
సేలం, ఈరోడ్లో వినూత్నంగా ఆహ్వానం
సేలం: సేలం, ఈరోడ్లో వేసవి సెలవుల తర్వాత సోమవారం పాఠాలలు పునఃప్రారంభయ్యాయి. ఈ సందర్భంగా వేడుకలను తలపించేలా డప్పు వాయిద్యాల హోరుతోపాటు హరతి పట్టి విద్యార్థులను ఉపాధ్యాయులు ఆహ్వానించారు. ఈ రోడ్లోని పన్నీర్సెల్వం పార్క్ ప్రభుత్వ బాలికల హయ్యర్ సెకండరీ పాఠశాలలో విద్యార్థులను స్వాగతించడానికి రంగురంగుల బెలూనన్లతో తోరణాలు ఏర్పాటు చేశారు. పాఠశాలకు వచ్చిన ప్రతి విద్యార్థికీ ఉపాధ్యాయులు గులాబీ పువ్వులను అందజేసి ఆహ్వానించారు. కార్పొరేషన్ మిడిల్ స్కూల్లో ప్రధానోపాధ్యాయురాలు సుమతి నేతృత్వంలోని ఉపాధ్యాయులు విద్యార్థులను హారతి పట్టి, పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతించారు. అలాగే, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును ప్రోత్సహించడానికి టాప్ 30 జాబితాలోని కొత్త విద్యార్థులకు వెండి నాణేలను ప్రదానం చేశారు. వీరప్పన్ చత్ర ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను స్వాగతించడానికి అరటి గెలులు, చెరుకులతో పందిళ్లు, ఆర్చీలను ఏర్పాటు చేశారు. గోపిచెట్టిపాళయం, పెరుందురై, అంతియూర్, మొదకురిచ్చి, కొడుముడి, సత్యమంగళం, భవాని సాగర్లోనూ ఇలాగే ఏర్పాట్లు వినూత్నంగా చేయడం విశేషం.

సేలం, ఈరోడ్లో వినూత్నంగా ఆహ్వానం