తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకుంటున్నారని.. ఈ నెల 26 లేదా 27 తేదీల్లో ఆస్పత్రి నుంచి ఆమె డిశ్చార్జ్ అయ్యే అవకాశముందని అన్నాడీఎంకే వెల్లడించింది. లండన్కు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ సమక్షంలో అపోలో ఆస్పత్రి వైద్యులు, ఎయిమ్స్, సింగపూర్ వెద్య నిఫుణులు జయలలిత ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా అధ్యయనం చేసి దీనిపై నిర్ణయం తీసుకోనున్నారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి గురువారం ప్రకటించారు. కాగా, అపోలో ఆస్పత్రి మాత్రం దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Oct 21 2016 6:45 AM | Updated on Mar 21 2024 8:56 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement