రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Jun 23 2025 5:32 AM | Updated on Jun 23 2025 5:32 AM

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

మదనపురం: ప్రాజెక్టులు నిర్మించి ఆయకట్టురైతులకు సాగునీరు అందిస్తున్న ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని దేవరకద్ర, వనపర్తి ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని తిర్మలాయపల్లి సమీపంలో ఉన్న భీమా ఫేజ్‌–2 ఎత్తిపోతల పంప్‌హౌస్‌ వద్ద పూజలు చేసి ఆయకట్టుకు సాగునీటిని వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పని చేస్తున్నారని వెల్లడించారు. భీమా ఫేస్‌–2 ద్వారా వనపర్తి, దేవరకద్ర, కొల్లాపూర్‌ నియోజకవర్గాలకు చెందిన 48 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. వర్షాలు ముందస్తుగా కురవడంతో జూన్‌లోనే రైతులకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. భీమాకు నీటిని విడుదల చేయడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పల్లెపాగ ప్రశాంత్‌, శేఖర్‌రెడ్డి, వేముల శ్రీనివాసరెడ్డి, శరత్‌రెడ్డి, సమన్వయ కమిటీ కో–ఆర్డినేటర్‌ మహేష్‌, హనుమాన్‌రావు, వడ్డె కృష్ణ, వడ్డె రాములు, వెంకట్‌ నారాయణ, గోపి స్వామి, సాయిబాబా, మహదేవన్‌గౌడ్‌, అంజద్‌ అలీ, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement