తెలంగాణలో అట్టహాసంగా పవిత్రగోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం 6.21గంటలకు ప్రముఖ ఆద్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి భద్రచాలంలో ప్రారంభించారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన తొలిపుష్కరాల కావడంతో భక్తుల భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. దేవ గురువు బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించే సమయాన గోదావరిలో పుణ్యస్నానాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా ధర్మపురిలో గోదావరి మాతకు నూతన పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం పుష్కర స్నానమాచరించారు. బాసర నుంచి భద్రాచలం వరకు పలు ఘాట్లు పుష్కర శోభను సంతరించుకొని అలరారుతున్నాయి.
Jul 14 2015 7:20 AM | Updated on Mar 21 2024 8:30 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement