వేడుకలు వైభవంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

వేడుకలు వైభవంగా నిర్వహించాలి

Jun 1 2025 12:55 AM | Updated on Jun 1 2025 12:55 AM

వేడుకలు వైభవంగా నిర్వహించాలి

వేడుకలు వైభవంగా నిర్వహించాలి

న్యూశాయంపేట: రాష్ట్ర అవతరణ వేడుకలను వైభవంగా నిర్వహించాలని వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఈస్ట్‌జోన్‌ డీసీపీ అంకిత్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ జి.సంధ్యారాణితో కలిసి రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ సత్యశారద మాట్లాడుతూ.. వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయం అవసరమన్నారు. ఖుష్‌మహల్‌లో ఏర్పాటు చేయనున్న అవతరణ వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి, రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వస్తున్న సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వేదిక ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ శాఖల సంక్షేమ అభివృద్ధి స్టాల్స్‌, శకటాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆఏర్పాట్లు ఆదివారం వరకు పూర్తి చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ విజయలక్ష్మి, వరంగల్‌ ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, జెడ్పీ సీఈఓ రామ్‌రెడ్డి, హౌసింగ్‌ పీడీ గణపతి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, వరంగల్‌, ఖిలావరంగల్‌ తహసీల్దార్లు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ సత్యశారద

అధికారులతో సమావేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement