పు చేయడం లేదని ఆయన తరఫు లాయర్లు చెప్పడం లేదు ►అవినీతి చేయలేదని ఒక్క మాట కూడా చెప్పలేకపోతున్నారు ►ఎంతసేపూ సాంకేతిక అంశాల గురించి మాట్లాడుతున్నారు ►గవర్నర్ అనుమతి కోరాలని కొత్తగా అడుగుతున్నారు ►రిమాండు రిపోర్టులో భాష గురించి మాట్లాడుతున్నారు ►అంతేకాని ఇచ్చిన ఆధారాలు తప్పని కాని, అవినీతి జరగలేదని కానీ చెప్పడం లేదు బాబు లాయర్ల వాదనలకు ఇవీ సమాధానాలు : ఏఏజీ ►అరెస్టు చేయడానికి గవర్నర్ అనుమతి అవసరం లేదు, స్పీకర్కు సమాచారం ఇస్తే సరిపోతుంది, ఈ నియమాలు మేం పాటించాం ►గవర్నర్కు అరెస్టయిన మూడునెలలోపు ఎప్పుడైనా సమాచారం ఇవ్వొచ్చు ►మాజీ ముఖ్యమంత్రి అనేది గౌరవ ప్రదమైన హోదా మాత్రమే, ఆయన వాస్తవ హోదా ఎమ్మెల్యే మాత్రమే ►మామూలు కేసుల్లో వారం అవసరం తప్ప.. ప్రజాధనం దుర్వినియోగం, అవినీతికి సంబంధించిన కేసుల్లో నోటీసు అవసరంలేదు ►తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే అరెస్టు చేయొచ్చు ►ముఖ్యమంత్రి హోదాలో నిధుల విడుదలకు చంద్రబాబు ఆదేశించారు, దీనికి సంబంధించిన ఆధారాలున్నాయి ►రాజ్యాంగ ప్రకారం వచ్చిన పదవిని దుర్వినియోగం చేస్తూ అవినీతికి పాల్పడ్డారు ►సెక్షన్ 409 చంద్రబాబుకు సంపూర్ణంగా వర్తిస్తుంది ► చంద్రబాబుకు రిమాండ్ విధించండి -
బాబు చేసింది పెద్ద నేరమే!
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై సీఐడీ బలమైన ఆధారాలతో అంతకంటే బలమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ముఖ్యంగా చట్టం పట్ల విధేయత చూపుతానని ప్రమాణం చేసిన ప్రజా సేవకుడు దురుద్దేశంతో ఆ చట్టాలను ఉల్లంఘించడం, తప్పుడు లేదా నకిలీ సంస్థలను సృష్టించి ప్రజా ధనాన్ని సొంతం చేసుకునేందుకు ఫోర్జరీ పత్రాలను నిజమైనవిగా వినియోగించడాన్ని తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఈ నేరాలకు పాల్పడినట్లు సీఐడీ భావిస్తోంది. మొత్తం 11 ఐపీసీ సెక్షన్లు, రెండు అవినీతి నిరోధక సెక్షన్ల కింద అరెస్టు చేసింది. తీవ్రమైన నేరాలు చేయడంతో పాటు నేరాలను ప్రోత్సహించిన చంద్రబాబుకు ఈ చట్టాల కింద 7 నుంచి 25 ఏళ్ల కారాగార శిక్ష, భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. బాబుపై నమోదైన కేసులో సెక్షన్లు ఏం చెబుతున్నాయంటే.. ఐపీసీ సెక్షన్లు 120–బి: నేరపూరిత కుట్ర 166: ప్రభుత్వ సేవకుడు ఎవరికైనా హాని కలిగించే ఉద్దేశంతో చట్టాన్ని ఉల్లంఘించడం, చట్టం పట్ల విధేయత చూపుతానని ప్రమాణం చేసిన వారు దురుద్దేశంతో చట్టాన్ని ఉల్లంఘించి నేరానికి పాల్పడటం 167: పబ్లిక్ సర్వెంట్ ఉద్దేశపూర్వకంగా లేని/తప్పుడు సంస్థలను, పత్రాలను సృష్టించి మోసం చేయడం 418: ఎవరికైనా నష్టం వాటిల్లుతుందని తెలిసీ ఉద్దేశ పూర్వకంగానే మోసం చేయడం 420: మోసం చేయడం 465: ఫోర్జరీ చేయడం 468: మోసం చేయాలనే ఉద్దేశంతో ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించడం 471: ఫోర్జరీ పత్రాలను అసలైన పత్రాలుగా ఉపయోగించడం 409: నేరపూరిత విశ్వాస ఘాతుకం 201: నేరానికి సంబంధించిన సాక్ష్యాలను మాయం చేయడం, లేదా నేరస్థుడు దొరక్కుండా తప్పుడు సమాచారం ఇవ్వడం 109: నేరాన్ని ప్రేరేపించడం, ఆ నేరం లేదా కుట్రలో భాగస్వామిగా ఉండటం పీసీ (ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్) యాక్ట్ 12(బి)(1): అవినీతికి పాల్పడటం 13(1)(సి)(డి): పబ్లిక్ సర్వెంట్గా ఉండి అవినీతికి పాల్పడడం