
పాలిసెట్ కౌన్సెలింగ్కు విశేష స్పందన
మురళీనగర్: పాలిటెక్నిక్ కాలేజీల్లో టెక్నికల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఆదివారం నిర్వహించిన పాలిసెట్ కౌన్సెలింగ్కు విశేష స్పందన లభించింది. అత్యధిక సంఖ్యలో విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరయ్యారు. ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ ఇన్స్టిట్యూట్ (గైస్), కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ కేంద్రాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సందడిగా కనిపించాయి. వాతావరణం చల్లగా ఉండటంతో కౌన్సెలింగ్ సజావుగా సాగింది. తల్లిదండ్రులు విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కౌన్సెలింగ్ సాగిందిలా..
● పాలిటెక్నిక్ కాలేజీలో రెండో రోజు 23,501 నుంచి 32,000 ర్యాంకు వరకు నిర్వహించిన కౌన్సెలింగ్లో 340 మంది సర్టిఫికెట్లను పరిశీలించారు. వీరిలో 263 మంది బీసీ, 36 మంది ఓసీ, 32 మంది ఎస్సీ, 9 మంది ఎస్టీ విద్యార్థులు ఉన్నారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్ కె.రత్నకుమార్ పర్యవేక్షణలో చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ డాక్టర్ పీఎం భాషా, లెక్చరర్ నాగరాజు కౌన్సెలింగ్ చేపట్టారు. సోమవారం 40,001 నుంచి 50,000 ర్యాంకుల వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
● గైస్లో ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ రమణ పర్యవేక్షణలో 15,001 నుంచి 23,500 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో 290 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. సోమవారం 32,001 నుంచి 40,000 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.