
6.8కిలోల గంజాయి స్వాధీనం
శాయంపేట : మండలంలోని మాందారిపేట స్టేజి వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రంజిత్రావు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మాందారిపేట స్టేజి వద్ద ఎస్సై జక్కుల పరమేష్.. సిబ్బందితో కలిసి మంగళవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. ఎస్సై అతడి వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా గంజాయి ఉన్నట్లు గుర్తించారు. వాటిని తూకం వేయగా 6 కిలోల 85 గ్రాములు ఉండగా, దీని విలువ సుమారు రూ.3.10లక్షల వరకు ఉంటుంది. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా మహారాష్ట్రలోని చంద్రాపూర్కు చెందిన సయ్యద్ షారుఖ్ జాకీరుద్దీన్ అహ్మద్గా గుర్తించారు. ఒడిశాకు చెందిన జితేంద్ర కుమార్ వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నట్లు ఒప్పుకున్నాడు. అతడిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించగా, జితేంద్ర కుమార్ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. గంజాయిని పట్టుకున్న ఎస్సై, సిబ్బందిని సీఐ అభినందించారు.

6.8కిలోల గంజాయి స్వాధీనం