
సంత చింత తీరేనా?
ఖిల్లాఘనపురంలో అసంపూర్తిగా వే సైడ్ మార్కెట్
●
రాకపోకలకు
ఇబ్బందులు..
మండల కేంద్రంలో ప్రధాన రహదారులకు ఇరువైపులా కూరగాయలు, మాంసం విక్రయిస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం. వేసైడ్ మార్కెట్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. మిగిలిన కొద్దిపాటి పనులు పూర్తిచేసి ప్రారంభించి అన్ని వ్యాపారాలు అక్కడే జరిగేలా చూడాలి.
– పాలవాది శ్రీనివాసులు, ఖిల్లాఘనపురం
చేపల మార్కెట్ లేదు..
మండల కేంద్రంలో చేపలు విక్రయించేందుకు ప్రత్యేకంగా మార్కెట్ లేదు. కొత్తగా నిర్మించే వేసైడ్ మార్కెట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. నిర్మాణం పూర్తిగాకపోవడంతో మహబూబ్నగర్కు వెళ్లే రహదారి పక్కన విక్రయాలు చేపడుతున్నాం. వాహనాలు పెద్ద సంఖ్యలో రాకపోకలకు సాగిస్తుండటం ఇబ్బందిగా మారింది.
– బెస్త గోపాల్, ఖిల్లాఘనపురం
త్వరగా పూర్తిచేస్తాం..
ఖిల్లాఘనపురంలో వే సైడ్ మార్కెట్ నిర్మాణంలో ఉంది. 90 శాతం పనులు పూర్తయ్యాయి.. ఇంజనీరింగ్శాఖ అధికారులతో మాట్లాడి మిగిలిన పనులు పూర్తి చేయించి వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. వినియోగంలోకి వస్తే కూరగాయలు, చేపలు, మాంసం అన్నింటిని అక్కడే విక్రయించుకునే అవకాశం ఉంటుంది.
– స్వరణ్సింగ్, డీఎం, మార్కెటింగ్శాఖ
ఖిల్లాఘనపురం: మండల కేంద్రంలో కూరగాయలు, చేపలు, మాంసం రోడ్లపైన విక్రయిస్తుండటంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని 2023లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వేసైడ్ మార్కెట్ భవన నిర్మాణానికి రూ.1.90 కోట్లు మంజూరు చేసింది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ 90 శాతం పనులు పూర్తి చేసి బిల్లులు రాకపోవడంతో మిగిలిన 10 శాతం పనులు చేపట్టడం లేదు. సీసీ, విద్యుత్ సౌకర్యం తదితర పనులు పూర్తి చేస్తే వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. సంబంధిత శాఖ అధికారులు, పాలకులు స్పందించి కాంట్రాక్టర్కు బిల్లులు ఇప్పించి మిగతా పనులు చేయించి ఉపయోగంలోకి తీసుకురావాలని పట్టణవాసులు కోరుతున్నారు.
రోడ్లపైనే విక్రయాలు..
వే సైడ్ మార్కెట్ నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో యధావిధిగా ఖిల్లాఘనపురం, మామిడిమాడ, పర్వతాపురం, అప్పారెడ్డిపల్లి తదితర గ్రామాలకు వెళ్లే రహదారులకు ఇరువైపులా కూరగాయలు, మాంసం విక్రయాలు చేపడుతున్నారు. వనపర్తి–మహబూబ్నగర్ ప్రధాన రహదారి పక్కన చేపలు విక్రయిస్తున్నారు. రహదారుల పక్కన చిరు వ్యాపారులు విక్రయాలు చేపడుతుండటంతో వాహనదారులు, దారి వెంట వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం వారాంతపు సంత రోజున ఇబ్బందులు వర్ణనాతీతం.
నిర్మాణానికి రూ.1.90 కోట్లు మంజూరు.. 90 శాతం పనులు పూర్తి
బిల్లులు రాక అర్ధాంతరంగా
వదిలేసిన కాంట్రాక్టర్
ప్రధాన రహదారులపైనే
కూరగాయలు, మాంసం, చేపల విక్రయం
ఇబ్బందులకు గురవుతున్న
వాహనదారులు, ప్రజలు

సంత చింత తీరేనా?

సంత చింత తీరేనా?

సంత చింత తీరేనా?