వైభవంగా రేణుకా ఎల్లమ్మ కల్యాణం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా రేణుకా ఎల్లమ్మ కల్యాణం

Jun 7 2025 1:16 AM | Updated on Jun 7 2025 1:16 AM

వైభవం

వైభవంగా రేణుకా ఎల్లమ్మ కల్యాణం

కనగల్‌: దర్వేశిపురం(పర్వతగిరి) శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి– జమదగ్ని మహర్షి కల్యాణ మహోత్సవాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహించారు. డప్పుచప్పుళ్ల మధ్య ఉత్సవ విగ్రహాలను పల్లకిలో కల్యాణ మండపానికి తీసుకువచ్చి బ్రహ్మశ్రీ డేరం భాస్కర శర్మ, ఆలయ అర్చకులు నాగోజు మల్లాచారి, చిలకమర్రి శ్రవణచారి, గాదె మహేష్‌, గాదె దామోదర్‌రావు, ఫణి, శ్రీను, వేద పండితుల ఆధ్వర్యంలో కల్యాణ మహోత్సవం జరిపించారు. అంతకుముందు సుప్రభాతసేవ, లలితాసహస్త్ర నామార్చన, బాలభోగ నివేదన నిర్వహించారు. శనివారం ఉదయం 108కలశాలతో అష్టోత్తర శతఘాటాభిషేకం, సాయంత్రం 4గంటలకు దర్వేశిపురం, పర్వతగిరి గ్రామస్తులు బోనాలు సమర్పించనున్నారు.

అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

అమ్మవారికి ఎండోమెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌భాస్కర్‌రావు, ఆలయ చైర్మన్‌ చేదేటి వెంకట్‌రెడ్డి దంపతులు ప్రభుత్వం తరుపున ఈఓ జల్లేపల్లి జయరామయ్యతో కలిసి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు వీరికి వేద ఆశీర్వచనం చేశారు. అమ్మవారి కల్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సీఐ ఆదిరెడ్డి, ఎస్‌ఐ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో నల్లగొండ కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మెహన్‌రెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, ఏదుళ్ల మధుసూదన్‌రెడ్డి, ఆర్డీఏ మెంబర్‌ కూసుకుంట్ల రాజిరెడ్డి, మాజీ సర్పంచ్‌లు గోలి నర్సిరెడ్డి, గోలి జగాల్‌రెడ్డి, కంచరకుంట్ల గోపాల్‌రెడ్డి, యాదగిరి పాలకమండలి సభ్యులు నగేష్‌గౌడ్‌, నవీన్‌గౌడ్‌, శంకర్‌రెడ్డి, రాజు, రమేష్‌, వెంకన్న, బాబు, సైదులు, దుర్గమ్మ, ప్రభాకర్‌ పాల్గొన్నారు.

ఫ పట్టువస్త్రాలు సమర్పించిన

ఎండోమెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌, ఆలయ చైర్మన్‌ దంపతులు

వైభవంగా రేణుకా ఎల్లమ్మ కల్యాణం1
1/1

వైభవంగా రేణుకా ఎల్లమ్మ కల్యాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement