వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం తిరుపతిలో నిర్వహించిన వైఎస్ఆర్ జనభేరికి భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు జనం పెద్ద ఎత్తున తరలివచ్చి జగన్కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తున్న పార్టీ వైఎస్ఆర్ సీపీ ఒక్కటేనని, వారి దగ్గరకు వెళ్లి ఓట్లు అడిగే హక్కు తమకే ఉందని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చివరి దాకా పోరాడమని చెప్పారు.