సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయంపై ప్రజలు సంతోషంగా ఉన్నారు | Sakshi
Sakshi News home page

సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయంపై ప్రజలు సంతోషంగా ఉన్నారు

Published Wed, Dec 18 2019 3:23 PM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన బినామీలు అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు కొన్నారని, అందుకే అమరావతి రాజధాని అంటున్నారని అనకాపల్లి వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే  గుడివాడ  అమర్‌నాథ్‌ విమర్శించారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయంపై ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. బుధవారం వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్‌ నిర్ణయాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు స్వాగతిస్తున్నారని, ఆయన ప్రకటనతో రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొందన్నారు.

Advertisement
Advertisement