234వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర | Day 234 of Praja Sankalpa Yatra begins | Sakshi
Sakshi News home page

234వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

Aug 11 2018 9:39 AM | Updated on Mar 21 2024 7:52 PM

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 234వ రోజు శనివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడిలో మండలంలోని డీజేపురం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి తుని మండలంలోని కొత్త వేలంపేట, సీతయ్యపేట, లోవకొత్తూరు, తల్లూరు జంక్షన్‌, జగన్నాథగిరి మీదుగా తుని వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. సాయంత్రం తునిలో జరిగే భారీ బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. కాగా, వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దారిపొడవునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సాగిస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement