పీవీ సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టం | - | Sakshi
Sakshi News home page

పీవీ సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టం

Jun 29 2025 2:18 AM | Updated on Jun 29 2025 2:18 AM

పీవీ సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టం

పీవీ సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టం

పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి

హన్మకొండ చౌరస్తా: రాజనీతిజ్ఞుడు, తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దివంగత ప్రధాని పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు భారతదేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేశాయని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్‌ భవన్‌లో శనివారం పీవీ నరసింహారావు 104వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పీవీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. పీవీ ఆలోచనలు, ఆర్థిక సంస్కరణలు భారత్‌ను అభివృద్ధివైపు తీసుకెళ్లాయన్నారు. అనంతరం జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం జంక్షన్‌లోని పీవీ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాసరావు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ అజీజ్‌ఖాన్‌, కార్పొరేషన్‌ ఫ్లోర్‌లీడర్‌ తోట వెంకటేశ్వర్లు కాంగ్రెస్‌ నాయకులు బంక సంపత్‌, నాయిని లక్ష్మారెడ్డి, అంకూస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement