
నిబంధనల ప్రకారమే ఫీజులు వసూలు చేయాలి
భువనగిరి : ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఫీజులు వసూలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు స్పష్టం చేశారు. బుధవారం డీఈఓ సత్యనారాయణతో కలిసి జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, ఇతర స్టేషనరీ, యూనిఫాం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏ పేరుతో ప్రభుత్వ అనుమతి పొందారో అదే పేరుతో పాఠశాల నిర్వహించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఏడీ ప్రశాంత్రెడ్డి తదితరులు ఉన్నారు.
అన్ని వర్గాలను భాగస్వామ్యం చేయండి
భువనగిరి : బడిబాట కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, యువత తదితర అన్ని వర్గాలను భాగస్వాములను చేసి విజయవంతం చేయాలని డీఈఓ సత్యనారాయణ కోరారు. బుధవారం జూమ్ ద్వారా కాంప్లెక్స్ పాఠశాలలు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 6 నుంచి 19వ తేదీ వరకు జరిగే బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను చేసేందుకు కృషి చేయాలన్నారు. బడీడు, బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్చాలన్నారు. ఈనెల 12న పాఠశాలల పునఃప్రారంభం రోజును పండుగ వాతావరణంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు స్వాగతం పలకాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీ ప్రశాంత్రెడ్డి, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
ఎన్జీ కళాశాలడిగ్రీ ఫలితాలు విడుదల
రామగిరి(నల్లగొండ) : ఎన్జీ కాలేజీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల ఫలితాలను బుధవారం ఎంజీయూ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ జి.ఉపేందర్రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ విడుదల చేశారు. ఎన్జీ కళాశాల పరీక్షల నియంత్రణాధికారి బత్తిని నాగరాజు ఫలితాలను విశ్లేషించారు. బీబీఏ, బీకామ్ విభాగాల్లో అత్యధికంగా 87 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని.. చివరి సంవత్సరం పూర్తిచేసిన విద్యార్థుల్లో బీబీఏ 83శాతం, బీకామ్ 80 శాతం, బీఏ, బీఎస్సీ లైఫ్ సైన్స్ విద్యార్థులు 69శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పరంగి రవికుమార్, అడిషన్ సీఓఈ డాక్టర్ వైవి.ప్రసన్నకుమార్, అధ్యాపకులు కోటయ్య, చంద్రయ్య, నాగరాజు, రమణ పాల్గొన్నారు.
ప్రభుత్వం మాట తప్పింది
భువనగిరిటౌన్ : అధికారంలోకి రాగానే బిల్లులు చెల్లిస్తామని ఎన్నికల ముందు సర్పంచ్లకు హామీ ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డి.. మాట తప్పారని మాజీ సర్పంచ్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన భువనగిరిలో విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా బిల్లుల ప్రస్తావన తేవడం లేదన్నారు. తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, లేనట్లయితే తుర్కపల్లి మండలానికి వస్తున్న సీఎం రేవంత్రెడ్డిని అడ్డుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో మాజీ సర్పంచ్ల ఫోరం రాష్ట్ర కార్యదర్శి మేడబోయిన గణేష్, బట్కిరి బీరప్ప, ఏసిరెడ్డి మహేందర్ రెడ్డి, చుల్లేరు బీరప్ప, పండరిగౌడ్ రామచందర్రెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు
నేత్రపర్వంగా నిత్యకల్యాణం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో బుధవారం స్వామి, అమ్మవారి నిత్యకల్యాణ వేడుకను అర్చకులు పాంచరాత్రాగామ శాస్త్రంరీత్యా చేపట్టారు. కల్యాణ సేవను ఆలయంలో ఊరేగించారు. తొలుత వేకువజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టి, గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ చేపట్టి వేద మంత్రోచ్ఛరణల మధ్య నిత్యకల్యాణ వేడుక జరిపించారు.జాయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

నిబంధనల ప్రకారమే ఫీజులు వసూలు చేయాలి