గుంటూరులో దోపిడి దొంగలు అర్థరాత్రి బీభత్సం సృష్టించారు. అమరావతి సెంటర్లో దాదాపు 14 షాపుల్లో దొంగలు తాళాలు పగలకొట్టి నగదుతో పాటు సామాగ్రి దోచుకున్నారు. దీంతో బాధితులు బుధవారం ఉదయం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సంఘటన జరిగిన షాపులను సందర్శించి కేసు నమోదు చేశారు. అలాగే నగరంలోని బృందావన్ గార్డెన్స్లో ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆ క్రమంలో అడ్డు వచ్చిన మహిళను దొంగలు హత్య చేశారు. ఈ దాడిలో మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ఇంట్లో రూ.3 లక్షల నగదును అపహరించుకుని పోయారు. దాంతో బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆధారాలను సేకరిస్తున్నారు. కాగా గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే మరణించిన మహిళ మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Jul 17 2013 3:09 PM | Updated on Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement