
రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు
వర్ధన్నపేట: రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య హెచ్చరించారు. వర్ధన్నపేట, రాయపర్తి, జఫర్గఢ్ పరిధిలోని విత్తన, ఎరువుల డీలర్లతో వ్యవసాయ, పోలీస్ శాఖ అధికారులు గురువారం నిర్వహించిన సమావేశంలో ఏసీపీ మాట్లాడారు. రైతులకు విత్తన, ఎరువుల డీలర్లు అన్ని రకాలుగా సహకరించాలని సూచించారు. నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయించకూడదని, రైతులకు కచ్చితంగా రశీదులు అందజేయాలి స్పష్టం చేశారు. మండల వ్యవసాయ అధికారి విజయ్కుమార్ మాట్లాడుతూ రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవాలన్నారు.వ్యాపారులు విడి విత్తనాలను విక్రయించకూడదని, మోతాదుకు మించి పురుగు మందులు పిచికారీ చేసేలా రైతులను ప్రోత్సహించకూడదన్నారు. ఎస్సైలు చందర్, రాజు, విత్తన డీలర్లు, షాపుల యజమానులు పాల్గొన్నారు.
వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య