స్పీడందుకున్న ఎస్కలేటర్‌.. 20 మందికి గాయాలు

నిర్దేశిత వేగం కంటే ఎక్కువ స్పీడ్‌తో ప్రయాణించిన ఓ ఎస్కలేటర్‌ 20మందిని గాయలపాలు చేసింది. ఈ ఘటన ఇటలీలోని రిపబ్లికన్‌ మెట్రో స్టేషన్‌లో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ స్టేడియంలో జరిగే ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూసేందుకు వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నిర్దేశిత వేగంతో కదులుతున్న ఎస్కలేటర్ ఆకస్మాత్తుగా ఒవర్‌ స్పీడ్‌ అందుకుంది. దాంతో దానిపై ఉన్న ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడ్డారు. ఫలితంగా ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయని తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top