రిషితేశ్వరి ఆత్మహత్య కేసుపై గవర్నర్ ఆరా | rishiteshwari suicide case, governor asks ganta srinivasa rao | Sakshi
Sakshi News home page

Aug 4 2015 6:33 PM | Updated on Mar 22 2024 11:04 AM

నాగార్జున యూనివర్శిటీలో ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థిని రిషితేశ్వరి కేసు పురోగతిపై గవర్నర్ నరసింహన్ ఆరా తీశారు. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం గవర్నర్ కలిసిన నేపథ్యంలో యూనివర్శిటీకి సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య తరువాత ఇప్పటి వరకూ జరిగిన విచారణ ఎలా సాగిందని గవర్నర్ వివరణ కోరారు. ఆ విద్యార్థినిపై ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్ సూచించారు. దీంతో పాటు యూనివర్శిటీలో ర్యాగింగ్ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గంటాను ఆదేశించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement