తొలి టెస్టు మ్యాచ్లో వెస్టిండీస్ రెండు ఇన్నింగ్స్లు కలిపి ఆడింది 98.5 ఓవర్లే. ఈ లెక్కన హైదరాబాద్ టెస్టులో మళ్లీ మొదటి రోజే భారత్కు పట్టు చిక్కి మ్యాచ్ మూడో రోజే ముగించే అవకాశం ఉంటుందని అంతా భావించారు. కానీ వెస్టిండీస్ రాత మార్చుకుంది. రెండో టెస్టులో ఇప్పటికే 95 ఓవర్లు ఆడిన ఆ జట్టు 300 పరుగులకు చేరువైంది. మరో 3 వికెట్లు చేతిలో ఉన్నాయి. రోస్టన్ ఛేజ్ శతకానికి దగ్గరలో నిలవగా... కీలక అర్ధసెంచరీతో కెప్టెన్ హోల్డర్ తన విలువ చాటాడు. మొదటి రోజును విండీస్ సంతృప్తిగా ముగించగా... ప్రత్యర్థిని ఆలౌట్ చేయలేక టీమిండియా నిరాశకు గురైంది.
విండీస్ నిలబడింది
Oct 13 2018 7:39 AM | Updated on Mar 20 2024 3:46 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement