ముగిసిన హ్యాండ్‌బాల్‌ రాష్ట్ర స్థాయి పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన హ్యాండ్‌బాల్‌ రాష్ట్ర స్థాయి పోటీలు

Jun 7 2025 1:16 AM | Updated on Jun 7 2025 1:16 AM

ముగిసిన హ్యాండ్‌బాల్‌ రాష్ట్ర స్థాయి పోటీలు

ముగిసిన హ్యాండ్‌బాల్‌ రాష్ట్ర స్థాయి పోటీలు

బాలుర విభాగంలో

ప్రథమ స్థానంలో నిలిచిన

కరీంనగర్‌ జట్టు

బాలికల విభాగంలో వరంగల్‌

జట్టుకు ప్రథమ బహుమతి

నకిరేకల్‌ : నకిరేకల్‌ మండలం మంగళపల్లి గ్రామంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా హ్యాండ్‌ బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న 47వ తెలంగాణ హ్యాండ్‌బాల్‌ రాష్ట్ర స్థాయి పోటీలు శుక్రవారం ముగిశాయి. బాలుర విభాగంలో కరీంనగర్‌ జట్టు ప్రథమ స్థానంలో నిలవగా, ద్వితీయ స్థానంలో వరంగల్‌ జట్టు, తృతీయ స్థానంలో నల్లగొండ జట్టు నిలిచింది. బాలికల విభాగంలో వరంగల్‌ జట్టు ప్రథమ స్థానం, ఖమ్మం జట్టు ద్వితీయ, రంగారెడ్డి జిల్లా జట్టు తృతీయ స్థానం సాధించాయి. విజేతలకు జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి నర్సిరెడ్డి బహుమతులు, షీల్డులు అందజేశారు. వీరంతా ఈనెల 18 నుంచి బీహార్‌లోని నవాడలో జరిగే జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీల్లో పాల్గొననున్నారు. జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. క్రీడాకారులు స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని కోరారు. హ్యాండ్‌ బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్‌ మాట్లాడుతూ మారుమూల గ్రామమైన మంగళపల్లిలో రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహించడం హర్షణీయమన్నారు. ఉమ్మడి జిల్లా హ్యాండ్‌ బాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి చింతకాలయ పుల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఐ రాజశేఖర్‌, ఎస్‌ఐ లచ్చిరెడ్డి, స్థానిక హైస్కూల్‌ హెచ్‌ఎం కర్ర వీరారెడ్డి, కోమటిరెడ్డి ప్రతీక్‌ ఫౌండేషన్‌ సీఈఓ గోనారెడ్డి, పంచాయతీ కార్యదర్శి పలస రజిత, డాక్టర్‌ పైళ్ల భరద్వాజ్‌, స్థానిక నాయకులు లక్ష్మయ్య, పాపయ్య, ప్రకాష్‌రావు, పైళ్ల లింగయ్య, లింగరావు, మునీందర్‌రావు, సూరజ్‌కుమార్‌, వంటల ఆనంద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement