అమరవీరులకు మంత్రి కొండా సురేఖ నివాళి | - | Sakshi
Sakshi News home page

అమరవీరులకు మంత్రి కొండా సురేఖ నివాళి

Jun 3 2025 6:55 AM | Updated on Jun 3 2025 6:55 AM

అమరవీ

అమరవీరులకు మంత్రి కొండా సురేఖ నివాళి

హన్మకొండ అర్బన్‌ : తెలంగాణ సమగ్రాభివృద్ధి–2047 విజన్‌తో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది.. అందులో పేదల సంక్షేమం, సమగ్ర పాలసీ రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్‌ఫ్రా డెవలప్మెంట్‌, పారదర్శకత, సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తూ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యావరణ అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హనుమకొండ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్‌ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్రంలో, జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ముఖ్యంగా మహిళల అభ్యున్నతి, పర్యాటక అభివృద్ధి, నూతన ఉద్యోగాల కల్పన, మహిళా సాధికారికత వంటి అంశాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు తెలిపారు. అనంతరం 25 మంది తెలంగాణ అమరవీరుల కుటుంబాల బంధువులను సత్కరించారు. పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు.

ఆడబిడ్డలకు అండగా..

ప్రభుత్వం ఆడబిడ్డల అభ్యున్నతికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నదని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఇందులో భాగంగానే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అమలుతో జిల్లాలో ఇప్పటి వరకు 5.50 కోట్ల మంది ప్రయాణించి రూ.222.50 కోట్లు ఆదా చేశారని చెప్పారు. రూ.500లకే వంట గ్యాస్‌ ఇస్తున్నామని, అలాగే పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో మొదటి దశలో 705, రెండో దశలో 5వేల ఇళ్లు మంజూరు చేశామని చెప్పిన మంత్రి ప్రతి సోమవారం ఇందుకు సంబంధించిన నిధులు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. రైతు రుణ విముక్తి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 54,734 మందికి రూ.450 కోట్లు మాఫీ చేసినట్లు తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం, సన్న వడ్లకు రూ.500 బోనస్‌ చెల్లిస్తున్నామని చెప్పారు. భూమి లేని పేదలకు రూ.12 వేలు ఆత్మీయ భరోసా అందజేస్తున్నామని, మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేసేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 5,052 స్వయం సహాయక సంఘాలకు రూ.511 కోట్లు అందజేశామని తెలిపారు. 8,446 సంఘాలకు రూ.18.33 కోట్లు వీఎల్‌ఆర్‌ ఇచ్చినట్లు వివరించారు.

నిరుపేదలకు సన్నబియ్యం..

ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉగాది నుంచి రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, జిల్లాలో 13,389 టన్నుల బియ్యం ప్రతి నెలా సరఫరా చేస్తున్నామని తెలిపారు. కొత్తగా 20,633 కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేశామని చెప్పారు. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటేడ్‌ మోడల్‌ స్కూల్స్‌ నియోజకవర్గానికి ఒకటి కేటాయించామని, అలాగే పాఠశాల విద్యా కమిషన్‌ ఏర్పాటు చేశామని తెలిపారు.

రైతుల సమస్యలు తీర్చేందుకు ‘భూ భారతి’..

రైతుల భూ సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని, జిల్లాలోని నడికూడ మండలాన్ని పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశామన్నారు. జిల్లాలో చిన్న తరహా పరిశ్రమలకు టీఎస్‌ఐపాస్‌ ద్వారా 115 దరఖాస్తులు రాగా 83 అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. క్రీడా అభివృద్ధిలో భాగంగా రూ.7 కోట్లతో జేఎన్‌ఎస్‌ సింథటిక్‌ ట్రాక్‌ నిర్మించామని, ఖేలో ఇండియా పథకంలో భాగంగా బాక్సింగ్‌ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. యువతకు నైపుణ్యాల అభివృద్ధి కోసం బ్యూటీషియన్‌, మగ్గం, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, గార్మెంట్‌, ఎంఎస్‌ ఆఫీస్‌ వంటి రంగాల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా వంగర గ్రామంలో రూ.7 కోట్లతో పీవీ విజ్ఞాన కేంద్రం అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇటీవల ప్రపంచ సుందరీమణులు జిల్లాను సందర్శించారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అందరి సహకారంతో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లా, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దూసుకువెళ్లేలా కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో వరంగల్‌ ఎంపీ కడియం కావ్య, వరంగల్‌ సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌, జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే, హనుమకొండ కలెక్టర్‌ ప్రావీణ్య, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

వైద్య ఆరోగ్య శకటానికి మొదటి బహుమతి

ఎంజీఎం : వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ శకటాలను ప్రదర్శించారు. ఇందులో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రదర్శించిన శకటానికి మొదటి బహుమతి లభించిందని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అప్పయ్య తెలిపారు. శకటంలో సీజనల్‌ వ్యాధులు, టీబీ, ఎన్‌సీడీలకు సంబంధించిన అంశాలను ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. మాతా శిశు సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా శ్రీకాన్పునకు రా తల్లి ప్రభుత్వ ఆస్పత్రికిశ్రీ అనే థీమ్‌తో గర్భిణుల నమోదు నుంచి పరీక్షలు, ప్రసవం వరకు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేయించుకోవాలని స్కిట్‌ ద్వారా నిర్వహించిన ప్రదర్శనకు మంత్రి సురేఖ, కలెక్టర్‌ ప్రావీణ్య, అధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నట్లు ఆయన వివరించారు.

సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కార్యాచరణ

రైతుల సమస్యలు తీర్చేందుకు ‘భూభారతి’

ఇందిరమ్మ ఇళ్లతో పేదల కల సాకారం

రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో

మంత్రి కొండా సురేఖ

హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగం చేసిన అమరులకు మంత్రి కొండా సురేఖ నివాళులర్పించారు. హనుమకొండలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద మంత్రి సురేఖ, హనుమకొండ కలెక్టర్‌ పి.ప్రావీణ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, నగర మేయర్‌ గుండు సుధారాణి, కమిషనర్‌ ఆశ్విని తానాజి వాఖడే నివాళులర్పించారు.

అమరవీరులకు మంత్రి కొండా సురేఖ నివాళి1
1/6

అమరవీరులకు మంత్రి కొండా సురేఖ నివాళి

అమరవీరులకు మంత్రి కొండా సురేఖ నివాళి2
2/6

అమరవీరులకు మంత్రి కొండా సురేఖ నివాళి

అమరవీరులకు మంత్రి కొండా సురేఖ నివాళి3
3/6

అమరవీరులకు మంత్రి కొండా సురేఖ నివాళి

అమరవీరులకు మంత్రి కొండా సురేఖ నివాళి4
4/6

అమరవీరులకు మంత్రి కొండా సురేఖ నివాళి

అమరవీరులకు మంత్రి కొండా సురేఖ నివాళి5
5/6

అమరవీరులకు మంత్రి కొండా సురేఖ నివాళి

అమరవీరులకు మంత్రి కొండా సురేఖ నివాళి6
6/6

అమరవీరులకు మంత్రి కొండా సురేఖ నివాళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement