తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నిప్పులు చెరిగారు. పన్నీర్ సెల్వం ఒక ద్రోహి, మోసగాడు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. నమ్మి అవకాశం ఇస్తే అమ్మ(జయలలిత) ఏ పార్టీపై పోరాడిందో ఆ పార్టీతో చేతులు కలిపి పార్టీని చీల్చే కుట్రలు చేశారని ఆరోపించారు. ప్రస్తుత రాజకీయ సంక్షోభం వెనుక డీఎంకే పార్టీ హస్తం ఉందంటూ ధ్వజమెత్తారు. అన్నాడీఎంకే ఓ కంచుకోట అని.. దాన్నెవరూ కదపలేరని ఆమె స్పష్టం చేశారు.