సోన్‌భద్ర ఘటన కుటుంబసభ్యులను పరామర్శించిన ప్రియాంక

ఉత్తరప్రదేశ్‌ సోన్‌భద్ర జిల్లాలో జరిగిన కాల్పుల్లో మరణించిన వారి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీని మధ్యలోనే అడ్డుకొని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రియాంకను అరెస్ట్‌ చేయడం వివాదాస్పదంగా మారింది. బాధితులను కలిసేంతవరకూ తాను వెనుతిరిగేది లేదని ప్రియాంక స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బాధితులు ప్రియాంక ధర్నాకు దిగిన చునార్‌ అతిథి గృహం వద్దకు తరలి వచ్చారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top