సోషల్ మీడియా వేదికపై ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న నెటిజన్లపై చంద్రబాబు సర్కారు కన్నెర్ర జేస్తోంది. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు చేసిన వారిని వెంటాడి వేధిస్తోంది. తాజాగా మరో సోషల్ మీడియా కార్యకర్త ఇప్పాల రవీందర్పై సర్కారు ఇదేతరహాలో బెదిరింపుల పర్వానికి తెరలేపింది. టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డిపై అనుమతి పోస్టు పెట్టారని ఆరోపిస్తూ ఆయనపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ జెడ్పీటీసీ సావిత్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు పెట్టారు. ఈ క్రమంలో విశాఖ జైలులో ఉన్న రవీందర్ను పీటీవారెంట్పై పోలీసులు తాడిపత్రికి తరలించారు. మరికాసేపట్లో తాడిపత్రి కోర్టు ముందు ఆయనను ప్రవేశపెట్టే అవకాశముందని తెలుస్తోంది.
May 27 2017 10:16 AM | Updated on Mar 20 2024 3:50 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement