సచివాలయ ఉద్యోగుల సమ్మె తాత్కాలిక విరమణ | Secretariat Seemandhra employees 'temporarily' call off strike | Sakshi
Sakshi News home page

Oct 11 2013 2:10 PM | Updated on Mar 22 2024 11:32 AM

సమైక్యాంధ్ర కోరుతూ ఉద్యమ బాట పట్టిన సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మె విరమించారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డితో శుక్రవారం సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దాంతో సీమాంధ్ర ఉద్యోగులు తమ సమ్మె విరమించారు. గత 38 రోజులుగా వీరు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఒకవేళ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకుంటే మళ్లీ ఉద్యమిస్తామని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తెలిపారు. చర్చలు సఫలం కావటంతో సీమాంధ్ర ఉద్యోగులు విధులుకు హాజరు అవుతున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement